-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
కర్నూలు సిటీ, సెప్టెంబర్ 22: కొత్త ఇంటి యజమాని పేరు మార్చేందుకు రూ.6 వేలు లంచం తీసుకున్న కర్నూలు నగర పాలక సంస్థ బిల్ కలెక్టర్ ఎస్ఎండీ షరీఫ్ను ఏసీబీ అధికారులు శనివారం అరెస్టు చేశారు. నగరానికి చెందిన జహంగీర్ ఖాశీం బాలాజీనగర్లో కొన్న ఇంటిని తన పేర మార్చుకునేందుకు బిల్ కలెక్టర్ను కలవగా ఆయన రూ. 6 వేలు లంచం అడిగాడు. దీంతో ఖాశీం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
వరంగల్ క్రైం, సెప్టెంబర్ 22: ఒంటరిగా ఆటోలో ప్రయాణించే ప్రయాణికులను నిర్మానుష్య ప్రాంతాల్లోకి తీసుకెళ్లి దోపిడీలకు పాల్పడుతు న్న ఇద్దరిని శనివారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారినుండి రూ.4.57లక్షల విలువచేసే 115 గ్రాముల బంగారు అభరణాలు, ఆటో, ద్విచక్రవాహనం, సెల్ఫోన్, ఫ్రిడ్జ్ను స్వాధీనం చేసుకున్నారు.
బాసర, సెప్టెంబర్ 22: నిర్మల్ జిల్లా బాసర ఆర్జేయుకేటీ యూనివర్సిటిలో శనివారం విద్యార్థిని కళాశాల వసతిభవనంపై నుండి పడి ఆత్మహత్యకు పాల్పడిందని బాసర ఎస్సై మహేష్ తెలిపారు. పోలీసులు కళాశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన అనూష (17) ఆర్జేయుకేటీలో పీయుసీ రెండవ సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. శనివారం ఉ. 12 గంటల ప్రాంతంలో కళాశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
సిమ్లా, సెప్టెంబర్ 22: హిమాచల్ప్రదేశ్లోని సిమ్లా జిల్లాలో శనివారం ఒక వాహనం లోయలో పడి మూడు జంటలు సహా మొత్తం 13 మంది మృతి చెందారు. కుడ్డు నుంచి టియుని రోడ్డు మీదుగా వెళ్తున్న ఈ వాహనం సనైల్ వద్ద బాగా లోతున్న లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.
కూసుమంచి, సెప్టెంబర్ 22: హైదరాబాద్లో గాంధీభవన్ ముందు ఆత్మహత్యకు యత్నించిన కౌలురైతు శనివారం మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే కూసుమంచి మండలంలోని భగవత్వీడు గ్రామానికి చెందిన దేవబత్తిని వెంకటేశ్వర్లు శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ గాంధీభవన్ ముందు పురుగులమందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేయగా అక్కడ స్థానికులు అంబులెన్స్ ద్వారా ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 22: ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్న సమయం. అంతలోనే రైలు ఆగిపోయింది. బోగిల్లో అలజడి నెలకొంది. మహిళల అరుపులు కేకలతో ప్రయాణీకులు ఉలిక్కిపడ్డారు. క్షణాల్లోనే మహిళల మెడల్లో ఉన్న పుస్తెల తాళ్లతోపాటు ఇతర బంగారు ఆభరణాలు దోపిడి దొంగలు లాక్కెళ్లారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలోని దివిటిపల్లి రైల్వేస్టేషన్కు సమీపంలో చోటు చేసుకుంది. శనివారం
అల్లాదుర్గం, సెప్టెంబర్ 22: అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐబీ చౌరస్తా సమీపంలో ఓ సెక్యూరిటి గార్డ్ దారుణ హత్యకు గురయ్యాడు. అల్లాదుర్గం సీఐ ఇన్చార్జి, మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం శుక్రవారం రాత్రి ఐబీ చౌరస్తా సమీపంలో బీటీ రోడ్డు ప్రక్కన రాకేశ్సింగ్ యాదవ్(45)ను దారుణంగా హత్య చేసి రోడ్డు ప్రక్కన గల చెట్టు క్రింద పడవేసినట్లు మృతదేహం ఉంది.
చిత్తూరు, సెప్టెంబర్ 22: వాల్మీకిపురం సీఐ తేజామూర్తి లైంగిక వేధింపుల కేసు విచారణకు జిల్లా ఎస్పీ రాజశేర్ బాబు శనివారం ఆదేశాలు జారీ చేసారు. విచారణ అధికారిగా చిత్తూరు మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ నారాయణ స్వామిని నియమించారు. వాల్మీకిపురం సీఐగా ఉన్న తేజామూర్తి ఇటీవల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఒక మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారులు ఇటీవల అతనిపై సస్పెన్షన్ వేటు వేసారు.
ఒంగోలు, సెప్టెంబర్ 22: ఒంగోలు మంగమూరు రోడ్డులోని సాంబశివ నగర్లో ఒక అపార్ట్మెంట్లో కూలిపనులు చేస్తున్న ఇద్దరు కూలీలు శనివారం ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురై అక్కడికి అక్కడే మృతి చెందారు. ఒంగోలు తాలూకా పోలీసులు కధనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఒంగోలు సాంబశివ నగర్లో ఒక కొత్త అపార్ట్మెంట్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.