S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/10/2018 - 22:13

పిఠాపురం, సెప్టెంబర్ 10: పిఠాపురంలో జనసేన కార్యకర్తల అత్యుత్సాహం కాస్తా రాజకీయ సర్వే చేస్తున్న ప్రతినిధులపై దాడికి దారి తీసింది. గ్రామాల్లో సర్వేచేస్తున్న వారిని అక్రమంగా నిర్భందించి, దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు జనసేన కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.

09/10/2018 - 22:04

జి.మాడుగుల, సెప్టెంబర్ 10: ఆశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం పుణ్యమాంటూ గిరిజన బాలిక నిండునూరేళ్లు జీవితం తెల్లారిపోయింది. అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలిక పట్ల ఆశ్రమ ఉపాధ్యాయులు చూపించిన నిర్లక్ష్యంతో బాలిక మృతి చెందిన సంఘటన మండలంలోని బందవీధి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలకల పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది.

09/10/2018 - 21:46

మెరకముడిదాం, సెప్టెంబర్ 10: మండలంలో గల గర్భాం-గొట్టిపల్లి రోడ్డుకు ఆనుకుని ఉన్న పంచముఖి ఆంజనేయ కాలని వద్ద సోమవారం తృటిలో భారీ ప్రమాదం తప్పటంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. గర్భాంలో గల విశాఖ స్టీల్ ప్లాంట్ మైన్ నుండి సుమారు 21 టన్నుల మాంగనీస్ ఓరుతో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బారీ లారీ బయలుదేరి వెళుతుంది. ఇటీవల ఈ రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజ్ కాలువలు నిర్మించారు.

09/10/2018 - 21:45

జామి, సెప్టెంబర్ 10: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యిక్తి దుర్మరణం పాలైన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జామి మండలం బలరామపురం గ్రామ సమీప జంక్షన్ వద్ద ఓమోటారు సైకిల్‌ను బలోరా వ్యాన్ ఎదురెదురుగా వచ్చి ఈ వాహనాలు ఢీకొన్నాయి. దీంతో మోటారు సైకిలిస్టు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మోటారు సైకిలిస్టు విజయనగరం పి. ఎస్. ఆర్.

09/10/2018 - 21:37

జి.సిగడాం, సెప్టెంబర్ 10: మండలం బాతువ గ్రామానికి చెందిన సామంతుల దాలినాయుడు (29) ఆదివారం సాయం సమయంలో రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. వివరాల్లోకి వెల్తే తన పశువులను రైల్వే పట్టాల సమీపంలో పశువులు మేత మేస్తుండగా రైలు బండి వస్తున్నట్లు గుర్తించి వాటిని తోలేందుకు గాబరాగా వెళ్లారు. ఆసమయంలో పశువులు తప్పుకున్నాయి. దాలినాయడు బండికి బలైపోయాడు.

09/10/2018 - 04:20

రాజవొమ్మంగి, సెప్టెంబర్ 9: సభ్య సమాజం సిగ్గుపడేలా ముక్చుపచ్చలారని చిన్నారిపై మన్యంలో అత్యాచారం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం వాతంగి అనే మారుమూల గిరిజన పల్లెలో రెండో తరగతి చదువుతున్న బాలికపై అదే గ్రామానికి చెందినన 17 ఏళ్ల యువకుడు శుక్రవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఆదివారం జడ్డంగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

09/10/2018 - 01:47

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: సామాజిక మాధ్యమాల్లో విస్తృత వినియోగంలో ఉన్న వాట్సాప్ మెస్సేంజర్ సాయంతో ఒక క్రిమినల్ కేసు విచారణ జరుపుతారంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజం. ఇలా విచారణ జరిపిన కేసు గురించి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది ఏమైనా జోకా? అంటూ సుప్రీం సైతం కిందికోర్టు వైఖరిపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.

09/10/2018 - 01:28

బుక్కరాయసముద్రం, సెప్టెంబర్ 9: బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం గ్రామ సమీపంలో ఉన్న ఎస్.ఆర్.ఐ.టి కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న మంజుల అనే విద్యార్థిని ఆదివారం అనంతపురం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయంపై బుక్కరాయసముద్రం పోలీసులు, కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

09/10/2018 - 00:56

రాచర్ల, సెప్టెంబర్ 9: ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి గిరిజన బాలికపై అత్యాచారం చేసిన సంఘటన రాచర్ల మండలంలోని చినగానిపల్లి గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చినగానిపల్లి గ్రామానికి చెందిన గిరిజన బాలిక గిద్దలూరులోని వెనకబడిన తరగతుల హాస్టల్‌లో 6వ తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో స్వగ్రామం చేరుకుంది.

09/09/2018 - 23:36

తుంగతుర్తి, సెప్టెంబర్ 9: గ్రామాల్లో వినియోగదారుల వద్ద రేషన్ బియ్యం కొనుగోలుచేసి వాటిని కర్ణాటక రాష్ట్రానికి తరలించి రీసైక్లింగ్ ద్వారా అధిక ధరలకు విక్రయించే వ్యక్తులను సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పోలీసులు వలపన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. 550 బస్తాలతో (27 టన్నులు) లోడుతో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న లారీని, నిందితులను పట్టుకొని కేసునమోదు చేశారు.

Pages