-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఉరవకొండ, జూన్ 9 : మండలంలోని ఆమిద్యాల గ్రామానికి చెందిన సాయికుమార్ (17) శనివారం పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సాయికుమార్కు కొద్దినెలల నుంచి మూర్చవ్యాధితో బాధపడేవాడు. ఈనేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జనార్ధన్నాయుడు తెలిపారు.
టిప్పర్, ద్విచక్ర వాహనం ఢీ - ఒకని మృతి
ఇబ్రహీంపట్నం, జూన్ 9: గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్షాపులో రెండు బోగీల మధ్య సెంట్రింగ్లో నలిగి కార్మికుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్షాపులో పనిచేస్తున్న మాధవరావు(51) శనివారం ఉదయం విధులకు వెళ్లాడు. 5వ వే వద్ద రెండు వ్యాగన్ల సెంట్రింగ్ మధ్య నలిగి అక్కడిక్కడే మృతి చెందాడు.
మహేశ్వరం, జూన్ 8: లక్ష రుపాయలు లంచం తీసుకుంటుండగా మహేశ్వరం ఎక్పైజ్ సీఐ ఎన్.శ్రీనివాసులను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం సాయంత్రం మహేశ్వరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తన సిబ్బందితో దాడులు నిర్వహించి శ్రీనివాసులను రెడ్హ్యండెండ్గా పట్టుకొని నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
రాజేంద్రనగర్, జూన్ 8: నకిలీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్న ఓ ముఠాను ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఖురేషీ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బొమ్మిడి వీరబాబు రంగారెడ్డి గత పది సంవత్సరాలుగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయి గ్రామంలో మేస్ర్తి పని చేసుకుంటూ ఇంట్లోనే బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడు.
ఉప్పల్, జూన్ 8: బోడుప్పల్, మేడిపల్లి పరిధిలో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న పేరుమోసిన వ్యక్తిని మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అతని వద్ద రూ.7లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని శుక్రవారం కోర్టుకు రిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పీర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్క్లేవ్లో నివసిస్తున్న రాజస్థాన్కు చెందిన ప్రజాపత్ సురేష్ (40) డ్రైవర్.
పెద్దపల్లి రూరల్, జూన్ 8: కడదాకా భర్తతో కాపురం చేయాల్సిన భార్య యముడి అవతారమెత్తింది. భర్త పెట్టే బాధలు తాళలేక విసిగిపోయిన భార్య భర్తను హతమార్చి తన తాళిని తానే తెంపుకున్న వైనం ఇది. తాగొచ్చి నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని కట్టుకున్న భర్తనే గొడ్డలితో నరికి చంపిన ఓ భార్య ఉదంతమిది.
ఇల్లంతకుంట, జూన్ 8: అభం శుభం తెలియని వయస్సులో ఈత నేర్చుకోవాలనే కుతూహలంతో స్విమ్మింగ్ పూల్కు వెళ్లి స్విమ్మింగ్ పూల్లో మునిగి మృతి చెందిన బాలుని విషాధ సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..మండల కేంద్రానికి చెందిన అంతటి శ్రీను-స్వరూపల కుమారుడు శివ (9) అనే బాలుడు ఈత నేర్చుకుందామని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు స్విమ్మింగ్ పూల్కు వెళ్లాడు.
కోదాడ, జూన్ 8: కోదాడ బైపాస్లో శ్రీరంగాపురం వద్ద బుధవారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కోదాడ పట్టణ పోలీసులు చెప్పిన వివరాల మేరకు హైద్రాబాద్నుండి విజయవాడవైపు వెళుతున్న బొలెరో వాహానం కోదాడ బైపాస్ శ్రీరంగాపురం వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి రోడ్డు అవతలకు దుసుకొనిపోయి బోల్తాపడింది.
మక్కువ, జూన్ 8: విద్యుదాఘాతానికి తండ్రీ కొడుకులు మృ త్యుఒడికి చేరడం తో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. ఎస్ఐ కృష్ణ ప్రసాద్ అందించిన వివరాల ప్రకారం.. మక్కువ మండలం పాపయ్యవలస గ్రామానికి చెందిన వై.శ్రీనివాసరావు(35) అతని భార్య వేణు, కుమారుడు సాయికుమార్(13), కుమార్తె అమృత కొంతకాలం క్రితం ఉపాధి కోసం హైదరాబాద్కు వలస వెళ్లారు. కాగా ఇటీవల సాయికుమార్ తిరిగి పాపయ్యవలస గ్రామానికి వచ్చాడు.
సత్తెనపల్లి, జూన్ 8: సత్తెనపల్లి నియోజకవర్గం ముపాళ్ల మండలం ఇరుకుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం శుక్రవారం చోటు చేసుకుంది. ఇసుక లోడుతో అటుగా వెళుతున్న లారీ వేగంగా వస్తూ బైకును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరోకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు కృష్ణాజిల్లా జగయ్యపేటకు చెందిన షేక్ కరిముల్లా (32).