-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
కేవీబిపురం, సెప్టెంబర్ 26: మండలంలోని రాగిగుంట గ్రామంలో కేశవజగన్నాథం తన భార్య వరలక్ష్మిపై కిరోసిన్ పోసి తగలబెట్టడంతో ఆమె తీవ్రగాయాల పాలైంది. ఆమెను హుటాహుటిన శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాసుపత్రికి తరలించారు. వరలక్ష్మి పేరుపై ఉన్న హౌసింగ్ నగదు 70వేల రూపాయలను విలాసాలకు భర్తకు ఇవ్వకపోవడంతో భార్యాభర్తల మధ్య వివాదానికి దారితీసింది.
సంబేపల్లె, సెప్టెంబర్ 26: మండల పరిధిలోని రౌతుకుంట-దినె్నమీదపల్లె గ్రామీణ రోడ్డు మార్గమధ్యలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీకొని లక్షుమయ్య(36) మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
వికారాబాద్, సెప్టెంబర్ 25: నగరాల్లోని కార్పొరేట్ కళాశాలల్లో చోటుచేసుకున్న విద్యార్థుల అనుమానాస్పద మృతి సంఘటన గ్రామీణ ప్రాంతానికి పాకింది. స్థానిక గౌతమి జూనియర్ కళాశాలలో మంగళవారం తెల్లవారుజామున విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
వనస్థలిపురం, సెప్టెంబర్ 25 : తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మహేష్భగవత్ నిందితుడి వివరాలను వెల్లడించారు. చడీ డగ్యాంగ్లో ఒకడైన ఖజుమవోజిని ఎస్ఓటీ, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
గచ్చిబౌలి, సెప్టెంబర్ 25: అందమైన యువతుల ఫోటోలను వెబ్సైట్లో పెట్టి యువకులకు యువతులను ఎస్కాట్గా పంపిస్తామని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
ఉప్పల్, సెప్టెంబర్ 25: పెళ్లిలో క్యాష్ బ్యాగ్ చోరీ కేసులో తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు దొంగలను మేడిపల్లి క్రైం పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద రూ.2.5లక్షల విలువైన 6.8తులాల బంగారం, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఏసీపీ గోనె సందీప్ ఇన్స్పెక్టర్లు బీ.అంజి రెడ్డి, దేవేందర్తో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
పెరవలి, సెప్టెంబర్ 25: విద్యుదాఘాతమై ఆపదలో వున్న యువతిని రక్షించి, ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఒక యువకుని ఉదంతమిది. మండలంలోని కాకరపర్రులో మంగళవారం జరిగిన ఈ ఘటనలో తేతలి గ్రామానికి చెందిన వీరవల్లి వీరవెంకట ప్రసాద్ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
చీరాల, సెప్టెంబర్ 25: పట్టణంలోని ఓ ప్రయివేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థి మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చీరాలలో చర్చనీయాంశమైంది. విద్యార్థి సంఘాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండల పరిధిలోని ఈపూరుపాలెం గ్రామానికి చెందిన ఎన్ సురేంద్రబాబు కుమారుడు మురళీకృష్ణ శాంతి థియేటర్ రోడ్డులోని ఓ కళాశాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
రేణిగుంట, సెప్టెంబర్ 25: కడప-రేణిగుంట జాతీయ రహదారిలో మండల పరిధిలోని మామండూరు వద్ద రెండు లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు మృతి చెందిన సంఘటన మంగళవారం తెల్లవారు జామున రెండు గంటలకు చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రేణిగుంట నుంచి సిమెంట్ బస్తాలతో కడప వైపు వెడుతున్న మినీ ఈచర్ లారీ, కడప నుంచి ఐరన్ ఓర్తో రేణిగుంట వైపు వస్తున్న తమిళనాడుకు వెడుతున్న లారీ మామండూరు వద్ద ఢీకొన్నాయి.
రామచంద్రాపురం, సెప్టెంబర్ 25: ఈత కోసం రాయలచెరువుకు వచ్చి నీటిలో మునిగి మృత్యు ఒడిలో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. రామచంద్రాపురం పోలీస్స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రభావతి వివరాల మేరకు తిరుపతి దాసరిమఠానికి చెందిన మాధవ్ (14) స్నేహితులు ప్రకాష్, శివసాయి, కార్తీక్, ఫయాజ్, పవన్లతో కలసి రాయల్చెరువులో సరదాగా ఈత కొట్టడానికి వచ్చారు. ఈత కొడుతూ మాధవ్ నీటిలో మునిగిపోయాడు.