-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
మాండ్సౌర్ (ఎంపీ): ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఇద్దరు కామాంధులకు ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రెండు నెలల క్రితం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనపై ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పును వెలువరించింది.
అలహాబాద్: భార్యపై అనుమానంతో కుటుంబ సభ్యులను హతమార్చి తాను ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఉదంతం ఇది. ఆలహాబాద్లో మనోజ్ కుష్వాహ అనే వ్యక్తి తన భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను చంపి ఫ్రిజ్లో దాచిపెట్టాడు. కుమారుడిని సీలింగ్ ఫ్యాన్కు ఉరేసి చంపాడు. ఇద్దరు కుమార్తెలను చంపి అల్మారలోని సూట్కేసులో పెట్టాడు. అనంతరం తాను ఉరేసుకుని చనిపోయాడు.
హైదరాబాద్, ఆగస్టు 20: మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు(శ్రీశ్రీ ) విగ్రహం ట్యాంకు బండ్పై శిథిలావస్థలో ఉందని పేర్కొంటూ ఒక దినపత్రికలో వచ్చిన వార్తను హైకోర్టు సోమవారం నాడు పిల్గా స్వీకరించింది. ఈ వార్తపై తొలుత జస్టీస్ యు దుర్గాప్రసాద్ పేపర్లో వచ్చిన వార్తను ప్రధాన న్యాయమూర్తికి పంపిస్తూ పిల్ కమిటీ ముందు ఉంచాలని కోరారు.
నిజామాబాద్, ఆగస్టు 20: లైంగిక వేధింపుల ఆరోపణలపై రిమాండ్ ఖైదీగా జిల్లా జైలులో కాలం వెళ్లదీస్తున్న డీఎస్ తనయుడు, నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్కు మరోమారు చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన పెట్టుకున్న పిటిషన్ను న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. దీంతో మరికొన్ని రోజుల పాటు సంజయ్కు కారాగార వాసం తప్పని పరిస్థితి నెలకొంది.
విజయనగరం, ఆగస్టు 20: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డిసిసిబి) ద్వారా గరుగుబిల్లి మండలం రావివలస సొసైటీ బినామీ రుణాల వ్యవహారంపై హైకోర్టు విచారణకు ఆదేశించింది. డిసిసిబి ద్వారా రావివలస సొసైటీకి 2012-13 కాలంలో రూ.3.83 కోట్ల మేరకు రుణాలు మంజూరయ్యాయి. ఈ రుణాలను బినామీ పేర్లతో స్వాహా చేశారన్న వ్యవహారంపై ఇప్పుడు హైకోర్టు నాలుగు నెలల వ్యవధిలో నివేదికను ఇవ్వాలని ఆదేశించింది.
బండ (యూపీ), ఆగస్టు 20: తొమ్మిదేళ్ల బాలికపై ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన యూపీలోని హమీర్పూర్ జిల్లా మధురా ప్రాంతంలో సోమవారం జరిగింది. ఇంటిబయట ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికను నరేన్ సోని (24) అనే యువకుడు స్వీటు ఇస్తానని ఆశచూపి నిర్జన ప్రదేశంలోని తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూరు ఆసుపత్రికి తరలించామని ఏఎస్పీ లాల్సాహెబ్ యాదవ్ తెలిపారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 20: భార్య మృతి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ జెనీవా వెళ్లడానికి కోర్టు అనుమతి లభించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 20: రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో గత నెలలో జరిగిన మూక దాడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై దాఖలైన కోర్టు ధిక్కార కేసులో సుప్రీం నోటీసులు జారీ చేసింది. గోరక్షణ పేరుతో జరిగిన మూక హత్యాకాండలో రాక్బర్ఖాన్ (28) ప్రాణాలు కోల్పోయాడు. అల్వార్ జిల్లా రాంగఢ్లో ఈ దారుణం చోటుచేసుకుంది. రాజస్థాన్ ప్రభుత్వంపై తుషార్ గాంధీ, కాంగ్రెస్ నేత తహ్సీన్ పూనావాలా ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
న్యూఢిల్లీ: కేరళను ముంచెత్తుతున్న వరదలను నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జాతీయ ప్రకృతి విపత్తుల నియంత్రణ కమిటీ (ఎన్సీఎంఆర్సీ)ని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. ఇందుకు సంబంధించి కేరళ సబ్కమిటీతో సమన్వయంగా పనిచేయాలని కోర్టు సూచించింది.
హుస్నాబాద్, ఆగస్టు 17: తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన 47గొర్రెలను శుక్రవారం హుస్నాబాద్ వారసంతలో అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రెండులక్షల 40వేల ఉంటుందని అధికారుల తెలిపారు. మల్లంపెల్లి పశువైద్యాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక సీఐ శ్రీనివాస్జీ, ఎస్ఐ సుధాకర్ సంతలో అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను విచారించగా సబ్సిడీ గొర్రెలని తెలసింది.