S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/25/2018 - 23:27

చిత్తూరు, మే 25: గుడిపాల మండలం పానాటూరు క్రాస్ వద్ద ఈనెల 11వ తేదిన జరిగిన జంట హత్యల కేసులను చిత్తూరు జిల్లా పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఈ జంట హత్యలు జిల్లాలోకలకలం సృష్టించాయి. ఈ హత్యకు పాల్పడింది చెన్నై నగరంలో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ సీజింగ్ రాజా గ్యాంగ్‌గా పోలీసులు నిర్దారించారు.

05/25/2018 - 23:26

ములకలచెరువు, మే 25: పెద్దమండ్యం మండలం, చెరువుకిందపల్లె వద ఈనెల 14న జరిగిన నాగమల్లప్పనాయుడు(50) హత్యకేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్‌చేసి శుక్రవారం రిమాండ్‌కు పంపినట్లు సిఐ రుషికేశవ వెల్లడించారు. సిఐ రుషికేశవ కథనం మేరకు వివరాలిలా వున్నాయి.

05/25/2018 - 04:29

విశాఖపట్నం, మే 24: మావోయిస్ట్ ఈస్ట్ డివిజన్‌లోని పెదబయలు దళానికి చెందిన మహిళతో సహా ఇద్దరు మావోయిస్ట్‌లు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఎదుట గురువారం లొంగిపోంది. మావోయిస్ట్ దళ సభ్యులుగా పనిచేస్తున్న గొల్లూరి సరయి (25) అలియాస్ భాను, చిన్ని ఎస్పీ ఎదుట లొంగిపోయింది. సరయి 2009లో మావోయిస్ట్ దళంలో చేరి, విప్లవ గీతాలు ఆలపిస్తుండేది. 2010లో ఆమెను జెఎన్‌ఎం పార్టీకి డిప్యూటీ కమాండర్‌గా నియమించారు.

05/25/2018 - 04:12

పోలవరం, మే 24: గోదావరి నదిలో ఈ నెల 15వ తేదీన లాంచీ ప్రమాదానికి బాధ్యులైన లాంచీ యజమాని, సరంగును అరెస్టుచేశామని పోలవరం డీఎస్పీ ఎటివి రవికుమార్ తెలిపారు. వాడపల్లిలో జరిగిన విషాద సంఘటనలో 19మంది మృతిచెందిన విషయం విదితమే. లక్ష్మీ వెంకటేశ్వర సర్వీసు లాంచీ తూర్పు గోదావరి జిల్లా కొండమొదలు-దేవీపట్నం నడుమ తిరుగుతుంటుంది.

05/25/2018 - 04:11

పుంగనూరు, మే 24: పనె్నండేళ్ల ఓ మైనర్ బాలికపై ఐదుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి పాల్పడిన వారు మైనర్లు కావడంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

05/25/2018 - 03:39

ఉప్పల్, మే 24: డ్రైవర్ నిర్లక్ష్యం డ్రైవింగ్ ఓ నిండు ప్రాణం తీసింది. వేగంగా వచ్చిన కంటైనర్ అదుపుతప్పి రింగ్‌రోడ్డులో పార్కుకు ఢీకొంది. భయంతో అక్కడ ఉన్న జనం పరుగులు తీయగా అదే సమయంలో రూ.5 భోజనం కోసం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జంగయ్య గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలో మరణించాడు.

05/25/2018 - 03:30

మచిలీపట్నం, మే 24: మద్యం మత్తులో మరో ఇరువురు వ్యక్తులతో కలిసి వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో మంగినపూడి బీచ్ సమీపంలోని సరుగుతోటల్లో భార్యను హతమర్చిన భర్త ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. బందరు తాలుకా పోలీసు స్టేషన్ పరిధిలోని మంగినపూడి బీచ్ వద్ద సరుగుతోటల్లో బుధవారం ఉదయం వివాహిత మహిళ హత్యకు గురైంది.

05/25/2018 - 03:26

నందిగామ, మే 24: నందిగామ - మధిర రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో 8మంది గాయపడ్డారు. సేకరించిన సమాచారం ప్రకారం కంచికచర్ల మండలం కీసర నుండి శుభ కార్యం నిమిత్తం నాలుగు ఆటోల్లో పలువురు గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామానికి వెళుతుండగా మాగల్లు గ్రామం వద్ద ఒక ఆటో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి పల్టీ కొట్టింది.

05/25/2018 - 02:40

వరంగల్, మే 24: ఎట్టకేలకు వరంగల్ సైబర్ క్రైం పోలీసులు ఆన్‌లైన్ మోసాలకు చెక్‌పెట్టారు. వరంగల్ పోలీసు కమిషనరేట్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ నగరాల్లో బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల నుండి డబ్బులు ఆన్‌లైన్ ద్వారా చోరీకి పాల్పడుతున్న నిందితుడిని వరంగల్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేసారు.

05/25/2018 - 01:40

దేవరకొండ, మే 24: నల్లగొండ జిల్లా దేవరకొండ ఎక్సైజ్ సీఐ ఆర్ వెంకటేశ్వర్లు గురువారం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. గీత కార్మికుడు మారుపాకుల సురేశ్‌గౌడ్ నుండి తన కార్యాలయంలో రూ.9600 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బీ. కృష్ణగౌడ్ చెప్పిన వివరాల ప్రకారం..

Pages