S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/01/2018 - 02:58

కొనకనమిట్ల, ఏప్రిల్ 30: ఒంగోలు - కర్నూలు రహదారిపై సోమవారం ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామసమీపంలో ఆటో - డిసిఎం లారి ఢీకొనగా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. బట్టల వ్యాపారం చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు ఒంగోలు నుంచి టాటాఎసి ఆటోను మాట్లాడుకుని నంద్యాలకు ఆదివారం రాత్రి బయలుదేరారు.

05/01/2018 - 02:56

భద్రాచలం టౌన్, ఏప్రిల్ 30: భద్రాచలం ఐటీడీఏలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి గుత్తేదారుకు బిల్లు మంజూరు చేయడానికి ఐటీడీఏలోని ఇంజనీరింగ్ శాఖ ఈఈ శంకర్ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. గుత్తేదారు అంత ఇచ్చుకోలేనని చెప్పినా ఈఈ అంగీకరించకపోవడంతో గుత్తేదారు శ్రీనివాసరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

05/01/2018 - 02:43

వికారాబాద్, ఏప్రిల్ 30: ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ సర్వే, ల్యాండ్ ఏడీ సదాశివుడు అధికారి ఏసీబీకి పట్టుబడిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది.

05/01/2018 - 02:04

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 30: ఇళ్లకు కన్నంవేసే కరుగట్టిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ అనురాధ వెల్లడించారు.

05/01/2018 - 01:02

ఆదోని, ఏప్రిల్ 30 : ఆదోని డివిజన్‌లోని పెద్దహరివాణం గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే కేంద్రాలపై పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 5,31,490 స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. పెద్దహరివాణంలో రంగస్వామి, దేవేంద్రప్ప, కురువ లింగన్న, ఇండ్లపై దాడి చేసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసి వారి నుంచి రూ.

05/01/2018 - 01:01

ఆదోని, ఏప్రిల్ 30: ఆదోని డివిజన్‌లోని దేవనకొండలో భార్య విజయలక్ష్మీని హత్య చేసిన కేసులో భర్త నర్సప్ప, అత్త సుశీలమ్మలపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు శిక్ష విధిస్తూ ఆదోని రెండవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు తీర్పు చెప్పినట్లు అడిషనల్ పీపీ రఫత్ పేర్కొన్నారు. సోమవారం కేసు తీర్పును జడ్జి ప్రకటించినట్లు ఆమె పేర్కొన్నారు.

05/01/2018 - 01:01

నందికొట్కూరు, ఏప్రిల్ 30:పట్టణంలోని పగిడ్యాల రహదారిలో ఉన్న పోతురాజుకుంటలో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ శవం కుంటలో గత 3 రోజులుగా ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కాగా అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక ఎవరైనా హత్య చేసి కుంటలో పడేశారా అనే విషయాలు పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి వుంది.

05/01/2018 - 00:36

విజయపురిసౌత్, ఏప్రిల్ 30: వివాహ వేడుకల్లో విద్యుదాఘాతానికి ఒకరు మృతిచెందగా మరో ఐదుగురికి గాయాలై వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషాద సంఘటన సోమవారం రేగులవరం తండాలో చోటు చేసుకుంది. వివరాలలోకెళ్తే... వడితె సాయికుమార్ వివాహం సందర్భంగా పెళ్లికుమారుడైన సాయికుమార్‌కు నలుగుపెట్టే సమయంలో పాటపాడేందుకు అదే గ్రామానికి చెందిన వడితె సునీత (16)ను తీసుకొచ్చారు.

05/01/2018 - 00:06

రావులపాలెం, ఏప్రిల్ 30: అప్పుల బాధ తాళలేక రావులపాలెంకు చెందిన ఒక దంత వైద్యుడు సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గ్రామంలోని వైఎస్సార్ జంక్షన్ సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న కొవ్వూరి భీమ శ్రీనివాసరెడ్డి (38) కొనే్నళ్లుగా స్థానిక సీఆర్సీ రోడ్డులో జనప్రియ దంత వైద్యశాల నిర్వహిస్తున్నాడు.

04/30/2018 - 23:57

యాడికి, ఏప్రిల్ 30 : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి కాలనీలో రెండిళ్లు, మరువవంక సమీపంలోని మరో ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి చోరీకి పాల్పడారు. ఈ చోరీలో దాదాపు 11 తులాల బంగారంతోపాటు 250 గ్రాముల వెండి, 2,500 నగదు చోరీకి గురైనట్లు స్థానిక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు ఆసుపత్రి కాలనీలోని చంద్రశేఖర్, పుల్లారెడ్డి ఇళ్లకు తాళం వేసి ఓ వివాహ వేడుకకు వెళ్లారు.

Pages