S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/16/2018 - 23:53

కొల్చారం, ఆగస్టు 16: ఆర్టీసీ బస్సు ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై పెంటయ్య, ప్రయాణికుల కథనం ప్రకారం పోతన్‌శెట్టిపల్లి హనుమ్‌బండాల్ సమీపంలో సికింద్రబాద్ నుండి మెదక్ వస్తున్న ఆర్టీసీ బస్సు కిష్టాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి యాదగిరి(28), మహ్మద్ ఆసీఫ్(26)లు బైక్‌పై కొల్చారం వైపు వస్తున్నారు.

08/16/2018 - 23:52

నంగునూరు, ఆగస్టు 16: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన సంఘటన నంగునూరు మండలం గట్లమల్యాలలో గురువారం జరిగింది. రాజగోపాల్‌పేట ఎస్‌ఐ చంద్రశేఖర్, గ్రామస్థు కథనం ప్రకారం గట్లమల్యాల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు పుల్లూరి సాయితేజ, అనిల్, అరుణ్ లు చదువుకుంటున్నారు.

08/16/2018 - 23:40

నిజామాబాద్, ఆగస్టు 16: లైంగిక వేధింపుల ఆరోపణలపై జ్యుడీషియల్ రిమాండ్ కింద జిల్లా జైలులో కాలం వెళ్లదీస్తున్న నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసును విచారణ జరుపుతున్న ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక విచారణ న్యాయస్థానం జడ్జి రమేష్, ఈ నెల 20వ తేదీన బెయిల్ పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు.

08/16/2018 - 23:39

మాక్లూర్, ఆగస్టు 16: ఇన్నోవా కారు అదుపుతప్పి బోల్తాకొట్టిన సంఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుత్ప శివారులో 63వ నెంబర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మాక్లూర్ ఎస్‌ఐ సాయినాథ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

08/16/2018 - 23:18

బనగానపల్లె, ఆగస్టు 16:పట్టణంలో గురువారం టీడీపీ కార్యకర్త, రాష్ట్ర కార్మిక కనీస వేతన సవరణ బోర్డు డైరెక్టర్ పాలూరు లక్ష్మీనరసింహకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు.. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్ జీవితంపై విరక్తి చెంది గురువారం ఇంటి పక్కనే వున్న గదిలో ఉరి వేసుకున్నాడు. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బనగానపల్లె ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

08/16/2018 - 23:17

బనగానపల్లె, ఆగస్టు 16:మండల పరిధిలోని చిన్నరాజుపాలెం గ్రామానికి చెందిన మహమ్మద్‌గౌస్(70) గురువారం ఉదయం ప్రమాదవశాత్తూ ఎస్‌ఆర్‌బీసీ కాలువలో పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చిన్నరాజుపాలెం గ్రామం నుంచి వచ్చిన మహ్మద్‌గౌస్ బనగానపల్లె సమీపంలో ఎస్‌ఆర్‌బీసీ కాలువ కట్టపై బహిర్భూమికి వెళ్లి నీటిలోకి పడిపోయాడు.

08/16/2018 - 22:59

వెంకటగిరి, ఆగస్టు 16 : వెంకటగిరి సర్కిల్ పరిధిలోని రాపూరు పోలీస్‌స్టేషన్‌పై ఇటీవల రాపూరు దళితవాడకు చెందిన కొందరు దాడిచేసి ఎస్‌ఐతో పాటు సిబ్బందిని గాయపరిచిన కేసులో 23 మంది నిందితులకు గురువారం స్థానిక జడ్జి శోభ ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేశారు. 14 రోజులు రిమాండ్ పూర్తికావడంతో వారిని గురువారం పోలీసులు భారీ బందోబస్తు మధ్య వెంకటగిరి కోర్టుకు తీసుకొచ్చారు.

08/16/2018 - 22:43

మడకశిర, ఆగస్టు 16 : పట్టణంలోని 9వ వార్డుకు చెందిన రంగనాథ్(40) అతిగా మద్యం తాగి మృతి చెందాడు. మద్యానికి బానిసైన రంగనాథ్ గురువారం ఉదయం రోడ్డు ప్రక్కన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

08/16/2018 - 22:21

గుంటూరు (పట్నంబజారు), ఆగస్టు 16: అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లకు పాల్పడుతున్న క్రికెట్ బుక్కీలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను గురువారం రూరల్ ఎస్‌పి సిహెచ్ వెంకటప్పల నాయుడు విలేఖర్లకు వివరించారు.

08/16/2018 - 22:20

మాచవరం, ఆగస్టు 16: కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తను కోడలు రోకలి బండతో కొట్టి చంపింది. ఈ సంఘటన మండలంలోని కొత్తపాలెంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కొత్తపాలెంకు చెందిన కొయ్య సరోజనమ్మ (60) హత్యకు గురైంది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో కోడలు విజయలక్ష్మి రోకలి బండతో అత్తను చితకబాదింది. దీంతో సరోజనమ్మ అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. అత్త, కోడళ్ల మధ్య కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి.

Pages