-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 15: గత కొంత కాలంగా ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న దొంగలను ఆర్పేట పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుడిని శుక్రవారం స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మహ్మద్ బాషా మీడియా ముందు హాజరు పరిచారు. నిందితుడిని అపహరణకు గురైన ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మహ్మద్ బాషా మీడియాకు వివరించారు.
కుషాయగూడ, జూన్ 15: ప్రేమ వివాహం చేసుకున్న యువతిని అపహరించిన ఘటన కుషాయిగూడ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది. ఎస్ఐ జి.చంద్రశేఖర్, బాధితులు పోలీసుల కథనం ప్రకారం- కుషాయిగూడ- చక్రీపురంలోని నివసిస్తున్న అరుగుల ఆనంద్ బోర్వెల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన పప్పుల రుచితను ప్రేమించి ఇటీవల ఆర్యసమాజ్లో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహంపై రుచిత తల్లిదండ్రులు భగ్గుమన్నారు.
గచ్చిబౌలి, జూన్ 15: చదివింది 7వ తరగతే అయితేనేమి అంతర్జాలం ఉపయోగించుకుని చోరీ చేయడంలో ఘనుడు. సంపన్నులు నివాసముండే విలాస్ని గూగుల్లో ఎంపిక చేసుకుని దొంగతనానికి దిగుతాడు. సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకి పంపించినా నిందితుడిలో ఎలాంటి మార్పురాలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. నిందితుడిని మాదాపూర్ సీసీఎస్, నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు.
గచ్చిబౌలి, జూన్ 15: పగలు వాచ్మెన్ డ్యూటీ, రాత్రి పని చేస్తున్న ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్న అసోం రాష్ట్రానికి చెందిన యువకుడిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో నిందితుడి వివరాలను డీసీపీ వెంకటేశ్వర రావు వెల్లడించారు.
చాదర్ఘాట్, జూన్ 15: చిన్నపాటి వివాదం.. ఓ హత్యకు దారితీసిన సంఘటన అఫ్జల్గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలను ఇన్స్పెక్టర్ పీజీ రెడ్డి తెలిపారు. చాదర్ఘాట్ సాయిబాబా గుడి సమీపంలోని ఫంక్షన్ హాళ్లలో దీపక్సింగ్ అలియాస్ గోరే (35), చాకలి శివ అలియాస్ కృష్ణ (29), నాగరాజు (25), బక్క శివ పనిచేస్తుండేవారు.
బెంగళూరు, జూన్ 15: ప్రముఖ జర్నలిస్టు గౌరి లంకేష్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన పరశురామ్ వాఘమేర్ను అరెస్ట్ చేసినట్టు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) వెల్లడించింది. పేరు వెల్లడించడానికి ఇష్టపడని సిట్ ఉన్నత అధికారి తెలిపిన వివరాల ప్రకారం గౌరీలంకేష్ను చంపడానికి ఉపయోగించిన ఆయుధానే్న గతంలో హేతువాది గోవింద్ పనసారే, ఎంఎం కాల్బుర్గి హత్యకు సైతం ఉపయోగించినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు.
న్యూఢిల్లీ, జూన్ 15: ఉల్ఫా తిరుగుబాటుదారులు, అస్సాం ప్రభుత్వం మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించి రెండు నెలలుగా అదృశ్యమైన రేబతి హుకాన్ ఆచూకీపై రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. తన తండ్రి రెండు నెలలుగా కనపడడం లేదని రేబతి హుకాన్ కుమారుడు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ను దాఖలు చేశారు.
బళ్ళారి, జూన్ 15: కర్నాటకలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. బళ్ళారి తాలూకా కోళూరుక్రాస్ వద్ద శుక్రవారం సాయంత్రం సిరుగుప్ప నుంచి వస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చిన ఇండికా కారును ఢీ కొంది. దీంతో కారులో ఉన్న సంతోష్(35), అతని కుమారుడు ప్రీతం(8), కృష్ణ(22), వినయ్(25), దాదాఖలందర్(23) అక్కడికక్కడే మృతి చెందారు.
కరీంనగర్ టౌన్: కరీంనగర్లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమ నిరాకరించిందనే కోపంతో ఉన్మాదిలా మారిన యువకుడు కత్తితో యువతి గొంతు కోసి హత్యాయత్నం చేశాడు. రక్తపు మడుగులో పడివున్న యువతిని ఆస్పత్రికి తరలించేలోపే మరణించింది. కలెక్టరేట్ ఎదుట మీ-సేవ కేంద్రంలో జరిగిన ఈ హఠాత్ సంఘటన పరిసరాల్లోని వారిని భయభ్రాంతులకు గురిచేసింది. వివిధ పనుల నిమిత్తం అక్కడకు వచ్చిన వారంతా భీతిల్లిపోయారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాల పునరుద్ధరణకు సంబంధించిన కేసులో అసెంబ్లీ కార్యదర్శికి, న్యాయ శాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలని న్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్పై శుక్రవారం హైకోర్టు విచారణకు చేపట్టింది.