S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/27/2018 - 01:01

పెదకాకాకాని, మే 26: లారీక్లీనర్ అతిగా మద్యం సేవించి రాంగ్‌రూట్‌లో లారీ నడిపి ఇద్దరి మృతికి కారణమైనాడు. ఈ సంఘటన శనివారం మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామం వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నాదెండ్ల మండలం కనపర్తికి చెందిన చెవుల రామారావు (55), చెవుల పెదబాబు (25) శనివారం కనపర్తి నండి తాడేపల్లి వద్ద గల గుండిమెడ గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.

05/27/2018 - 01:00

గుంటూరు (పట్నంబజారు), మే 26: హత్యకేసులో ముద్దాయిని అరండల్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం నిందితుల వివరాలను అరండల్‌పేట పోలీసుస్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వెస్ట్ డిఎస్‌పి సరిత తెలియజేశారు. సెల్‌ఫోన్ మిస్‌డ్ కాల్ ద్వారా పరిచయమైన శ్రీలక్ష్మి అనే యువతిని పొట్టిశ్రీరాములు నగర్‌కు చెందిన అఖిల్ తేజ గత రెండు సంవత్సరాల నుండి ఆమెతో సహజీవనం సాగిస్తున్నాడు.

05/27/2018 - 00:56

పిఠాపురం, మే 26: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మహిళ రెండు చేతుల మణికట్టు, మెడ కోసేసిన అతికిరాతక ఘటన ప్రజలను భయకంపితులను చేసింది. భార్యాభర్తలు నిద్రిస్తున్న సమయంలో భార్యపై మత్తు స్ప్రే కొట్టి ఈ ఉదంతానికి పాల్పడ్డారు. తేరుకుని చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె కేకలు వేసింది. ఇంట్లో తనతోపాటు ఉండాల్సిన భర్త కనిపించలేదు. భార్యపై దాడి చేసి భర్తను కిడ్నాప్ చేశారా..

05/27/2018 - 00:50

రేణిగుంట, మే 26: రాత్రివేళల్లో రైతులుగా వ్యవహరిస్తూ, పగటి పూట ఎర్రచందనం చెట్లను నరికే తొమ్మిది మంది స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం పట్టు కున్నారు. రాత్రివేళల్లో పొలాల్లో వ్యవసాయం చేసుకుంటున్నట్లు నటిస్తూ, పగటిపూట ఎర్రచందనం దుంగలనునరికి అక్రమంగారవాణా చేస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.

05/27/2018 - 00:49

శాంతీపురం, మే 26: మండల కేంద్రంలో సూపర్ బజార్ నడుపుతున్న ప్రముఖ వ్యాపారి శివాజీ(39) దారుణ హత్య శనివారం ఉదయం మండలంలో తీవ్ర కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు స్థానికంగా కిరాణా టోకు వ్యాపారిగా పేరు గాంచిన శివాజీ 16 ఏళ్ల క్రితం రాళ్లబూదుగూరుకు చెందిన మాదవిరాణి(27)తో వివాహమైంది. వీరి అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు ఆడపిల్లలు కలిగారు.

05/27/2018 - 00:48

తిరుపతి, మే 26: నకిలీ బంగారు పూత ఉన్న ఇత్తడి చూపి అసలు బంగారమని నమ్మించి ప్రజలను మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న ముఠాలోని ముగ్గురు వ్యక్తులను తిరుపతి క్రైం పోలీసులు శుక్రవారం తిరుపతి బాలజీ కాలనీ సర్కిల్ వద్ద అరెస్ట్‌చేసినట్లు తిరుపతి క్రైం డీఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు.

05/27/2018 - 00:42

రాజంపేట టౌన్, మే 26: రాజంపేట మండలం బోయనపల్లెకు చెందిన కొమ్మి ఇందిరమ్మ (30)ను సమీపంలోని చర్చి ఫాస్టర్ సుబ్బరాయుడు హత్యచేసిన సంఘటన శనివారం తెల్లవారు జామున జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. బోయనపల్లె దళితవాడకు చెందిన వర్ల సుబ్బరాయుడు కొంతకాలంగా ఏసుక్రీస్తు చర్చిలో ఫాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో చర్చికి సమీపంలో నివసిస్తున్న ఇందిరతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు.

05/27/2018 - 00:41

రాజంపేట టౌన్, మే 26:మద్యం మత్తులో కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త ఉదంతం శనివారం రాజంపేట పట్టణం మన్నూరు దళితవాడలో వెలుగు చూసింది. పొగతతోటి రాముడు శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య ఆదిలక్షుమ్మ (45) రోజు మద్యం ఎందుకు తాగుతున్నావని నిలదీయడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం జరగడంతో ఇనుపరాడ్‌తో తలపై మోదగా భార్య అక్కడిక్కడే మృతి చెందింది.

05/27/2018 - 00:37

బొండపల్లి, మే 26: మండలంలోని కనిమెరక రైల్వే గేటు సమీపంలో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. బొబ్బిలి రైల్వే హెచ్‌సి నారాయణరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతి చెందిన వ్యక్తి ఐదు అడుగుల నాలుగంగుళాల పొడవు సుమారు 55 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటాడని తెలిపారు. తెలుపురంగు లాల్చీ, నీలంరంగు గడుల లుంగీ, గులాబీరంగు గడుల తువ్వాలతో కలిగి ఉన్నాడని తెలిపారు.

05/27/2018 - 00:14

గుత్తి, మే 26 : మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామంలో లాలు (17) శనివారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వ్యవసాయ కూలీగా పనిచేసే లాలు పొలం పనుల నిమిత్తం గ్రామ సమీపంలోని తోటలో పని చేసేందుకు వెళ్లాడు. అయితే ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగి కిందపడిన విషయాన్ని గమనించని లాలు విద్యుత్ వైర్లపై కాలుపెట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

Pages