S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/22/2018 - 05:06

పటన్‌చెరు, జూన్ 21: రోడ్డు ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ దుర్మరణం పాలైన సంఘటన గురువారం పటన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

06/22/2018 - 05:02

నారాయణపేటటౌన్, జూన్ 21: మద్యం మత్తులో పోలీసులపై దాడి చేసి దుర్భాషలాడిన వ్యక్తులపై కానిస్టేబుళ్ల ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు.

06/22/2018 - 04:38

సత్తెనపల్లి, జూన్ 21: ఇనుపకడ్డీకి బంగారు పూతపూసి సినీఫక్కీలో బంగారం దొంగిలించే ముఠా కోసం పోలీసులు సత్తెనపల్లి మండల పరిధిలోని భృగుబండ గ్రామాన్ని గురువారం జల్లెడ పట్టారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సత్తెనపల్లి పరిసర ప్రాంతాలే కేంద్రంగా మాయ మాటలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నదొంగ బంగారం ముఠాను ఛేదించే క్రమంలో పోలీసు అధికారుల సమక్షంలో విసృత తనిఖీలు నిర్వహించారు.

06/22/2018 - 04:37

మాచవరం, జూన్ 21: మండలంలోని మోర్జంపాడులో గురువారం పట్టపగలు వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయ. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దుగ్గు పుల్లారెడ్డి (65), భార్య పూర్ణమ్మ (60)ను మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దుండగులు గొంతు కోసి అతి కిరాతకంగా హతమార్చారు.

06/22/2018 - 04:23

నందికొట్కూరు, జూన్ 21:పగిడ్యాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని వనములపాడు గ్రామంలో గురువారం అనుమానంతో భార్యను భర్తే నరికి చంపిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు.. పగిడ్యాల మండలం వనములపాడు గ్రామానికి చెందిన ఏసన్న కుమారుడు ముత్తయ్యకు కొత్తపల్లె మండలం ఎదురుపాడు గ్రామానికి చెందిన చెన్నయ్య, చంద్రమ్మ దంపతుల కూతురు రూతమ్మను ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం.

06/22/2018 - 04:19

ఓజిలి, జూన్ 21: బంగారు నగలకు మెరుగు పెడతామని చెప్పి ఇద్దరు మహిళలను బురిడీ కొట్టించి 8 సవర్ల బంగారు ఆభరణాలను స్వాహా చేసిన సంఘటన గురువారం చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే.. ఓజిలి మండలంలోని చిలమానుచేను గ్రామానికి చెందిన ముంతల ప్రమీలమ్మ, ఆమె కోడలు భారతి ఇద్దరు ఇంటిలో ఉండగా గుర్తుతెలియని ఓ ఇద్దరు వ్యక్తులు వారి ఇంటికి వచ్చారు.

06/22/2018 - 03:59

పరవాడ, జూన్ 21: అదృశ్యమైన మైనర్ బాలిక స్వీటీ కుమారి ఆచూకీ లభ్యం అయినట్లు పరవాడ పోలీస్‌స్టేషన్ రైటర్ కెనడీ తెలిపారు. మండలంలో దేశపాత్రునిపాలెంలో నివాసం ఉంటున్న సిఐఎస్‌ఎఫ్ ఉద్యోగి సత్యేంద్ర కుమార్ సింగ్ కుమార్తె స్వీటీ సింగ్ ఈనెల 19వ తేదీన ఇల్లు విడిచి వెళ్లినట్లు బుధవారం పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

06/22/2018 - 03:49

నూజివీడు, జూన్ 21: భార్యభర్తల గొడవ విషయంపై పోలీసు స్టేషన్లో పంచాయతీ జరుగుతుండగా ఆవేశంతో భార్య భర్తపై చెప్పుతో కొట్టింది. అవమాన భారంతో భర్త ఇంటికి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాట్రాయిలో గురువారం జరిగింది.

06/22/2018 - 03:47

రెడ్డిగూడెం, జూన్ 20: రెడ్డిగూడెం శివారు రాఘవాపురం గ్రామంలో వేంచేసి ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో గల అత్యంత ఖరీదైన దేవతా విగ్రహాలు బుధవారం రాత్రి చోరీకి గురికావటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.

06/22/2018 - 03:46

పాతబస్తీ, జూన్ 21: ఇష్టంలేని పెళ్లి నరకం నుండి తప్పించుకుని విజయవాడకు పరారై వచ్చిన ఓ యువతి వ్యభిచార గృహంలో బందీ అయింది. ఏడాది పాటు నకరం అనుభవించిన బాధితురాలు గురువారం ఉదయం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా నామాలపాడు గ్రామానికి చెందిన ఈసం మధుమతి(19) తండ్రి అటవీ శాఖలో పనిచేసేవాడు.

Pages