S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/01/2018 - 22:26

బుక్కరాయసముద్రం, జూలై 1 : మండలంలోని చెన్నంపల్లి గ్రామానికి చెందిన దీపికాలక్ష్మి (20) ఆదివారం ఇంట్లో పైకప్పునకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుక్కరాయసముద్రం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు చెన్నంపల్లికి చెందిన అశోక్‌కు పెద్దపడమలకు చెందిన లక్ష్మీ, గంగాధర్ కుమార్తె దీపికాలక్ష్మితో మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది.

07/01/2018 - 22:26

రాప్తాడు, జూలై 1 : మండల కేంద్రానికి చెందిన చెన్నకేశవ (30) ఆదివారం ఉరేసుకుని మృతిచెందాడు. ఎస్సై ధరణిబాబు తెలిపిన వివరాల మేరకు కుంటిమద్దికి చెందిన చెన్నకేశవ నాలుగు సంవత్సరాల క్రితం రాప్తాడుకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకుని హమాలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రెండు సంవత్సరాల నుంచి మద్యానికి బానిసై కడుపునొప్పితో బాధపడుతుండేవాడు.

07/01/2018 - 22:25

మడకశిర, జూలై 1: మండల పరిధిలోని నీలకంఠ స్టోన్ క్రషర్‌లో ప్రమాదవశాత్తు సోమ్లానాయక్ (45) అనే వ్యక్తి పడి మృతి చెందాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కేఎస్ తండాకు చెందిన సోమ్లానాయక్ గత కొంతకాలంగా నీలకంఠాపురంలోని క్రషర్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద ఉన్న క్రషర్‌లోకి ఇరుక్కుపోయాడు.

07/01/2018 - 05:09

ముంబయి, జూన్ 30: బ్యాంకులను మోసం చేసిన కేసులో దేశం నుంచి పరారై లండన్‌లో తలదాచుకుంటున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. బ్యాంకులకు రూ.9వేల కోట్ల మేర బకాయిలు పడి చెల్లించకుండా పరారైన మాల్యా కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే.

07/01/2018 - 04:31

హైదరాబాద్, జూన్ 30: దక్షిణ మధ్య రైల్వే (దమరై) పరిధిలోని పర్లీ-లాతూర్ సెక్షన్‌లో పన్‌గాన్ రైల్వే స్టేషన్ సమీపంలో 20 నుంచి 25 మంది దొంగలు ఔరంగాబాద్-రేణిగుంట ఎక్స్‌ప్రెస్‌ను దోచుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆర్పీఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రతిఘటించడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. దీనితో వారు రైలుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం తెల్లవారు జామున 3.07 గంటలకు జరిగింది.

06/30/2018 - 05:43

నెల్లిమర్ల, జూన్ 29: నెల్లిమర్ల ఎపి బెవరేజర్స్‌లో ఎక్సైజ్ ఎస్సై వేధింపులు తాళలేక దళిత యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ మేరకు బాధితుడు శ్రీనివాసరావు వేధింపులపై నెల్లిమర్ల ఎస్సైకు ఫిర్యాదు చేస్తూ రాసిన ఉత్తరాన్ని జేబులో ఉంచుకుని పురుగులు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

06/30/2018 - 05:42

నల్లజర్ల, జూన్ 29: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో శుక్రవారం ఉదయం మరుగుదొడ్డి ట్యాంకు నిర్మాణంలో పాల్గొన్న ఇద్దరు కూలీలు మట్టిపెళ్లలు విరిగిపడి సజీవ సమాధి అయ్యారు. వివరాలిలావున్నాయి... పోతవరం గ్రామానికి చెందిన పసుపులేటి సత్యనారాయణ కొత్త ఇంటి నిర్మాణంలో భాగంగా మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. మరుగుదొడ్డి ట్యాంకుల నిమిత్తం గోతులు తవ్వి, వాటిలో సిమెంటు ఒరలు అమర్చే పనిచేపట్టారు.

06/30/2018 - 05:41

బైరెడ్డిపల్లి, జూన్ 29: పలమనేరు-కుప్పం జాతీయ రహదారి మార్గంలో చిత్తూరు జిల్లా ఇల్లూరు గ్రామం వద్ద ఇన్నోవా వాహనం ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శుక్రవారం జరిగింది. మృతి చెందిన యువకులందరూ వారి కుటుంబాల్లో రెండో సంతానం కాగా, అందరూ కూడా స్నేహితులే.

06/30/2018 - 05:24

న్యూఢిల్లీ, జూన్ 29: తన సహచర అధికారి భార్యను హత్యచేశాడన్న ఆరోపణలపై అరెస్టయిన ఆర్మీ మేజర్‌కు ఢిల్లీ హైకోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆర్మీ మేజర్ నిఖిల్ హాండాకు విధించిన నాలుగు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతోపోలీసులు ఆయన్ను శుక్రవారం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేడ్ కోర్టులో హాజరు పరచారు.

06/30/2018 - 05:07

గచ్చిబౌలి, జూన్ 29: వివాహమైన పదిహేనేళ్ల తరువాత అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు ఓ కానిస్టేబుల్ గురిచేస్తున్నాడు. తను ప్రభుత్వ ఉద్యోగినని, తక్కువ కట్నం ఇచ్చి తనకు పెళ్లి చేశారని భార్యను నిత్యం వేధిస్తూ నరకం చూపుతున్నాడు. ముగ్గురు ఆడపిల్లలను కన్నందుకు మరో పెళ్లి చేసుకుంటానని బెదిరించేవాడు. గురువారం మధ్యాహ్నం భార్యపై దాడి చేయడంతో ఇరుగుపొరుగు.. షీటీమ్‌కు ఫోన్ చేశారు.

Pages