-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ: పౌరహక్కుల నాయకులు వరవరరావుతోపాటు నలుగురు హక్కుల నేతల గృహనిర్బంధం మరోరెండు రోజులు పొడిగించారు. కోరేగావ్-్భమా హింసకు సంబంధించి ఐదుగురు హక్కుల నేతలను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారి విడుదలకు సంబంధించి దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం విచారించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసు నిందితులు ఏడుగురిని విడిచిపెట్టాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంఘటనలో మృతి చెందిన వారి బంధువులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం స్వీకరించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన కృష్ణా నది జాలలను రెండు తెలుగు రాష్ట్రాలకు విభజన చేసేందుకు ఉద్దేశించబడిన జస్టిస్ బ్రీజేష్కుమార్ ట్రిబ్యునల్ విచారణ నేటికి వాయిదా పడింది. కృష్ణా ట్రిబ్యునల్లో సాగునీటి అంశంపై తెలంగాణ క్రాస్ ఎగ్జామినేషన్ సోమవారం ముగిసింది. తెలంగాణ తరపు న్యాయవాది రవీందర్రావు ఆంధ్రప్రదేశ్ తరపు సాక్షిగా ఉన్న సుబ్బారావును క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: నేషనల్ హెరాల్డ్ నిధుల కుంభకోణం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మోసం, నేరపూరిత కుట్రలకు పాల్పడ్డారని బీజేపీ నాయకుడు సుబ్రమణియన్ స్వామి ఆరోపించారు. ఈమేరకు సోమవారం ఢిల్లీ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ ఎదుట ఆయన తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన వాదనలను వినిపించారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: నొప్పి నివారిణి మాత్ర ‘సారిడాన్’ ఇక దేశంలోని అన్ని మందుల దుకాణాల్లో దొరుకుతుంది. ‘సారిడాన్’ సహా మరో మూడు మందుల విక్రయానికి సుప్రీంకోర్టు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా నిర్వహణపై ప్రభుత్వ జోక్యాన్ని సవాలు చేస్తూ బీ.జే.పీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. టీ.టీ.డీ పాలనా నిర్వహణ తదితర అంశాలు ప్రభుత్వం జోక్యం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కొరతూ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ దాఖలు చేశారు.
తడ: నెల్లూరు జిల్లా తడ మండల కేంద్రంలో శ్రీకాళహస్తి రోడ్డు సమీపంలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కోటిపైగా దోపిడీ జరిగినట్లు బ్యాంకు మేనేజర్ వరుణ్కుమార్ సోమవారం తడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందిన ఫిర్యాదు మేరకు గూడూరు డీఎస్పీ రాంబాబు విచారణను వేగవంతం చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
తోట్లవల్లూరు, సెప్టెంబర్ 17: మండలంలోని చాగంటిపాడు కళ్ళంవారిపాలెంలో ఆదివారం రాత్రి తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో చోరి జరిగింది. అలాగే తోట్లవల్లూరు గ్రామంలో 5 గొర్రెలను అపహరించారు. కళ్ళంవారిపాలెంలో పాములపాటి పిచ్చిమ్మ, పాములపాటి బసివిరెడ్డి ఇళ్ళల్లో చోరీలకు దొంగలు తెగబడ్డారు. పిచ్చిమ్మ, బసివిరెడ్డి హైదరబాద్లోని కుమారుల వద్దకు వెళ్లారు. సుమారు 15 రోజుల నుంచి రెండిళ్లకు తాళాలు వేసి ఉన్నాయి.
నంగునూరు, సెప్టెంబర్ 17: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన నంగునూరు మండలం ముండ్రాయి గ్రామ శివారులో హస్నాబాద్- సిద్దిపేట రహదారిపై సోమవారం నాడు జరిగింది. రాజగోపాల్పేట పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రం కుకుజారీ గ్రామానికి చెందిన బలిస్టార్ కుమార్ యాదవ్ (32) గత కొన్ని రోజుల క్రితం ముండ్రాయి శివారులోని సురభి మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నాడు.
కొయ్యూరు, సెప్టెంబర్ 17: మర్రివాడ పంచాయతీ పిడతమామిడి గ్రామంలో నాలుగేళ్ళ బాలుడు బ్యాక్టీరియా ఇన్పెక్షన్తో బాధపడుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. అనారోగ్యంతో బాదపడుతున్న సుర్ల దీపక్(4) ఈనెల 11న పీహెచ్సీలో వైద్య సేవలు పొందాడు. మెరుగైన వైద్య సేవలకై నర్సీపట్నం తరలించాలని వైద్యులు సూచించారు. నర్సీపట్నం అనంతరం విశాఖలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యునికి వైద్యం చేయించారు.