S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/28/2018 - 23:52

చొప్పదండి, సెప్టెంబర్ 28: తన కళ్లను దానం చేసి పది మందికి చూపు కల్పించాలన్న ఆమె కోరికను ఆమె మరణానంతరం వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు కరీంనగర్ లయన్స్ క్లబ్‌కు సమాచారాన్ని అందించడంతో వారు వెంటనే చేరుకొని నేత్రాలను సేకరించారు. ఈ మేరకు చొప్పదండి మండలంలోని కొలిమికుంట గ్రామానికి చెందిన గుడిపాటి లక్ష్మి (76) శుక్రవారం ఉదయం మరణించింది.

09/28/2018 - 23:47

రామన్నపేట, సెప్టెంబర్ 28: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌గురై రైతు మృతిచెందిన ఘటన మండలంలోని జనంపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్థులు, మృతునికి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జనంపల్లి గ్రామానికి చెందిన రైతు ఎర్రబోయిన కోటయ్య (60) తెల్లవారుజామున తన పొలం వద్దకు వెళ్లాడు.

09/28/2018 - 23:40

జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్28: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కర్రెద్దుల పార్థసారథి శుక్రవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కారు. 70 చదరపు గజాల స్థలం రిజిస్ట్రేషన్ కోసం బుట్టాయగూడెంకు చెందిన కె గుణనాగతేజ నుండి రూ. 6,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

09/28/2018 - 22:48

ఒంగోలు, సెప్టెంబర్ 28: ఒంగోలులోని గుంటూరు రోడ్డులో గల రవిప్రియా మాల్‌కు ఉత్తరం వైపుగల వేస్ట్ మెటీరియల్ స్టోరూంలో ఇటీవల కేబుల్ వైర్‌తో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్న సెంట్రింగ్ సబ్ కాంట్రాక్టర్ పల్లపు శ్రీను ఆత్మహత్య కేసులో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను ఒంగోలు తాలూకా పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం నాడు కోర్టు కు హాజరు పరచగా ఆ ఇద్దరు వ్యక్తులకు కోర్టు రిమాండ్ విధించినట్లు ఒంగోలు తాలూకా

09/28/2018 - 22:47

అర్థవీడు, సెప్టెంబర్ 28: మతిస్థిమితం లేని భర్త గొడ్డలితో భార్యపై దాడిచేసి గాయపరచిన సంఘటన శుక్రవారం మండలంలోని పాపినేనిపల్లి గ్రామంలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన దొంత పెద్దఅల్లూరయ్య కుమారుడు వెంకటేశ్వర్లుకు కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదు.

09/28/2018 - 22:43

రాపూరు, సెప్టెంబర్ 28: రాపూరు మండలం కండలేరు డ్యామ్‌లోని తెలుగుగంగ కాలనీకి చెందిన ఓ నివాసగృహంలో శుక్రవారం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వారు దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా బి టైప్ ప్రభుత్వ నివాసగృహంలోని 14వ నెంబరు ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం, పప్పుదినుసలతో పాటు నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు పక్కా సమాచారంతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

09/28/2018 - 22:41

పొదలకూరు, సెప్టెంబర్ 28 : పశువులను మేతకు తీసుకెళ్లిన ఈశ్వరయ్య (52) అనే రైతు కాలువలో పడి మృతిచెందిన ఉదంతం మండలంలోని నేదురుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈశ్వరయ్య గురువారం పశువులను మేపేందుకు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తోలుకెళ్లాడు. అక్కడ పొరపాటున కాలువలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

09/28/2018 - 22:35

కేవీబీపురం, సెప్టెంబర్ 28: భార్యపై హత్యాయత్నానికి ప్రయత్నించిన కేసులో భర్తకు రిమాండ్ విధించిన సంఘటన కేవీబీపురం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఈనెల 25వ తేదీ మంగళవారం కేశవ వరలక్ష్మి (31)పై భర్త కేశవ జగన్నాథం అలియాస్ జగన్ కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దంపతుల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరిగేవి. రోజూ మద్యం తాగి భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు.

09/28/2018 - 22:33

చిత్తూరు, సెప్టెంబర్ 28: పోలీసు స్టేషన్ ఆవరణలో నిలిపి ఉన్న లారీ నిచ్చెనకు ఉరి వేసుకొని లారీ డ్రైవర్ ఆత్యహత్యకు పాల్పడిన సంఘటన చిత్తూరు నగరంలో కలకలం సృష్టించింది. మద్యం తాగి లారీని నడుపుతుండగా నగర ట్రాఫిక్ పోలీసులకు పట్టు బడిన లారీ డ్రైవర్ పోలీసు స్టేషన్ ఆవరణలోని లారీ నిచ్చెనకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడం సంచలం సృష్టించింది.

09/28/2018 - 22:06

గుంటూరు, సెప్టెంబర్ 28: ఆన్‌లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా అర్బన్ పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్‌పి విజయారావు మీడియాకు వెల్లడించారు.

Pages