-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్ : నగరంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఈస్ట్మారేడ్పల్లిలోని ఓ ఇంట్లో కారు సీట్లో బంగారంతో పాటు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్లో భారీగా బంగారం పట్టుబడింది. ఈస్ట్మారేడ్పల్లిలోని షైన్ ఆసుపత్రిపై దాడులు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు నలబై బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్/శేరిలింగంపల్లి: ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బయో డైవర్సిటీ ఫ్లైఓవర్పై మితిమీరిన వేగంతో వెళుతున్న కారు పల్టీకొట్టి కింద పడిన సంఘటనలో ఓ మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఫ్లైఓవర్ ప్రమాదాలకు నిలయంగా మారిందని చాలాకాలంగా ఆందోళన వ్యక్తమవుతుండగా, తాజా సంఘటన వారి వాదనకు బలాన్నిస్తున్నది. ఈ సంఘటనలో, అతి వేగంగా దూసుకెళ్ళిన కారు గాలిలో పల్టీలుకొడుతూ రోడ్డు పక్కన చెట్టుపై పడింది.
హైదరాబాద్, నవంబర్ 21: వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని పౌరసత్వాన్ని కేంద్రహోం శాఖ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చెన్నమనేని నకిలీ ధ్రువపత్రాలు సమఠ్పించారని పేర్కొంటూ చెన్నమనేని పిటిషన్పై ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆది శ్రీనివాస్ హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు.
మక్తల్, నవంబర్ 21: అవినీతి అధికారులపై ఒక పక్క ఏసీబీ దాడులు, మరోపక్క పెట్రోల్ దాడులు జరుగుతున్నా లంచం తీసుకోవడానికి మాత్రం కొందరు అధికారులు ఏమాత్రం వెరవడం లేదు. పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ నారాయణపేట జిల్లాలో ఒక అధికారి, ఆయన ప్రైవేట్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు చిక్కారు.
వరంగల్, నవంబర్ 21: గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఐదుగురు గంజాయి స్మగ్లర్లను గురువారం వరంగల్లో పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి సుమారు 50 లక్షల రూపాయల విలువగల అరటన్ను(500కిలోల) గంజాయితో పాటు రెండు నాటు తుపాకులు, 11 రౌండ్లు, ఒక కత్తి, ఒక బొలేరో వాహనం ఐదు సెల్ఫోన్లు, ఒక కారు, లక్షా 50 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ (క్రైం), నవంబర్ 21: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కొనసాగుతున్న తనిఖీల్లో భాగంగా పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 40మంది వాహనచోదకులు పట్టుబడ్డారు. ట్రాఫిక్ ఏడీసీపీ టీవీ నాగరాజు పర్యవేక్షణలో నిర్వహించిన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 518 కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్: విద్వేషాలను రగిలించే ఉపన్యాసం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కరీంనగర్లో జరిగిన బహిరంగ సభలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ 15 నిమిషాలు తమకు వదిలిపెడితే తమ సంగ తి ఏమిటో చెబుతామని పేర్కొంటూ విద్వేషాలను రగిలించారని కరుణసాగర్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
చెన్నై, నవంబర్ 21: రాజీవ్ గాంధీ హంతకుల్లో ఒకడైన రాబర్ట్ పయాస్కు మద్రాస్ హైకోర్టు గురువారం 30 రోజుల పెరోల్ను మంజూరు చేసింది. పయాస్తో పాటు మురుగన్, శాంతన్, పెరరివలన్, రవిచంద్రన్, జయకుమార్, నళిని కూడా ఈకేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 21: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో తీహార్ జైలులోఉన్న కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరాన్ని ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఢిల్లీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయన మనీలాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
కోవూరు, నవంబర్ 20: నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో మహిళను దారుణంగా హత్యచేసి గోనె సంచికి మూటకట్టి కాలువలో పడేశారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు మండలంలోని పడుగుపాడు వద్ద సుమారు 35 సంవత్సరాల వయస్సు గల ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెను హత్యచేసిన దుండగులు మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి కాలువలో పడేశారు.