-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
సంగారెడ్డి, జూన్ 19: పరీక్షల్లో మాస్కాఫీయింగ్కు పాల్పడుతూ ఇన్విజిలెటర్కు పట్టుబడి డిబారైనందుకు మనస్థాపం చెందిన పీజీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఖేడ్ ఎస్ఐ నరేందర్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కల్వకుర్తి, జూన్ 19: కల్వకుర్తి పట్టణంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన గ్యాంగ్ రేప్ నిందింతులను 24 గంటలు దాటకముందే పోలీసులు గుర్తించారు. మంగళవారం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ ఎల్సీ నాయక్ వివరాలు వెల్లడించారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో వివాహిత మెడిసిన్ తీసుకొని వెళ్తుండగా ఆమెను రెండు బైక్లపై వెంబడించారు.
మహబూబ్నగర్టౌన్, జూన్ 19: గత నెల 12న బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన మైనర్ కిడ్నాప్ కేసును చేధించి ఇద్దరిని బాలానగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు డిఎస్పీ భాస్కర్ వెల్లడించారు. మంగళవారం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలానగర్ మండలానికి చెందిన సుజాత అనే మహిళ తన కూతురితో కలిసి జీవనం కొనసాగిస్తుండేది. అయితే మంజూల అనే మహిళతో సుజాతకు పరిచయం ఏర్పడింది.
మోర్తాడ్, జూన్ 19: మట్టికోసం మొండివాగులో తవ్విన గుంతలో నీరు నిండగా, అందులో పడి బావన నరేందర్ (42)అనే రైతు మృతి చెందాడు. ఇటీవల కురిసిన వర్షాలకు మొండివాగులోని గుంతలన్నీ నీటితో నిండిపోయాయి. అందులో మోటార్లను ఏర్పాటు చేసుకుని రైతులు పంటలు పండించుకుంటున్నారు. మంగళవారం బావిలో ఉన్న మోటార్ను సరి చేసేందుకు దిగగా, ప్రమాదవశాత్తు అందులోనే మునిగి మృతి చెందాడు.
శామీర్పేట, జూన్ 19: రాజీవ్ రహదారి పై ఆర్టీసీ బస్సు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన హృ దయ వీదారకమైన సంఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కీసర మండ లం చీర్యాల గ్రామానికి చెందిన మలగల చిన్న పెంట య్య(45), యాదాద్రి జిల్లా , బొమ్మలరామారం మం డలం, తుర్కల తూంకుంటకు చెందిన యాదగిరి (43), వరసకు వియ్యంకులు.
చిల్లకూరు, జూన్ 19: మండల పరిధిలోని ఓడూరు హరిజనవాడలో ఎఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగిశెట్టి వెంకటరమణయ్య ఇంటిలో మంగళవారం తెల్లవారుఝామున తలుపులను తొలగించి సినీఫక్కీలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కర్లపాలెం, జూన్ 19: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓయువకుడు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన బుద్దాం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన కుంచాల యేసుబాబు యాజలి వైపునుండి కర్లపాలెం వస్తుండగా కర్లపాలెం నుండి బుద్దాంవైపు వెళుతున్న మరోబైకు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
రాజమహేంద్రవరం, జూన్ 19: ఉన్మాదంతో కన్న తల్లి తన ఆరేళ్ల కుమార్తెపై కర్కశంగా కత్తితో దాడి చేసి, హత్యాయత్నం చేసింది. పోలీసు కేసు నుంచి తప్పించుకునేందుకు కట్టుకథ అల్లింది. అయితే చిన్నారి బాలిక పోలీసులకు జరిగిన విషయం తెలియజేయడంతో కన్నతల్లి కర్కశం బయటపడింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం దివాన్చెరువులో నివసించే సుబ్బా శారద స్థానిక దాబాలో పనిచేస్తుంది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
తాళ్లపూడి, జూన్ 19: చిన్నారి బాలికపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసిన సంఘటన మంగళవారం పెద్దేవంలో చోటుచేసుకుంది. తాళ్లపూడి ఎస్సై అశోక్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేవం గ్రామానికి చెందిన మూడవ తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికను మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో బుట్టాయగూడెం గ్రామానికి చెందిన మర్రి ఉదయ్కిరణ్ తన అమ్మమ్మ ఇంటికి వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
గాండ్లపెంట, జూన్ 19: మండల పరిధిలోని కదిరి-రాయచోటి ప్రధాన రహదారిలోని తాళ్లకాల్వ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్.పీకుంట మండలం గోపాలపురంకు చెందిన బీ.చక్రే నాయక్ (17) అక్కడికక్కడే మృతి చెందగా, అదే మండలంలోని సున్నపుగుట్టతండాకు చెందిన మురళీ నాయక్కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ హరినాథ్రెడ్డి తెలిపిన వివరాల మేరకు..