S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/25/2018 - 04:32

ఏలూరు: రాష్టవ్య్రాప్తంగా పెను సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసులో కీలక నిందితునిగా భావిస్తున్న అవ్వా సీతారామారావును సీఐడీ అధికారులు గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని ఎస్సీ, ఎస్టీ సెల్ న్యాయమూర్తి కె సునీత ఎదుట హాజరపర్చారు. న్యాయమూర్తి ఆయనకు రిమాండు విధించడంతో ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు.

05/24/2018 - 23:48

గుంటూరు, మే 24: తెనాలి పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న గుంటి వెంకట్‌తో పాటు ఐదుగురు సబ్ బుక్కీలను అరెస్ట్ చేసినట్లు రూరల్ ఎస్‌పి సిహెచ్ వెంకటప్పల నాయుడు తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

05/24/2018 - 23:40

రూ. 25లక్షల విలువైన 42 మోటార్‌సైకిళ్లు, మోపెడ్లు స్వాధీనం: అర్బన్ ఎస్పీ రాజకుమారి

05/24/2018 - 23:36

తిరుపతి, మే 24: ఉన్నత చదువులు చదివి, పలుచోట్ల ఉద్యోగాలు చేసి సులభంగా ధనార్జనకు ఆశపడి, అనేకసార్లు పోలీసులకు చిక్కి జైలు శిక్ష అనుభవించినప్పటికీ తిరిగి చోరీలకు పాల్పడుతున్న కడప జిల్లా, సింహాద్రిపురం మండలం, రావులకొలను గ్రామానికి చెందిన ఉప్పలూరి నాగేశ్వరరెడ్డి అనే పాత నేరస్థుడిని క్రైం సీఐ రసూల్‌సాహెబ్, ఆయన సిబ్బంది బుధవారం అరెస్టు చేశారు.

05/24/2018 - 23:19

పెనగలూరు, మే 4: మండలంలోని కంబాలగుంటకు చెందిన కోనేరు శేఖర్ (15) అనే విద్యార్థి గురువారం ఉదయం గుళికల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ నాయక్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. శింగారెడ్డిపల్లె పంచాయతీ కంబాలగుంటకు చెందిన వెంకటేశ్ కుటుంబం నివాసం ఉంది. వెంకటేష్ కుమారుడు శేఖర్ ఇంట్లో ప్రతి రోజు సెల్‌ఫోన్ కొనివ్వమని అల్లరి చేసే వాడు.

05/24/2018 - 23:18

నందలూరు, మే 24: నందలూరు హైవేలో గురువారం నిర్వహించిన వాహనాల తనిఖీలో మద్యం సేవించి లారీని నడిపిన బేతంచర్లకు చెందిన డ్రైవర్ ఎం.వెంకటేష్‌ను కోర్టులో హాజరు పరచగా జడ్జి సౌమ్యజోసిఫిన్ 70 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శిక్ష విధించిన డ్రైవర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

05/24/2018 - 22:31

అగళి, మే 24 : మండల పరిధిలోని బొమ్మరసనపల్లికి చెందిన దేవరాజు(42) బుధవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎఎస్సై ఖలీల్‌బాషా తెలిపారు. దేవరాజు గత కొంతకాలంగా మద్యం సేవించేవాడని, మద్యం సేవించడానికి అప్పులు అధికం కావడంతో మనస్తాపానికి గురై మద్యంలో పురుగుల కలుపుకొని సేవించాడు.

05/23/2018 - 01:53

లక్సెట్టిపేట, మే 22: మండలంలోని దౌడపల్లిలో తనయుడు తండ్రిపై కత్తితో దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మంచిర్యాలకు చెందిన కునారపు మల్లయ్య తన కూతురు వద్ద ఉంటున్నాడు. మల్లయ్యకు ఇద్దరు భార్యలు ఉన్న ట్లు తెలిసింది. కాగా కొంత కాలం క్రితం మల్లయ్య తన రెండో భార్యను చంపిన కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చి తన కూతురి వద్ద ఉంటున్నాడు.

05/23/2018 - 01:52

లక్సెట్టిపేట, మే 22: మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన అంకూస్‌బీ (45) అనే మహిళ ఇంట్లోని రేకుల షెడ్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి... మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. తన పెద్ద కూతురు మానసిక పరిస్థితి బాగా లేదని, ఆమె విషయంలోనే అంకూస్‌బీ ఎప్పుడూ దిగాలుగా ఉండేందని కుటుంబసభ్యులు చెప్పారు.

05/23/2018 - 01:23

సిరిసిల్ల, మే 22: జిల్లాలో సంచలనం రేపిన మూడపల్లి గ్రామ సర్పంచ్ గోలి శంకర్ హత్య కేసును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హగ్డే నిందుతులను ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు.

Pages