-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
విజయనగరం, ఏప్రిల్ 2: పట్టణంలో సంచలనం కలిగించిన కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. గతనెల 24వతేదీన జరిగిన ఈ సంఘటనలో నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్పీ జి.పాలరాజు తెలిపారు. సోమవారం ఇక్కడ ఎస్పీ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొత్స మోహన్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి నమ్మి అప్పలరాజును 9ఎంఎం తుపాకీతో కాల్చి చంపాడని ఎస్పీ తెలిపారు.
కొల్చారం, ఏప్రిల్ 2: కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిన్నఘనపూర్ గ్రామానికి చెందిన బిట్ల నాగభూషణం (46), వీరమణి (42) దంపతులకు ఇద్దరు కుమారులు. కాగా పెద్దకుమారుడు రాధాకృష్ణ మెదక్ మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
గొల్లప్రోలు, ఏప్రిల్ 2: గొల్లప్రోలు మండలం వనె్నపూడి గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి ట్రాక్టరు బోల్తాపడిన ఘటనలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యు కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన సుమారు 30 మంది శుభకార్యం నిమిత్తం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి ట్రాక్టరుపై వచ్చారు. భోజనాల అనంతరం తిరిగి వెడుతుండగా వనె్నపూడి శివారులో ట్రాక్టరు బోల్తాపడింది.
హైదరాబాద్, ఏప్రిల్ 1: నిలోఫర్ పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏడాదిన్నర వయస్సున్న బాలుడు మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలుడు చనిపోయాడని ఆ బాలుడి బంధువులు ఆందోళన చేశారు. హాస్పిటల్ వద్ద ధర్నాకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారికి నచ్చచెప్పారు. వైద్యునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
వనస్థలిపురం, ఏప్రిల్ 1: మూడు గంటల్లో పెళ్లి ఉండటంతో పనుల కోసం నీళ్లు పడుతుండగా కరెంట్ షాక్తో పెళ్లికొడుకు తండ్రి అక్కడికిక్కడే మృతిచెందాడు. సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంప్లెక్స్ సెంటర్లోని హుడా ఓపెన్ ఆడిటోరియం వెనకాల చోటుచేసుకుంది. స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గన్నవరం, ఏప్రిల్ 1: ఆగి ఉన్న లారీ వెనుకభాగాన్ని కారు ఢీకొని ఇరువురు యువకులు దుర్మరణం పొందిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్కు చెందిన ముగ్గురు యువకులు తమ స్నేహితుని గృహప్రవేశానికి రాజమండ్రి వెళ్తుండగా మార్గమధ్యంలో గన్నవరంలో ఈ ఘటన జరిగింది. గన్నవరంలో అయిదో నెంబరు జాతీయ రహదారిపై ఆగిఉన్న ఇసుక లోడు లారీని వెనుకభాగంలో ఢీకొన్నారు.
పెదకాకాని, ఏప్రిల్ 1: గుంటూరు జిల్లా పెదకాకాని మండల పరిధిలోని ఆటోనగర్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విదేశీయుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఇరాక్ దేశానికి చెందిన అబ్దుల్లా (42) ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసేందుకు ఇక్కడకు వచ్చాడు. ఆదివారం తన స్నేహితులను కలిసేందుకు ద్విచక్ర వాహనంపై గుంటూరు వెళుతుండగా వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు అతన్ని ఢీకొంది.
పాట్నా, ఏప్రిల్ 1: కేంద్రమంత్రి అశ్వినికుమార్ కుమారుడు అరిజిత్ శశ్వత్ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఇటీవల భాగల్పూర్లో జరిగిన మతకల్లోలాల్లో ఇతడి ప్రమేయం ఉన్నదని ప్రధాన ఆరోపణ. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుజగా 14 రోజుల పాటా జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. మార్చి 24న శశ్వత్పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. దీనిపై ఆయన కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కోసం పిటిషన్ దాఖలు చేశారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: 27 సంవత్సరాల క్రితం ఒక సైనికుడికి మరణశిక్ష విధిస్తూ కోర్టుమార్షల్ చెప్పిన తీర్పుపై ఇంతవరకూ ఎటూ తేలలేదని, దీనిపై తుది నిర్ణయం వెలువరించాలని కోరుతూ అతని భార్య దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించింది.
తిరుపతి, ఏప్రిల్ 1: తమ పిల్లలను డాక్టర్లను చేయాలని, అందుకు అవసరమైన ప్రవేశ పరీక్షలను రాయించడానికి తిరుపతికి వచ్చి తిరిగివెడుతూ చంద్రగిరి పనబాకం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థుల తండ్రులిద్దరు కానరానిలోకానికి వెళ్లారు. దీంతో వారి కుటుంబంలోనూ, వారి స్వస్థలం వి.కోటలోనూ విషాదఛాయలు అలముకున్నాయి.