S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/27/2018 - 23:11

దువ్వూరు, సెప్టెంబర్ 27: కడప-కర్నూలు జాతీయ రహదారిలో దువ్వూరు సమీపంలోని గురువారం క్రీస్తురాజపురంవద్ద ఆగిఉన్న లారీని మరో లారీ ఢీకొన్న సంఘటనలో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో లారీ డ్రైవర్ సజీవదహనం అయ్యాడని ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు.

09/27/2018 - 03:42

సిద్దిపేట, సెప్టెంబర్ 26 : సిద్దిపేట శివారు రాఘవేంద్రనగర్‌లో ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి 5తులాల బంగారం, 20తులాల వెండి, 20వేల నగదును అపహరించారు. సిద్దిపేట వన్‌టౌన్ ఎస్‌ఐ పోలీసుల కథనం వివరాలు ఇలావున్నాయి. రాఘవేంద్రనగర్‌కు చెందిన వేణు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఈనెల 20న సాయంత్రం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారు.

09/27/2018 - 03:40

అమరచింత, సెప్టెంబర్ 26: తుక్యనాయక్ తాండ నుంచి సోమవారం అర్థరాత్రి బొలేరో వాహనంలో 30 క్వింటాల్ రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తుండగా స్థానికుల సమాచారంతో పోలీసులు పట్టుకున్న విషయం విదితమే.

09/27/2018 - 01:18

ఇటిక్యాల, సెప్టెంబర్ 26: గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్ళి ప్రమాదశాత్తు కృష్ణా నదిలో గల్లంతై ఇద్దరు హైదరాబాద్ యువకులు మృతి చెందారు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మండల పరిధిలోని బీచుపల్లి కృష్ణానది పుష్కర ఘాటు దగ్గర చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్సై జగదీశ్వర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి.

09/27/2018 - 00:37

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 26: పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై గొడ్డళ్లతో పరిగెత్తించి హతమార్చిన సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. గొడ్డలిని పట్టుకొని రోడ్డుపై పరిగెత్తించి ప్రయాణికులు, ట్రాఫిక్, లాఅండ్‌ఆర్డర్ పోలీసుల కళ్ల ముందే హతుడిని విచక్షణా రహితంగా దాడి చేసి చంపారు. హతుడు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నప్పటికీ, నిందితులను ఎదుర్కొనేందుకు ప్రతిఘటించినా క్షణాల వ్యవధిలో హత్య చేశారు.

09/27/2018 - 00:20

రావికమతం, సెప్టెంబర్ 26: పొలం పనుల్లో పాల్గొనేందుకు వెళ్ళిన రైతు స్పృహ తప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. మండలంలో మేడివాడ గ్రామంలో బుధవారం చోటు చేసుకున్న ఈసంఘటనకు సంబంధించి రావికమతం ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేడివాడ గ్రామానికి చెందిన సీహెచ్ అప్పలనాయుడు(40) పొలం పనుల కోసం ఉదయం వెళ్ళి పొలానికి నీరు పెడుతుండగా స్పృహ తప్పి పొలంలోకి జారిపడిపోయాడన్నారు.

09/27/2018 - 00:20

కోటవురట్ల, సెప్టెంబర్ 26: మండలంలో రామచంద్రపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈసంఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై మధుసూధనరావు బుధవారం అందజేసిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం గ్రామానికి చెందిన యువకుడు కొండ అశోక్‌కుమార్ (23) గ్రామంలో ఇంటి నుంచి రామాలయానికి వస్తుండగా మితిమీరిన వేగంతో వస్తున్న ట్రాక్టర్ ఢీ కొంది.

09/27/2018 - 00:14

కూచిపూడి, సెప్టెంబర్ 26: న్యాయస్థానం ఆదేశం మేరకు మొవ్వ తహశీల్దార్ రామానాయక్ సూచనల మేరకు స్థలం కొలుస్తున్న అధికారులను చూసి ఆందోళన చెందిన వివాహిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మొవ్వ మండలం నిడుమోలులో చోటు చేసుకుంది.

09/27/2018 - 00:10

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 26: నగరంలో సీఐడీ, టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించారు. పలుచోట్ల గుట్టుచప్పుడు కాకుండా పెద్దఎత్తున వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో ఈ బృందాలు తనిఖీలు నిర్వహించారు.

09/27/2018 - 00:09

కంకిపాడు, సెప్టెంబరు 26: విద్యుదాఘాతానికి గురై ఓ ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన మంతెన గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని మంతెన గ్రామానికి చెందిన డీ ఏడుకొండలు (55) తన ఇంటి వద్ద బోరు బావి మోటర్ సరిగా పనిచేయటం లేదని దానిని పరిశీలించేందుకు చేతిపంపుని పట్టుకుని చూస్తుండగా వర్షం కురవటంతో విద్యుదాఘాతానికి గురైయ్యాడు.

Pages