-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ముద్దనూరు, ఏప్రిల్ 14: మండల పరిధిలోని ఒబుళాపురం సమీపంలోని కొండగుట్టలో బ్లాస్టింగ్ కోసం రంద్రాలువేస్తున్న ట్రాక్టర్ బోల్తా పడి అంకన్న(37) శనివారం మృతిచెందాడు.
బలిజిపేట, ఏప్రిల్ 14: మండలం నారాయణపురం గ్రామంలో ఆర్టీసి బస్సు, 104 వాహనం ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం వెలుగుచూసింది.
గోపాలపురం, ఏప్రిల్ 14: గోపాలపురంలో ఒక ఇంట్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గుర్ని పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి రూ.94,380లు నగదు, 8 సెల్ ఫోన్లు, ఎల్ఈడీ టీవీ, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్టు ఐపీఎస్ ట్రైనీ అధికారి, దేవరపల్లి ఎస్హెచ్వో వై నిశాంత్రెడ్డి శనివారం సాయంత్రం విలేఖర్లకు తెలిపారు.
చిలమత్తూరు, ఏప్రిల్ 14 : మండల పరిధిలోని కొక్కవాండ్లపల్లికి చెందిన సంతోష్ (9) సోమఘట్ట నీటి గుంతలో పడి మృతి చెందాడు. కొక్కవాండ్లపల్లికి చెందిన రమేష్, శోభ కుమారుడు సంతోష్ రెండు రోజులుగా అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల ఇళ్లలో గాలించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈనేపథ్యంలో శనివారం ఉదయం సోమఘట్ట చెరువు నీటి గుంతలో శవమై కనిపించాడు.
అనంతపురం అర్బన్, ఏప్రిల్ 14: మహిళలు, అమ్మాయిలపై వేధింపులకు పాల్పడ్డ 33 మందిపై ఈవ్టీజర్లను పట్టుకోవటంతోపాటు ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. మహిళలు, అమ్మాయిలపై జరిగే నేరాలపై తక్షణ సమాచారం అందిస్తే చర్యలు సైతం తీసుకోవటం జరుగుతుందన్నారు. శనివారం మహిళా రక్షక్ బృందాల వారం రోజుల పనితీరుపై ఎస్పీ సమీక్షించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 13: అపార్టుమెంట్ నిర్మా ణం పేరుతో ఫ్లాట్ కొనుగోలుదారులను, తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు టోకరా వేసిన మోసగాడిని నగర సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సిసిఎస్ డిసిపి శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన బండి సుధాకర్ను అరెస్టు చేసినట్లు తెలిపారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 13: విజయవాడ ఏలూరు రోడ్డులోని విజయా బ్యాంక్ మేనేజర్, మరో ఎనిమిది మందికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ విశాఖలోని సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 13: విశాఖ ఎయిర్పోర్టులో ఓ మహిళ నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ కమిషనర్ డాక్టర్ డీ.కే.శ్రీనివాస్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదోని, ఏప్రిల్ 13 : కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దొంగనోట్లను మార్పిడి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదోని డీఎస్పీ ప్రసాద్ తెలిపిన వివరాలు.. ఈ నెల 12వ తేదీ ఆదోని పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో ఒక వ్యక్తి ఇచ్చిన రూ. 200 నోటును నకిలీదిగా గుర్తించి బంకు మేనేజర్ ఫిర్యాదు చేశాడన్నారు.
కోవూరు, ఏప్రిల్ 13: నెల్లూరు జిల్లా కోవూరు పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా అత్యాచారాలు, దాడులు చేస్తూ జనాల కంటి మీద కునుకు లేకుండా చేసిన సైకోను ఎట్టకేలకు కోవూరు పోలీసులు గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.