S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/26/2018 - 01:21

న్యూఢిల్లీ, జూన్ 25: సహోద్యోగి భార్యను కిరాతంగా హత్యచేసిన ఆర్మీ మేజర్ నిఖిల్ హండాకు కోర్టు నాలుగు రోజుల రిమాండ్ విధించింది. యూపీలోని మీరట్ పట్టణంలో నిఖిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. భారీ భద్రత మధ్య ఆర్మీ మేజర్‌ను కోర్టుకు తీసుకొచ్చారు. నిందితుడుని నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపుతూ మెజిస్ట్రేట్ మనీషా త్రిపాఠీ ఆదేశించారు.

06/25/2018 - 23:51

సిద్దిపేట, జూన్ 25 : అంతర్‌జిల్లాను దొంగను అరెస్టు చేసి 22తులాల బంగారం, 1.25 కిలోల వెండి, 35వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవీస్ వెల్లడించారు. సోమవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

06/25/2018 - 04:49

కూచిపూడి, జూన్ 24: స్నేహితుడిని కలిసేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి అదుపు తప్పి కింద పడటంతో తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందిన విషాధ సంఘటన మొవ్వ మండలం బార్లపూడి, నర్సంపాలెం పీఆర్ రహదారిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.

06/24/2018 - 23:33

కర్నూలు, జూన్ 24 : ఓర్వకల్లు మండల పరిధిలోని సోమయాజులపల్లె గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంతో కర్నూలు-నంద్యాల ప్రధాన రహదారి రక్తసిక్తమైంది. ఆ రహదారిపై ఓ ఆటో పరిమితికి మించి ప్రయాణికులతో రాంగ్ రూట్‌లో వెళ్తుండగా నంద్యాల నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

06/24/2018 - 23:21

పుట్టపర్తి, జూన్ 24 : ప్రమాదవశాత్తు ఆదివారం ట్రాక్టర్ కింద పడి చిన్నారి సాయి అభిరామ్ (6) దుర్మరణం పాలయ్యాడు. వివరాలు ఇలా వున్నాయి. పుట్టపర్తి పట్టణంలోని పెద్దబజారుకు చెందిన రాంప్రసాద్ కుమారుడు సాయి అభిరామ్ సైకిల్ తొక్కుతూ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ కింద పడి అసువులుబాసాడు.

06/24/2018 - 22:13

దాచేపల్లి, జూన్ 24: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే పల్నాడులో కక్షల సెగ రాజుకుంటోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో మంచినీటి వద్ద జరిగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారడంతో తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తలు మారణాయుధాలతో పరస్పరం దాడులకు దిగడంతో ఇరు పార్టీలకు చెందిన 8మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

06/24/2018 - 22:09

నకరికల్లు, జూన్ 24: తెలంగాణా నుండి నరసరావుపేట వైపువెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలైన సంఘటన మండలంలోని దేచవరం సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. నకరికల్లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణా రాష్ట్రంలోని కొండ్రపోలు గ్రామం నుండి నరసరావుపేటకు మినీ లారీ బయలుదేరింది.

06/24/2018 - 04:55

అమీన్‌పూర్, జూన్ 23: ప్రమాదాలకు నిలయంగా మారిన అగర్వాల్ స్టీల్ పరిశ్రమ యాజమాన్యం అమాయక కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూనే ఉంది. కార్మిక శాఖ, కాలుష్య నియంత్రణ శాఖలు మాత్రం యాజమాన్యం అలసత్వానికి వత్తాసు పలుకుతున్నాయన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆయా ప్రమాదాల్లో కార్మికులు మరణిస్తున్నా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు.

06/24/2018 - 04:38

కేపీహెచ్‌బీకాలనీ, జూన్ 23: సెల్లార్‌లో పార్కు చేసిన కారులో నిద్రిస్తున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కధనం ప్రకారం జవహర్‌నగర్‌కు చెందిన గోపినాథ్ బ్లూ ఫీల్డ్స్ సెక్యూరిటీస్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.

06/24/2018 - 04:26

గిద్దలూరు, జూన్ 23: గిద్దలూరు రైల్వేస్టేషన్ సమీపంలో గిద్దలూరు - నంద్యాల వైపు సగిలేరు బ్రిడ్జికి, అంబవరం గేటు బ్రిడ్జికి మధ్యలో యువకుడు గూడ్స్‌బండి కిందపడి మృతిచెందిన సంఘటన శనివారం జరిగింది. వివరాల మేరకు గిద్దలూరు మండలం అంబవరం గ్రామానికి చెందిన బేరంగుల రామయ్య (35) శనివారం గుంటూరు నుంచి నంద్యాల వైపు వెళ్తున్న గూడ్స్‌బండి కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Pages