S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/21/2018 - 22:29

ధర్మవరం, సెప్టెంబర్ 21: పట్టణంలోని శాంతి నగర్‌కు చెందిన రాజేశ్వరి (26) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే మా బిడ్డను అత్తింటి వారే వేధించడంతో మరణించిందని, బాత్‌రూమ్‌లో జారి పడి మృతి చెందిందని అత్తమామలు చిత్రీకరించారని మృతురాలి తల్లి శాంతమ్మ, అక్క శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

09/21/2018 - 22:28

గార్లదినె్న, సెప్టెంబర్ 21: డ్యామ్ రోడ్డు సర్కిల్ వద్ద శుక్రవారం అతిగా మద్యం తాగి హరిజన మారెన్న(60) మృతి చెందినట్లు ఎస్సై రాంప్రసాద్ తెలిపారు.

09/21/2018 - 22:20

కడప క్రైమ్,సెప్టెంబర్ 21: ఈనెల 18వ తేదీన కడప నగరం తిలక్‌నగర్‌లో పవన్‌కుమార్ అనే రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడని డీఎస్పీ మాసూంబాషా తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తాటిమర్రి పవన్‌కుమార్ అలియస్ కుమార్ (29) హత్యకేసును పురోగతి సాధించి అతన్ని హత్యచేసిన హసనాపురం రాము, పాలెం భాస్కర్, తన్నీరు హరిప్రసాద్‌లు కుమార్‌ను పథకం ప్రకారమే చంపాలని హత్యచేసినట్లు డీఎస్పీ తెలిపారు.

09/21/2018 - 22:11

ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 21: మహబూబాబాద్ నుండి ఖమ్మం వైపు గ్రానైట్ లోడ్‌తో వస్తున్న ఓ టారస్ లారీ మండలంలోని సత్యనారాయణపురం సమీపంలో అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో కేబిన్‌లో ఇరుక్కొన్న డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈసంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం తమిళనాడుకు చెందిన మాణిక్యదాసు (30) స్థానిక వరంగల్ క్రాస్‌రోడ్‌లో నివాసం ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

09/21/2018 - 22:01

దేవరపల్లి, సెప్టెంబర్ 21: కంటెయినర్‌లో అక్రమంగా తరలిస్తున్న 70 గోవులను మండలంలోని గౌరీపట్నం గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం ఎస్‌ఐ పి వాసు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలావున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల నుండి 70 ఆవులను కంటెయినర్‌లో మూడు భాగాల్లో ఉంచి రవాణా చేస్తున్నారు. గోవులను హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోని గౌరీపట్నం గ్రామం వద్ద కంటెనయినర్ మర్మమతులకు గురై నిలిచిపోయింది.

09/21/2018 - 21:57

వినాయక్‌నగర్, సెప్టెంబర్ 21: నిజామాబాద్ మండలం సారంగపూర్ సీడబ్ల్యుసీ గోడౌన్ల సమీపంలో ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రహీమ్‌ఖాన్(42) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బిలాల్‌నగర్‌కు చెందిన రహీమ్‌ఖాన్ తన సొంత ఆటోరిక్షాలో నిజామాబాద్‌కు వస్తుండగా, ఎదురుగా వస్తున్న ఓమిని వ్యాన్ బలంగా ఢీకొట్టింది.

09/21/2018 - 21:39

జియ్యమ్మవలస, సెప్టెంబర్ 21: మండలంలో గల పెదమేరంగి సెంటర్ నుంచి చినమేరంగికి అక్రమంగా తీసుకువస్తున్న 112 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని చినమేరంగి ఇన్‌ఛార్జి ఎస్‌ఐ బాలాజీరావు తెలిపారు.

09/21/2018 - 21:25

మాకవరపాలెం, సెప్టెంబర్ 21: ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బాలుడు లారీ కింద పడి మృతి చెందాడు. మండలంలోని దాలింపేట గ్రామానికి చెందిన విత్తనాల సాహితీవిశాల్(6) కొండల అగ్రహారంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. అయితే శుక్రవారం మోహరం సెలవు కావడంతో విశాల్ ఇంటి వద్దనే ఉండిపోయాడు.

09/21/2018 - 05:38

సారవకోట, సెప్టెంబర్ 20: మండలంలోని మూగుపురం గ్రామానికి చెందిన ఇసై. ప్రవీణ్ (25) డెంగ్యూ జ్వరంతో గురువారం ఉదయం విశాఖపట్నంలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతుడు ప్రవీణ్ పట్ట్భద్రుడు. ఉద్యోగాల పరీక్షలకు హాజరుకావడానికి గాను గత మూడేళ్లుగా విశాఖపట్నంలో ఉంటూ కోచింగ్ పొందుతున్నాడు. వినాయకచవితి ముందు డెంగ్యూ జ్వరం సోకడంతో స్వగ్రామానికి వచ్చాడు.

09/21/2018 - 03:54

రంపచోడవరం, సెప్టెంబర్ 20: క్షుద్ర పూజలు చేస్తుందనే అనుమానంతో ఒక గిరిజన మహిళను ఆమె మరిదే దారుణంగా నరికిచంపాడు. ఈ ఘాతుకం తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం గుంజిగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కడబాల సత్యవతి (40) అనే గిరిజన మహిళ క్షుద్రపూజలు చేస్తుందని అనుమానించి ఆమె మరిది చిన్నారావు ఆమెను అతి కిరాతకంగా కత్తితో నరికేశాడు.

Pages