S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/12/2020 - 04:59

జీడిమెట్ల, మార్చి 11: నాలుగు రోజుల క్రితం అద్దెకు దిగిన ముగ్గురు దుండగులు.. మణప్పురం ఫైనాన్స్‌లో చోరీ చేసేందుకు యత్నించిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు దుండగులు ఉప్పల్‌కు చెందిన నకిలీ ఆధార్ కార్డులతో కొంపల్లిలోని సన్న మల్లేశం కాంప్లెక్స్‌లోని ఓ షట్టర్‌లో అద్దెకు దిగారు.

03/12/2020 - 01:10

కడప: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని హైకోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్నోహన్‌రెడ్డికి చిన్నాన్న. గత ఏడాది మార్చి 15వ తేదీ వైఎస్.వివేకానందరెడ్డి పులివెందులలోని తన స్వగృహంలోనే దారుణ హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటుతో మరణించారని ప్రసారమాద్యమాలకు లీక్ చేశారు.

03/12/2020 - 00:59

నెల్లూరు, మార్చి 11: ఎటువంటి పత్రాలు లేకుండా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాసభ్యులను డిఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా వెంకటాచలం టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారి-16పై అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురిని డిఆర్‌ఐ అధికారులు బుధవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.

03/12/2020 - 00:29

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను మియాపూర్ న్యా యస్థానం తిరస్కరించింది. నార్సిం గి ఠాణా పరిధిలోని మియాపూర్ గడ్డలో అనుమతి లేకుం డా డ్రోన్ కెమెరా ఉపయోగించిన కేసులో రేవంత్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ నెల 6వ తేదీ న నార్సింగి పోలీసులు అతనిని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు.

03/11/2020 - 07:18

నల్లగొండ, మార్చి 10: ప్రేమవివాహం నేపథ్యంలో హత్యకు గురైన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసును జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ స్పెషల్ కోర్టులో మంగళవారం విచారణకు రాగా, ఎనిమిది మంది నిందితులకు ఇద్దరు హాజరుకాలేకపోవడంతో ఈ కేసులో చార్జ్‌షీట్ దాఖలులో జాప్యం నెలకొనడంతో కేసును ఈనెల 23కు కోర్టు వాయిదా వేసింది.

03/11/2020 - 07:38

హైదరాబాద్: కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. రేవంత్‌రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని, రేవంత్ తరపు న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. పాత కేసుల్లో రేవంత్‌పై పీటీ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) వారెంట్‌ను హైదరాబాద్ పోలీసులు అడిగారని, పోలీసుల తరపు లాయర్ పేర్కొన్నారు.

03/11/2020 - 06:33

షాద్‌నగర్ రూరల్, మార్చి 10: అనుమానాస్పద స్థితిలో వ్యాపారి మృతిచెందిన సంఘటన పట్టణంలోని పరిగి రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం 9:30గంటలకు వెంకటేశ్వర కాలనీలోని తన నివాసం నుంచి మృతుడు షాపునకు వెళ్తున్నానని చెప్పి వెళ్లినట్లు భార్య మంజుల తెలిపారు.

03/11/2020 - 06:28

జీడిమెట్ల, మార్చి 10: వాటర్ టబ్బులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం కొంపల్లి, మాలకుంటబావి కాలనీలో నివాసముండే వెంకట్రావ్ కుమార్తె భాగ్యవతి (3) ఇంటి ముందు ఆడుకుంటుందని అనారు. మూతలేని వాటర్ టబ్బులో ప్రమాదవశాత్తు పడి పోయిందని తెలిపారు. అనంతరం తల్లిదండ్రులు చిన్నారి పాప కోసం చుట్టు పక్కల ఎంతవెతికినా దొరకలేదని అన్నారు.

03/10/2020 - 05:08

మక్తల్, మార్చి 9: పశువైద్యాధికారి దిశను అత్యంత దారుణంగా చంపిన వారిలో ఒకరైన 4వ ముద్దాయి గురుడిగండ్ల వాసి చింతకుంట చెన్నకేశవులు తండ్రి చింతకుంట కుర్మయ్య (48) ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నారాయణపేట జిల్లా మక్తల్ ఎస్సై అశోక్‌కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

03/10/2020 - 04:58

మదనపల్లె, మార్చి 9: ఈతకెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటమునిగి మృతి చెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో సోమవారం చోటుచేసుకుంది.

Pages