-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
జి.కొండూరు, సెప్టెంబర్ 27: కట్టుబడిపాలెంలో డీజిల్ మాఫియాపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు విజయవాడ డివిజిన్ ఎఎస్ఒ కోమలి పద్మ, పిడిఎస్ డిటి రామకృష్ణ దాడులు చేశారు. ఇక్కడ పలు చమురు సంస్థల నుంచి పెట్రో ఉత్పత్తులను లోడింగ్ అయిన తర్వాత ట్యాంకర్ల నుంచి డ్రైవర్లతో కుమ్మకై దొంగిలిస్తున్నారు.
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 27: చైన్స్నాచింగ్లకు పాల్పడిన కేసులో ఓ వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి రూ.3.50 లక్షలు విలువైన 12.5కాసుల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీసీపీ బి రాజకుమారి తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 27: రాత్రి వేళ ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన పాత నేరస్తుడిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి రూ.5.75 లక్షలు విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీసీపీ బి రాజకుమారి తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
అనంతగిరి, సెప్టెంబర్ 27: మండలంలోని గుమ్మ పంచాయతీ కరకవలస గ్రామానికి చెందిన గిరిజనుడు బుధవారం రాత్రి హత్యకు గురయ్యాడు. కరకవలస గ్రామానికి చెందిన బికారి (50) అనే గిరిజనుడు బుధవారం డుముకు వారపు సంతకు వెళ్లి తన గ్రామానికి వెళుతుండగా కరకవలస గ్రామ సమీపాన గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డిలితో నరికి హతమార్చారు. అయితే ఈ సంఘటనకు ఎవరు పాల్పడ్డారు, ఎందుకు హత్య చేసారన్నది ఇంకా తెలియరాలేదు.
బేస్తవారపేట, సెప్టెంబర్ 27: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏర్పడిన ఆర్థిక వివాదాల కారణంగా రియల్టర్ను దారుణంగా హత్య చేసిన సంఘటన మండల కేంద్రం బేస్తవారపేటలో గురువారం తెల్లవారుజామున జరిగింది. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మద్దుల రమణారెడ్డి(50) స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్నాడు.
అవుకు, సెప్టెంబర్ 27:మండల పరిధిలోని కొండమనాయునిపల్లె గ్రామానికి చెందిన కోనేటి సుంకన్న(36) గురువారం విద్యుత్ షాక్కు గురై మృతిచెందగా మెకానిక్ రాజు తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితిలో పడిపోయాడని స్థానికులు వెల్లడించారు. వివరాలు.. తన వ్యవసాయ పొలంలోని బోరు పని చేయకపోవడంతో సుంకన్న రుద్రవరం గ్రామానికి చెందిన మెకానిక్ రాజును తీసుకెళ్లి మరమ్మతులు చేయించాడు.
రాజాం, సెప్టెంబర్ 27: రాజాం పట్టణం పరిధిలోని యాతపేట కాలనీకి చెందిన వేపల శ్రీనివాసరావు(57) అనే వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గురువారం కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల పదో తేదీ నుంచి శ్రీనివాసరావు కనిపించకుండాపోయాడని, ఈ మేరకు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు విచారణ జరుపుతుండగానే మృతదేహం బయటపడింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చంద్రగిరి, సెప్టెంబర్ 27: తిరుపతి రూరల్ మండలం కాలూరు బైపాస్రోడ్డు కొప్పరవాండ్లపల్లి వద్ద కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఈ సంఘటనలో తిరుపతి సింగాలగుంటకు చెందిన సుధీర్ (26), దామోదరంలు అక్కడికక్కడే మృతిచెందగా, రమేష్, జయప్రకాష్, చరణ్ అనే ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి రుయాసుపత్రికి తరలించారు.
తిరుపతి, సెప్టెంబర్ 27: స్థానిక చింతలచేను వద్ద ఉన్న రైల్వేట్రాక్పై బుధవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న యువకుడు ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో ట్రిపుల్ ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అశోక్గా గుర్తించారు. అశోక్ ఆత్మహత్యకు ప్రిన్సిపల్, ప్రొఫెసర్లే కారణమంటూ విద్యార్థులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా ప్రిన్సిపల్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
బద్వేలు, సెప్టెంబర్ 27: నిషేధిత గుట్కా, ఖైనీలను విక్రయిస్తున్న బద్వేలు పట్టణంలోని ముగ్గురు నిర్వాహకుల ఇళ్లపై గురువారం విజిలెన్స్ అధికారులు దాడులుచేసి 15 లక్షలు రూపాయలు విలువగల 110 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు.