S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/20/2019 - 04:38

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రతి మంగళవారం నాడు అందుబాటులోకి వచ్చింది. కార్మికులను విధుల్లోకి తీసుకునే విచక్షణను ప్రభుత్వానికీ , ఆర్టీసీకి వదిలిపెడుతున్నామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆర్టీసీ, ప్రభుత్వం ఆదర్శ ఉద్యోగ సంస్థగా వ్యవహరిస్తాయని తాము ఆశిస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.

11/19/2019 - 23:46

న్యూఢిల్లీ, నవంబర్ 19: జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట వేయించాలని, ఈ దిశగా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. బీజేపీ నాయకుడు, సీనియర్ లాయర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఇంతకు ముందు ఒక ప్రజా ప్రయోజనాల వాజ్యం (పిల్)పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

11/19/2019 - 23:42

పాట్నా, నవంబర్ 19: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కోర్టు చిక్కులు తప్పడం లేదు. దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులోశిక్ష అనుభవిస్తున్న లాలూకు ఓ పరువునష్టం కేసులో పాట్నా ప్రత్యేక కోర్టు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. బిహార్ రాష్ట్ర విపత్తుల నివారణ అథారిటీ సభ్యుడు ఉదయ్ కాంత్ మిశ్రా ఆర్జేడీ చీఫ్‌పై పరువునష్టం దావా వేశారు.

11/19/2019 - 05:41

పీలేరు, నవంబర్ 18: చిత్తూరు జిల్లా పీలేరు వద్ద రైల్వే ట్రాక్ వద్ద ఇద్దరు యువకులు విగత జీవులుగా పడి ఉన్నారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి మార్గంలో సోమవారం ఉదయం ఇద్దరు యువకులు గుర్తుతెలియని రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తన్నారు. కదిరి రైల్వే పోలీసులు మహబూబ్‌భాష, సాల్మాన్‌రాజ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

11/19/2019 - 05:34

తాడ్వాయి, నవంబర్ 18: మేడారం జంపన్నవాగులో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు సోమవారం మధ్యాహ్నం లభ్యమయ్యాయి. స్థానిక ఎస్సై రవిందర్, మేడారం గ్రామస్థుల ఆధ్వర్యంలో సుమారు 12 గంటల పాటు గాలింపులు చేపట్టి ఎట్టకేలకు ఇద్దరి మృతదేహాలను కనుగొన్నారు.

11/19/2019 - 05:28

వెంకటాపురం (రామప్ప), నవంబర్ 18: గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 110 కేజీల గంజాయి, ఒక పిస్తోల్, రెండు నకిలీ బంగారు కడ్డీలు, నాలుగు నకిలీ వజ్రాలు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక కారుతో పాటు రూ.లక్ష 10వేల నగదును సీజ్ చేసినట్లు ములుగు ఏఎస్పీ తెలిపారు. సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య వివరాలు వెల్లడించారు.

11/19/2019 - 01:47

విజయవాడ (క్రైం), నవంబర్ 18: బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై నేరం రుజువు కావడంతో ఏడాది జైలుశిక్ష, వంద రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో స్పెషల్ కోర్టు తీర్పుచెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్‌కు చెందిన జామిని కిరణ్‌రెడ్డి(20) అనే వ్యక్తి చిట్టినగర్ ప్రైజర్‌పేటకు చెందిన తొమ్మిదో తరగతి బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.

11/19/2019 - 01:26

జీడిమెట్ల: జీడిమెట్ల పారిశ్రామికవాడలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తుప్పు పట్టిన మిషనరీ, నాణ్యత లోపం, ఏర్ పొల్యూషన్, రెండుసార్లు సీజ్ చేసినా తిరిగి పునఃప్రారంభం వెరసి ఇద్దరు కార్మికుల ప్రాణాలను జీవిక పరిశ్రమ పొట్టన పొట్టుకుంది. వివరాల్లోకి వెళితే..

11/19/2019 - 01:10

హైదరాబాద్, నవంబర్ 18: ఆర్టీసీ డిమాండ్ల చార్టర్ న్యాయమైనవా? కాదా? అనేది రెండు వారాల్లో తేల్చాలని కార్మిక శాఖ కమిషనర్‌ను రాష్ట్ర హైకోర్టు సోమవారం నాడు ఆదేశించింది. హైకోర్టుకూ కొన్ని పరిమితులు ఉంటాయని, ఈ విషయంలో తమ పరిధి దాటి ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. విషయాన్ని కార్మిక శాఖ చూసుకుంటుందని పేర్కొంది.

11/19/2019 - 06:28

గోపాల్‌గంజ్ (బిహార్): మార్బుల్ ట్రక్కు అదుపు తప్పి రోడ్డుపక్కన నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు చిన్నారులు దుర్మరణం చెందిన ఘటన బిహార్‌లో సోమవారం చోటు చేసుకొంది. సీనియర్ పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌లోని గోపాల్ గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

Pages