S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/17/2018 - 23:01

మాకవరపాలెం, జూలై 17: బావి వద్ద స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి పడిన సంఘటనలో ఒక విద్యార్థి మృతి చెందాడు. ఈసంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గొలుగొండ మండలంలోని అప్పన్నపాలెం గ్రామానికి చెందిన కూడా అప్పలరాజు(13)( అనే విద్యార్ధి మండలంలోని తామరంలో గల కృపాకమల్ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతూ ఇక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు .

07/17/2018 - 22:59

చోడవరం, జూలై 17: గంజాయి అక్రమ రవాణా నింధితులకు జిల్లా కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ మల్లేశ్వరరావు అందజేసిన వివరాలిలావున్నాయి. 2013వ సంవత్సరంలో ఏజెన్సీ నుండి 74కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నింధితులు జి. మాడుగులకు చెందిన ఎ. ప్రసాద్, చోడవరానికి చెందిన జె. సత్యనారాయణ, రోలుగుంఠకు చెందిన ఎ.

07/17/2018 - 22:56

గుత్తి/యాడికి, జూలై 17 : గుంతకల్లు డివిజన్ పరిధిలోని వేములపాడు రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు దోపిడీకి విఫలయత్నమైంది. విధి నిర్వహణలో రైలు ఉన్న పోలీసులతోపాటు ట్రాక్ పక్కన పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు అప్రమత్తంతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

07/17/2018 - 22:52

అమరాపురం, జూలై 17 : మండల పరిధిలోని ఎర్రగుంటపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్న గిరిజ (24) మంగళవారం హేమావతిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఎఎస్సై వీరన్న తెలిపారు. వివరాల్లోకి వెళితే అనంతపురం సమీపంలోని ఆకుతోటపల్లికి చెందిన కృష్ణయ్య, జయలక్ష్మీ కుమార్తె గిరిజ 2014 డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా ఎంపికై మండల పరిధిలోని ఎర్రగుంటపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో పని చేస్తోంది.

07/17/2018 - 22:51

ధర్మవరం, జూలై 17 : పట్టణంలోని కొత్తపేట అయ్యప్ప స్వామి గుడికి సమీపంలో మంగళవారం 52 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న పట్టణ పోలీసులు మృతుని ఆచూకీ కోసం లభించిన ఆధారాలతో ఆరా తీసి వివరాలు తెలియకపోవడంతో కేసు నమోదు చేసుకుని పంచనామా అనంతరం దహన సంస్కారాల నిమిత్తం మునిసిపాలిటీ వారికి అప్పగించారు.

07/17/2018 - 22:51

ధర్మవరం, జూలై 17 : ధర్మవరంలో మంగళవారం ఓ హత్య కేసులో నిందితుడై రిమాండ్‌లో వున్న షిఖారిరోయి అలియాస్ రవి అనే ఖైదీ వాయిదా నిమిత్తం సబ్‌జైలు నుండి కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో పోలీసుల కళ్లు గప్పి పరారీ అయ్యాడు. వివరాల్లోకి వెళితే బత్తలపల్లి మండలం రామాపురం వద్ద గత యేడాది నవంబర్ 4వ తేదీన శ్రీనివాస్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.

07/17/2018 - 22:42

తిరుపతి, జూలై 17: ఎర్రచందనం అక్రమరవాణా చేసిన తిరుపతికి చెందిన యల్లంపల్లి హరిబాబు మంగళవారం తిరుపతి కపిలతీర్థం ఉన్న టాస్క్‌పోర్స్ కార్యాలయంలో ఐజీ డాక్టర్ కాంతారావు వద్ద లొంగిపోయారు. తాను తిరుపతి నుండి స్మగ్లింగ్ చేస్తూ వచ్చిన ఆదాయంతో టీవీ, సినీరంగంలో పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో తెలిసిందని సీఐ మధుబాబు తెలిపారు.

07/17/2018 - 22:40

నగరి, జూలై 17: వరకట్న వేధింపులను తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని వేలావడి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు తమిళనాడు తిరువళ్లూరు జిల్లా పుదియమంగళం గ్రామానికి చెందిన పి.లక్ష్మి అలియాస్ ప్రేమ (24)కు నగరి మండలం వేలావడి గ్రామానికి చెందిన ఎం.శ్రీనివాస్ అలియాస్ బాలాజీ (26)కు రెండేళ్లక్రితం వివాహమైంది.

07/17/2018 - 22:38

తిరుపతి, జూలై 17: సుమారు రూ. 5కోట్లు విలువచేసే 300 అంకణాల భూమికి సంబంధించి సీపీఐ నాయకులకు, ఒక బీసీ నేత మధ్య భూ వివాదం చెలరేగింది. గత ఎంతోకాలంగా ఈ వివాదం సాగుతున్నా మంగళవారం ఆ స్థలంలో బీసీ నేతకు సంబంధించిన వ్యక్తులు షెడ్లు ఏర్పాటు చేసేందుకు సమాయత్తం కావడంతో ఆ స్థలం తనదంటున్న సీపీఐ నేత వెంకయ్య వారిని అడ్డుకున్నారు. దీంతో బీసీ నేతలకు సంబంధించిన వర్గీయులు అక్కడకు చేరుకున్నారు.

07/17/2018 - 22:37

తిరుపతి, జూలై 17: తిన్నింటి వాసాలు లెక్కేసే వారుంటారని నానుడిని తిరుపతికి చెందిన భార్యాభర్తలు నిజం చేశారు. బతకడానికి తన దుకాణంలో ఉద్యోగం ఇచ్చిన యజమాని ఇంటిలోనే చోరీకి పాల్పడ్డారు. ఆపై క్రైం పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నారు. తిరుపతి క్రైం డీఎస్పీ ఆర్.రవిశంకర్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నారు.

Pages