-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్, మార్చి 9: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయడంపై దాఖలైన పిటీషన్లపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. నల్గొండ, ఆలంపూర్ శాసనసభ స్థానాలు ఖాళీ అయినట్టు నోటిఫై చేయకుండా , శాసనసభ సభ్యత్వాల రద్దును నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై జస్టిస్ బి శివశంకర్ విచారణ పూర్తి చేశారు.
రాజుపాలెం, ఏప్రిల్ 9: కుటుంబ కలహాలతో తల్లి ఆత్మహత్య చేసుకోవడమే కాక కూతురికి పాలల్లో విషం కలిపి ఇద్దరూ మృతిచెందిన సంఘటన మండలంలోని గణపవరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు... బుడుగు వెంకట్రావ్, విజయలక్ష్మిలకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక ఆడ సంతానం కలిగింది. గత సంత్సరం నుండి భార్యభర్తల మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 9: హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘోర ప్రమాదం నుండి తప్పించుకున్నారు.మహారాష్ట్ర ఔరంగాబాద్ నుండి హైదరాబాద్ తిరుగుపయనం అయినపుడు ఎదురుగా వచ్చిన ఒక పెద్ద ట్రక్కు ఆయ న కారుపైకి వచ్చింది. దానిని గమనించిన రాజాసింగ్ డ్రైవర్ సీట్లో ఉన్న తన స్నేహితుడ్ని హెచ్చరించి కారును సర్వీసు రోడ్డులోకి వెళ్లాల్సిందిగా హెచ్చరించడంతో ముప్పు తప్పింది.
అర్వపల్లి, ఏప్రిల్ 9: మూడురోజుల్లో వివాహం జరుగాల్సి ఉండటంతో బంధుమిత్రులతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో అనుకొని ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. విద్యుత్షాక్కు గురై పెళ్లికుమారుని తండ్రి, బావ మృతిచెందిన విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని కొమ్మాల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.
చెన్నై, ఏప్రిల్ 8: మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ను అరికట్టడానికి బీసీసీఐ ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టకుండానే ఐపీఎల్ను నిర్వహించొద్దంటూ తమిళనాడు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఐపీఎల్ అధికారి జి.సంపత్కుమార్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖల చేశాడు. ఐపీఎల్లో ఆడే 8 జట్లను ఇందులో ప్రతివాదులుగా చేర్చాడు. పిల్ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ ఇంద్రా బెనర్జీ, జస్టిస్ సెల్వంతో కూడిన ధర్మాసనం..
హైదరాబాద్, ఏప్రిల్ 8: తెలుగు సినీ రంగం (టాలీవుడ్)తో పాటు రాష్ట్రాన్ని కుదిపేసిన డ్రగ్స్ కేసులో మరిన్ని చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ఈ కేసులను విచారిస్తున్న ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సిద్ధమవుతోంది. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్తో పాటు మరికొందరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
వరంగల్, ఏప్రిల్ 8: వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చంద్రగిరి, ఏప్రిల్ 8: చంద్రగిరి మండలం మామండూరు వద్ధ కారు-లారీ ఢీకొనడంతో మహిళ మృతిచెందిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బెంగళూరుకు చెందిన ధనంజయ కుటుంబ సభ్యులు మారుతీ కారులో తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమవగా మామాండూరు వద్ద చిత్తూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న లారీ కారును ఢీకొనడంతో ధనంజయ, భార్య కోమల, మరో ముగ్గరికి తీవ్రగాయాలయ్యాయి.
తిరుపతి, ఏప్రిల్ 8: అనంతపురం జిల్లా గుత్తికి చెందిన నెట్టికంటి (54) అనే వ్యక్తి ఆదివారం తిరుమలలోని మాధవ నిలయం వద్ద మృతి చెంది పడి ఉండగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని దుస్తులను పరిశీలించగా అతని వద్ద ఆధార్ కార్డు లభించింది. దీని ఆధారంగా మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
హిందూపురం, ఏప్రిల్ 8: స్థానిక రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఉన్న ఇంజనీరింగ్ కార్యాలయం ఎదుట ఓ గుర్తు తెలియని వ్యక్తి (45) మృతి చెందాడు. మృతుడు నీలం రంగు టీషర్టు, లైట్ బ్లూ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వ్యక్తులు టూటౌన్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు టూటౌన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.