S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/17/2018 - 22:34

యు కొత్తపల్లి, జూన్ 17: జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం సముద్ర కెరటాల ఉద్ధృతికి ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు నైజీరియాకు చెందిన విద్యార్థులు కాగా వారిలో ఒకరి మృతదేహం లభ్యమయ్యంది. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు జరుగుతోంది.

06/17/2018 - 22:02

ధర్మవరం, జూన్ 17 : పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో దేవాంగ కల్యాణ మంటపం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఆగి వున్న లారీని ద్విచక్ర వాహనం బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో పట్టణంలోని దుర్గానగర్‌కు చెందిన షామీర్, ఇతని చెల్లెలు షాజిత, షాజిత కుమార్తె చిన్నారి పాహియాలు తీవ్రంగా గాయపడ్డారు. కాగా అనంతపురం సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి పాహియా మృతి చెందినట్లు సీఐ హరినాథ్ తెలిపారు.

06/17/2018 - 22:02

తనకల్లు, జూన్ 17: పెద్దలు సంపాదించిన ఆస్తిని పంచుకోవడానికి అన్నదమ్ముల మధ్య చెలరేగిన చిన్నపాటి గొడవలు హత్య దాకా దారితీసాయి. ఆస్తి కోసం అమ్మ కడుపున పుట్టిన తమ్ముని సైతం నరికి చంపిన దారుణం తనకల్లు మండలంలోని బొందలపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి.

06/17/2018 - 04:06

హైదరాబాద్/దిల్‌సుఖ్‌నగర్, జూన్ 16:రోజు రోజుకు మానవత్వం మంట గలిసిపోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థంకానీ పరిస్థితులు నెలకొన్నాయి. మానసిక వికలాంగులుగా జన్మిండమే తప్పా. ప్రపంచాన్ని పరిచయం చేసుకోకుండానే పైకి వెళ్లిపోయారు. తమకు రక్షణగా నిలబడాల్సిన వాళ్లే కాలయములయ్యారు. ఇద్దరు చిన్నారులను మేనమామే గొంతు నలిమి హత్య చేశాడు. చిన్నారుల హత్యతో చైతన్యపురి ప్రాంతమంత విషాద చాయలు అలుముకున్నాయి.

06/17/2018 - 03:44

బెంగళూరు, జూన్ 16: జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసులో విజయపురా జిల్లా శ్రీరామసేన అధ్యక్షుడు రాకేష్ మత్‌ను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసులో హిందూత్వ సంస్థకు చెందిన పరుశురా వాగ్మేర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తుకు రాష్ట్రప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి విదితమే.

06/17/2018 - 03:39

తిరువనంతపురం, జూన్ 16: ఒక పోలీసు డ్రైవర్‌పై అదనపు డీజీపీ సుడేష్ కుమార్ కుమార్తె దాడి చేసిన కేసులో ఆయనను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్మ్‌డ్ పోలీస్ బెటాలియన్ అదనపు డిజిగా ఉన్న కుమార్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. సుడేష్ కుమార్ కుమార్తె స్నిగ్ధ, పోలీసు డ్రైవర్ గవాస్కర్‌పై దాడి చేసి గాయపరిచింది. ఈ విషయమై గవాస్కర్ కుటుంబ సభ్యులు శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు.

06/17/2018 - 03:18

తిరుపతి, జూన్ 16: చిట్టీల పేరుతో తెలిసిన వారి నుంచి దాదాపు రూ. 1.60కోట్లు వసూలు చేసుకుని పరారైన మహిళను, ఆమె కుటుంబ సభ్యులను స్థానికులు పట్టుకుని ఈస్ట్ పోలీసులకు అప్పగించారు. తిరుపతి కొర్లగుంట సంజయ్‌గాంధీ కాలనీకి చెందిన జ్యోతి డ్వాక్రా సంఘంలో పనిచేస్తోంది. స్థానికంగా అందరితో బాగా పరిచయాలున్న ఆమె తొలుత చిన్న చిన్న చీట్టీలు వేసేది. కాగా కొంత కాలంగా పెద్దమొత్తంలో చిట్టీలు వేస్తోంది.

06/16/2018 - 04:22

కోటవురట్ల, జూన్ 15: మండలంలో బీకేపల్లిలో మైనర్ బాలికపై హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. విశాఖలో మైక్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నిందితుడు ఈకేసును తప్పుదోవ పట్టించడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈకేసులో బాధితురాలు, నిందితుడు ఇద్దరు మైనర్లే కావడం విశేషం.

06/16/2018 - 03:49

హైదరాబాద్, జూన్ 15: నగరంలో 33 దొంగతనాలు చేసిన ముగ్గురు దొంగలు టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కారు. వీరి నుంచి రూ.70 లక్షల విలువైన 1.65 కిలోల బంగారం, 80 తులాల వెండి, హోండా అక్కార్డ్ కారు, పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు నగర సిపి అంజనీకుమార్ తెలిపారు.

06/16/2018 - 03:46

హైదరాబాద్, జూన్ 15: ప్రస్తుతం పోలీస్‌లకు సవాల్ విసురుతూ, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సైబర్ నేరగాళ్లు రోజు రోజుకీ కొత్త పంథాలో మోసాలు చేస్తున్నారు. ఖాతాదారుడికి తెలియకుండానే అకౌంట్లో డబ్బు కాజేస్తున్నారు. క్రెడిట్ కార్డులతో మోసాలు, బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు, పిన్ నెంబర్ తీసుకుని దర్జాగా నగదు కొట్టేస్తున్నారు.

Pages