-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
వలిగొండ, జూలై 14: గత ఐదు రోజులుగా సంఛలనంగా మారిన వలిగొండ ప్రేమజంట వివాదం శనివారం మరో మలుపు తీసుకుంది. ప్రియుడు రావుల భాస్కర్ తనకు ప్రియురాలితో పెళ్లి వద్ధంటు శనివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ ముందు క్రిమిసంహారక మందు తాగి, బ్లేడ్తో చేయి చేసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే పోలీసులు గమనించి భాస్కర్ను రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పటన్చెరు, జూలై 14: పటన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ గ్రామ పంచాయతి పరిధి భీరంగూడలోని నగల దుకాణంలో జరిగిన భారీ చోరీ కేసును స్థానిక పోలీసులు చేధించారు. తీవ్ర సంచలనానికి దారి తీసిన ఈ కేసుకు సంబంధించిన నేరస్థుల వివరాలను జిల్లా పోలీసుల సహకారంతో కేవలం పది రోజుల వ్యవధిలోనే కనుగొన్నారు. నగల దుకాణంలో దోపిడీకి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసిన పటన్చెరు పోలీసులు న్యాయస్థానం రిమాండుకు తరలించారు.
కోదాడ, జూలై 14: ఒక యువకుడి మృతి కి కారణమైన లారీ డ్రైవర్ ప్రాణభయంతో సుమారు మూడు కిలోమీటర్లు పరుగెత్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో పట్టణంలో శనివారం సాయంత్రం జరిగింది. పట్టణ శివారు సాలార్జంగ్పేట లారీ అసోసియేషన్ వద్ద లారీ రివర్స్ చేస్తుండగా వెనుక డోర్ తగిలి బైక్పై ప్రయాణిస్తున్న షేక్ ఆసిఫ్ (25) మృతి చెందాడు.
పాయకాపురం, జూలై 14: ఇంట్లో అడిగినంత డబ్బివ్వలేదని మనస్తాపం చెందిన ఒక యువతి ఉరి వేసుకుంది. ఈ సంఘటన అజిత్సింగ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్నగర్ నందమూరి నగర్లో నివాసముంటున్న సింగంపల్లి వరలక్ష్మి గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో ఎఎస్ఐగా పని చేస్తున్నారు. ఆమె భర్త సత్యనారాయణ గన్నవరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్.
విజయవాడ (క్రైం), జూలై 13: ఇంటర్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పటమట పోలీస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... తాడేపల్లిగూడెంలో నివాసముంటున్న మాన్యం శ్రీనివాసరావు స్థానికంగా ఎస్బిఐ బ్యాంకు బ్రాంచి మేనేజర్గా పని చేస్తున్నారు.
నిజామాబాద్, జూలై 13: నిజామాబాద్ జిల్లా కేంద్రంగా గంజా యి అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. అటు పోలీసులు, ఇటు ఆబ్కారీ శాఖ అధికారులు ఇటీవలి కాలంలో తరుచూ దాడులు నిర్వహిస్తూ నిల్వలను స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ, గంజాయి స్మగ్లింగ్ దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.
నార్సింగి, జూలై 13: నానక్రాంగూడలో జరిగిన భారీ పేలుళ్లతో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేలుళ్లతో స్థానిక ప్రజలు ఒక్కసారి షాక్కు గురయ్యారు. ఈ భారీ పేలుళ్లకు చుట్టుపక్కల అపార్ట్మెంట్స్కు పగుళ్లు ఏర్పడగా, మరికొన్ని అపార్ట్మెంట్స్ అద్దాలు పగిలి, లోపల ఉన్నవారికి కూడా గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
న్యూఢిల్లీ: ఆన్లైన్లో జరిగే కార్యకలాపాల నియంత్రణ, నిఘా కోసం కేంద్రం ఆధ్వర్యంలోని సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా హబ్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై సుప్రీం తీవ్రంగా స్పందించింది.
డీ.హీరేహాల్, జూలై 13 : మండలంలోని తమ్మెపల్లి గ్రామంలో బోయ అక్కమ్మ (35) శుక్రవారం హత్యకు గురైంది. సీఐ చలపతిరావు తెలిపిన వివరాల మేరకు మృతురాలి భర్త గంగాధర్ తాగుడుకు బానిసై డబ్బు కోసం అక్కమ్మను నిత్యం వేధించేవాడు. ఇందులో భాగంగానే కూలి పని ముగించుకుని ఇంటికి వచ్చిన అక్కమ్మను డబ్బులు ఇవ్వమని గొడవపడ్డాడు.
అర్థవీడు, జూలై 13: ప్రియురాలికి ప్రేమలేఖ ఇవ్వలేదన్న ఆక్రోశంతో 7వ తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి తగులపెట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన రవితేజ (12) శుక్రవారం మధ్యాహ్నం గుంటూరులోని ప్రభుత్వ వైద్యశాలలో మృతిచెందాడు. ఈనెల 7వ తేదీన జరిగిన ఘటనలో రవితేజకు శరీరంలోని వివిధ అవయవాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో మెరుగైన వైద్యచికిత్స కోసం గుంటూరు వైద్యశాలలో చేర్పించారు.