S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/11/2018 - 02:45

అనకాపల్లి, జూన్ 10: పొట్ట గడవటం కోసం కూలి పనులకు వెళ్లిన ఇద్దరు యువకులు సంబంధిత పనులు చేస్తుండగా గోడకూలి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానిక గవరపాలెం గౌరమ్మ గుడి వద్ద ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. స్థానిక గవరపాలెం గౌరమ్మ గుడి సమీపంలో బుద్ద ప్రకాశరావువీధికి చెందిన శరగడం నాయుడు ఇంటిలో పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

06/11/2018 - 02:12

హైదరాబాద్/ఇబ్రహీంపట్నం, జూన్ 10: గుండెపోటుతో వ్యక్తి మృతి చెందగా పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు వాట్సాప్‌లో ఓ వార్త వైరల్‌గా మారిన సంఘటన ఇబ్రహీంపట్నంలో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని రాయపోల్ గ్రామానికి చెందిన వెంకటేష్ (43) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

06/10/2018 - 23:56

వలిగొండ, జూన్ 10: మండల కేంద్రంలో భువనగిరి-నల్లగొండ ప్రధాన రహదారి ప్రక్కన చెరువు సమీపంలో గల సాయిబాబా గుడిలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆదివారం నాడు గుడి పూజారి తలుపులు తీసేందుకై వెళ్లగా డోర్‌కు ఉన్న గడియను తొలగించి లోనికి ఎవరో ప్రవేశించినట్లు తెలిసింది. అదేవిధంగా గుడిలో ఉన్న హుండీని పగులగొట్టి అందులో ఉన్న కొంత నగదును దోచుకువెళ్లడం జరిగింది.

06/10/2018 - 23:37

విజయపురిసౌత్, జూన్ 10 : చేతబడి చేశాడనే నెపంతో ఓ తాతను మనవడు పీక కోసి హతమార్చిన సంఘటన శనివారం అర్ధరాత్రి విజయపురిసౌత్ పరిధిలోని 7వ మైలు చెంచు కాలనీలో చోటుచేసుకుంది. శీలం నరసింహం (75) కొంతకాలంగా చెంచు కాలనీలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. నరసింహం మనవడు శీలం అంజికి చేతబడి చేశాడనే నెపంతో అంజి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం తాగి కూరగాయలు కోసే కత్తితో నరసింహం పీక కోసి హత్య చేశాడు.

06/10/2018 - 23:32

ఏలూరు, జూన్ 10 : ఫేస్‌బుక్‌ల ద్వారా, వాట్సాప్‌ల ద్వారా మహిళలను వేధించి వారి వద్ద నుంచి బంగారం, నగదు అపహరించిన వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి కాజేసిన బంగారాన్ని కూడా రికవరీ చేసినట్లు ఏలూరు డి ఎస్‌పి కె ఈశ్వరరావు తెలిపారు.

06/10/2018 - 23:25

కాకినాడ సిటీ, జూన్ 10: స్నేహితులతో కలిసి కాకినాడ బీచ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ ఉన్న ఉప్పుటేరు వంతెన పైనుండి సెల్ఫీ తీసుకుంటూ ఉప్పుటేరులో పడి మునిగిపోయాడు. అయితే స్నేహితులు సకాలంలో రక్షించడంతో ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో కాకినాడ రూరల్ వాకలపూడి బీచ్ సమీపంలో చోటుచేసుకుంది.

06/10/2018 - 23:23

రాజవొమ్మంగి, జూన్ 10: భార్య కాపురానికి రాలేదని మనస్తాపానికి గురై పురుగు మందు సేవించి ఆత్మాహత్యా యత్నానికి పాల్పడిన హోంగార్డు వైనం ఇది. మండంలో చికిలింత గ్రామంలో జనుమూరి దారబాబు తన అత్తవారి ఇంటి వద్ద ఆదివారం సాయంత్రం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు 108లో అతనిని జడ్డంగి పీహెచ్‌సీకి తరలించగా వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేసి అడ్డతీగల ఆసుపత్రికి రిఫర్ చేశారు.

06/11/2018 - 03:48

చిత్తూరు: జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరం పోలీసు శిక్షణా కేంద్రం సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తల మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకొంది. ప్రశాంత్‌నగర్ కాలనీకి చెందిన తులసీరాం(42) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం తులసీరాం తన భార్య సుగుణ(35) కలసి పలమనేరులో ఉన్న తండ్రిని చూసేందుకు బుల్లెట్‌లో బయలు దేరారు.

06/10/2018 - 23:18

పుత్తూరు, జూన్ 10: ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పుత్తూరులో ఆదివారం జరిగింది. ఎస్సై హనుమంతప్ప తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన వెంకట్రాజు నాయుడు కుమారుడు శ్రీకాంత్ నాయుడు (23) పుత్తూరులో నివాసం ఉంటూ సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి పట్టణంలోని టీబీ రోడ్డులోని ఒక ప్రైవేటు హాస్టల్‌లో భోజనానికి వెళ్లాడు.

06/10/2018 - 23:11

నందికొట్కూరు, జూన్ 10:పట్టణంలోని నీలి షికారి పేటలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అతడిని నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామానికి చెందిన నరసింహులుగా(40)గా పోలీసులు గుర్తించారు. నీలిషికారి పేటలోని ఓ పాడుబడిన ఇంటిలో నుంచి దుర్వాసన వెదజల్లుతుండడంతో కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Pages