S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/29/2018 - 00:37

సైదాబాద్, ఆగస్టు 28: సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం (జువైనల్ హోం) నుంచి వరుసగా విద్యార్థులు పారిపోవడం పరిపాటుగా మారుతుంది. ముందస్తు భద్రతా చర్యలు చేపట్టకపోవడం పట్ల అధికారుల పని తీరుకు అద్దం పడుతుంది. అధికారుల పర్యావేక్షణ లోపంతోనే వరుస సంఘటనలు జరుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.

08/29/2018 - 00:03

నందిపేట, ఆగస్టు 28: నందిపేట మండలం వనె్నల్(కే) గ్రామంలో ఎల్లంపల్లి సుబ్బయ్య(40)అనే వ్యక్తి గ్రామ శివార్లలోని మొక్కజొన్న తోటలో అడవి పందుల కోసం పెట్టిన విద్యుత్ వైర్లకు తగిలి, విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

08/28/2018 - 23:47

కొత్తకోట, ఆగస్టు28: మదనాపురం మండల కేంద్రంలోని సవిల్ సప్లయి గోదాం వద్ద రేషన్ బియ్యాన్ని కొందరు వ్యక్తులు పట్టుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఏపి22వి9938 అనే నెంబర్ గల లారీలో పెబ్బేరు మండల కేంద్రం నుండి విజయట్రేడర్స్ మిల్లు ద్వారా ఈ రేషన్ బియ్యాన్ని తరలించగా కాపు కాచి పట్టుకున్నారు.

08/28/2018 - 23:41

ఆదిలాబాద్ మున్సిపాలిటీ, ఆగస్టు 28: మహారాష్టక్రు చెందిన చిరు వ్యాపారిని కిడ్నాప్ చేసి మూడు రోజులు నిర్భందించిన ముఠాను ఎట్టకేలకు పోలీసులు ఛేదించి అరెస్ట్ చేశారు. మంగళవారం మావల పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేక ర్ల సమావేశంలో రూరల్ సిఐ ప్ర దీప్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు.

08/28/2018 - 23:24

ఆలూరు, ఆగస్టు 28: మండలంలోని తుంబళవీడు గ్రామంలో వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన భర్త నెరణికి రామయ్య(65) భార్య బోయ వన్నూరమ్మ(60)లు సోమవారం రాత్రి 11.30 సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

08/28/2018 - 23:08

యర్రగొండపాలెం, ఆగస్టు 28: నిత్యం మద్యం సేవించి తల్లిని తిడుతూ కొడుతుంటే చూడలేక కూతురు, చెడువ్యసనాలకు బానిసైన భర్త వేళాపాళా లేకుండా వేధింపులకు గురిచేస్తూ నరకయాతన చూపిస్తుంటే తాళలేక మనస్తాపానికి గురై భార్య చీరకొంగుతో ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన మంగళవారం తెల్లవారుఝామున పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

08/28/2018 - 22:48

అల్లవరం, ఆగస్టు 28: వివాహం నిశ్చయమై ఏడాథి గడుస్తున్నా పెళ్లి చేసేందుకు అత్తగారు జాప్యం చేస్తోందని ఆగ్రహించిన అల్లుడు ఆమెపై కత్తితో దాడిచేసి హత్య చేసిన సంఘటన అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. ఈ దాడిలో పొన్నమండ విష్ణుకుమారి (50) మృతి చెందింది.

08/28/2018 - 22:34

గోరంట్ల, ఆగస్టు 28 : మండల పరిధిలోని చలమయ్యగారిపల్లి వద్ద పొలాల్లో గుర్తు తెలియని యువకుడు (20) శవం లభ్యమైనట్లు సీఐ రవికుమార్ తెలిపారు. గ్రామ సమీపంలో శవం పడి ఉందని స్థానికులు సమాచారం అందివ్వగా ఎస్సై సుధాకర్ యాదవ్ తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారన్నారు. మృతదేహం తలపై కొట్టిచంపినట్లుగా తీవ్ర గాయమైందన్నారు.

08/28/2018 - 20:09

హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు విధానాన్ని హైకోర్టు కొట్టివేసింది. పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయులను ఒకే సర్వీసు కిందకు పరిగణిస్తూ గతంలో ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేస్తున్నట్లు తీర్పు చెప్పింది.

08/28/2018 - 18:55

హైదరాబాద్: సంచలనం సృష్టించిన గోకుల్‌ఛాట్, లుంబినీ పార్కు జంట బాంబు పేలుళ్ళ కేసుపై తీర్పు సెప్టెంబర్ 4న వెలువడనున్నది. సోమవారం కేసు విచారణను చర్లపల్లి సెంట్రల్ జైలులోని ప్రత్యేక కోర్టులో సెషన్స్ జడ్జి శ్రీనివాస రావు తీర్పును వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేశారు.

Pages