-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
కైకలూరు, సెప్టెంబర్ 8: కైకలూరులో వేర్వేరు ప్రాంతాల్లో రైల్వే గేటు దాటుతుండగా ప్రమాదశాత్తు ఇరువురు మృతి చెందిన సంఘటన ఇది. భీమవరం రైల్వే పోలీసుల కథనం ప్రకారం మండలంలోని ఆలపాడుకు చెందిన బత్తిన కృష్ణ (59) ఉదయం జాతీయ రహదారి నుండి పొలాలకు వెళుతుండగా 84 నెంబరు రైలు గేటు వద్ద పట్టాలు దాటుతున్నాడు. విశాఖపట్నం-ముంబై ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనగా అక్కడిక్కడే మృతి చెందాడు.
మదనపల్లె: పొట్టకూటి కోసం ఓ చేనేత కార్మికుడు గల్ఫ్దేశాలకు వెళ్లాడు. అక్కడ ఏడారిప్రాంతంలో గొర్రెలను మేపలేక, అప్పులుచేసి గల్ఫ్లో సేట్లు పెడుతున్న కష్టాలు పడలేక, తిరిగి స్వదేశానికి వచ్చే మార్గం లేక, కనీసం భార్య, పిల్లలతో మాట్లాడే అవకాశం లేకుండా పోవడం.. బతుకుభారమైన ఓ చేనేత కార్మికుడు సౌదీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పామూరు, సెప్టెంబర్ 8: ఏపిలో నిషేధించబడిన గుట్కాలు, పాన్మసాలాలు, వివిధ మాదక ద్రవ్యాలను తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకుని, ఆ వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు కందుకూరు డిఎస్పీ కె ప్రకాష్రావు తెలిపారు.
అవనిగడ్డ, సెప్టెంబర్ 7: మండల పరిధిలోని దక్షిణచిరువోల్లంక కృష్ణానది రేవు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుండటంతో ఆ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం మరబోట్ల ద్వారా అక్రమంగా ఇసుకను తవ్వి ఒడ్డుకు చేర్చి అక్రమార్కులు వ్యాపారం చేస్తుండటాన్ని గుర్తించిన గ్రామస్తులు అడ్డుకున్నారు.
పెనుగంచిప్రోలు, సెప్టెంబర్ 7: మతాంతర ప్రేమ వివాహానికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన సంఘటన మండలంలోని అనిగండ్లపాడులో శుక్రవారం జరిగింది. అనిగండ్లపాడుకు చెందిన షేక్ షాదిక్ నందిగామలోని జీడీఎంఎం ఇంజనీరింగ్ కళాశాల బిటెక్ చదువుతుండగా అదే గ్రామానికి చెందిన సాదం సంధ్య (21) పదవ తరగతి పూర్తి చేసి ఖాళీగా ఉంటోంది.
బాలాపూర్, సెప్టెంబర్ 7: మద్యానికి బానిస అయిన కానిస్టేబుల్ విధులు సరిగా నిర్వహించలేక క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నల్లగొండ జిల్లా చీకటిమామిడి గ్రామానికి చెందిన కోట ఉపేందర్ (39) పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా 2007లో చేరారు.
ఆలేరు, సెప్టెంబర్ 7: మండల కేంద్రానికి రైతు మల్లెల ఇస్తారి(38) శుక్రవారం తన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇస్తారి గత కొంతకాలంగా సొంత పొలంతో పాటు ఇతరుల భూమిని కౌలు తీసుకుని పత్తి సాగు చేస్తున్నారు. పంటల సాగులో ఎదురైన అప్పులు పెరిగిపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
భీమ్గల్, సెప్టెంబర్ 7: భీమ్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడాభీమ్గల్కు చెందిన ఎం.హర్షిణి అలియాస్ అఖిల(22) అనే నవ వధువు కాళ్ల పారాణి కూడా ఆరకముందే కాటికి పయనమైంది. వివాహం జరిగిన పది రోజులకే బలవన్మరణానికి పాల్పడింది. భీమ్గల్ సీఐ సైదయ్య కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. అఖిలకు గత పది రోజుల క్రితం వివాహం జరుగగా, అప్పటి నుండి ముభావంగానే ఉంటూ వస్తోందని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది.
కేసముద్రం, సెప్టెంబర్ 7: కేసముద్రం మండలం మహమూద్పట్నం కాలనీతండాలో గత నెల 28న అనుమానస్పద స్ధితిలో ఇంటర్మీడియట్ విద్యార్థి వాంకుడోత్ నవీన్ మృతి చెందిన ఘటన కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం నవీన్ను తోడబుట్టిన అన్న వాంకుడోత్ సంతోష్ తన స్నేహితు డు సిలివేరు సాయిరాం సహాకారంతో గొంతు నులి మి హత్య చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ నరేష్కుమార్ తెలిపారు. డీఎస్పీ కథనం ప్రకారం..
ఖానాపూర్ రూరల్, సెప్టెంబర్ 7: గుప్త నిధుల విషయమై ఒక బాలుడిని బలి ఇస్తే కావాల్సినంత బంగారం వస్తుందని అందులో సగం బంగారం మీకు ఇస్తానని ఆశపడడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేసిన సంఘటన ఇది. బాలుడి తల్లితండ్రులు తెలిపిన వివరాల ప్రకా రం..