S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/08/2018 - 04:16

తెనాలి, జూలై 7: నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణీకుని నుండి 31లక్షల రూపాయల నగదు బ్యాగ్‌ను దోపీడీ చేసేందుకు యత్నించి జిఆర్‌పి పోలీసుల నుండి తప్పించుకు పోయిన నిందితులను అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్పీ కేవీ మోహన్‌రావు తెలిపారు. శనివారం తెనాలి జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

07/08/2018 - 03:07

రుద్రంగి, జూలై 7: రుద్రంగి మండల మానాల గ్రామానికి చెందిన తూం గణేశ్(25) అనే యువకుడు విద్యుత్ షాక్‌తో శనివారం మృతి చెందాడు. తన వ్యవసాయ క్షేత్రంలోచెట్టు కొడుతుండగా, కొమ్మలు విద్యుత్ తీగలకు తగిలి షాక్ రాగా, అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతు గణేశ్ విద్యుత్ షాక్‌తో మృతి చెందటంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

07/08/2018 - 02:52

ఉట్నూరు, జూలై 7: మండల కేంద్రంలోని పాత ఉట్నూరులో ఇటీవల జరిగిన హత్య ఉదాంతం పథకం ప్రకారమే జరిగిందని డిఎస్పీ వెంకటేష్ తెలిపారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పాత ఉట్నూరుకు చెందిన అనిల్ కుమార్ (28)ను అతని బావ టేకుల గంగాధర్ కర్రతో తలపై కొట్టి హత్య చేశాడని డి ఎస్పీ తెలిపారు.

07/08/2018 - 02:42

మహబూబ్‌నగర్, జూలై 7: ఈత కొట్టడానికి స్నేహితులతో కలిసి వెళ్లిన ఎంబీబీఎస్ విద్యార్థి సుమంత్ (19) చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీకి చెందిన సుమంత్ పట్టణంలోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

07/08/2018 - 02:36

నల్లగొండ రూరల్, జూలై 7: నల్లగొండ పట్టణంలో అర్ధరాత్రి జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. శనివారం వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రహమత్‌నగర్‌కు చెందిన చేరాల శ్రీనివాస్ (24), చేరాల ఆనంద్ (20)లు చదువుకుంటూ పార్ట్‌టైంగా పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

07/08/2018 - 02:29

హైదరాబాద్, జూలై 7: చిట్టీల పేరుతో ఎంతోమందిని నమ్మించి రూ.2 కోట్ల మొత్తానికి మోసం చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సిసిఎస్ పోలీసులు తెలిపారు. లింగాల విజయమ్మ, ఎక్కుర్తి మనోహర్, మరికొందరు కలిసి చిట్టీల పేరుతో మోసానికి పాల్పడ్డారు. 1995 నుంచి వీరు చిట్టీల వ్యాపారం చేస్తూ సొమ్ము దుర్వినియోగం చేశారు. ప్రజల సొమ్ముతో వీరు స్ధిరాస్తులు కూడగట్టినట్లు సిసిఎస్ అధికారులు గుర్తించారు.

07/08/2018 - 02:26

మేడ్చల్, జూలై 7: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొడుకును చూసేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన హృదయ విదారకరమైన సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

07/08/2018 - 01:23

తడ, జూలై 7: ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో గత కొంతకాలం నుంచి ఎర్రచందనం అత్యధికంగా చెన్నైకు స్మగ్లింగ్ చేస్తున్న నేపథ్యంలో అక్రమ రవాణాను నివారించేందుకు అటు తమిళనాడు, ఇటు ఆంధ్ర పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

07/08/2018 - 01:20

మనుబోలు, జూలై 7: జింక మాంసం కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటన శనివారం మండలంలోని వడ్లపూడి పంచాయతీ గొట్లపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. పొదలకూరు మండలం బిరుదవోలు గ్రామసమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక జింక గాయాలుపాలై పడిపోయింది.

07/08/2018 - 01:13

శ్రీకాకుళం(రూరల్), జూలై 7 : జాతీయ రహదారి పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసన్నపేటకు చెందిన యాల్ల గణేశ్వరరావు(25) మృతి చెందాడు. గణేశ్వరరావు నరసన్నపేట నుండి శ్రీకాకుళం వైపు మోటారు బైక్ పై వెళ్తుండగా ముందులో రోడ్డు రోలర్, లారీ లను కేంద్రీయ విద్యాలయం సమీపంలో వోవర్‌టేక్ చేయబోయి సడన్‌గా బ్రేక్ వేయడంతో బండి స్కిడ్ అయి బోల్తా పడ్డాడు. తలకు తీవ్రమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Pages