-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
చెన్నై, మార్చి 14: కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్కు టెలిఫోన్ ఎక్స్ఛేంజీ కేసునుంచి విముక్తి లభించింది. సోదరులిద్దరిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని నిర్ధారణకు వచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు వారిని విడుదల చేసింది. తమను టెలిఫోన్ ఎక్స్చేంజీ కేసు నుంచి తప్పించాలంటూ మారన్ సోదరులు కోర్టును అభ్యర్థించారు.
న్యూఢిల్లీ, మార్చి 14: తాను లాహోర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కుమారుడు అభయ్ చౌతాలా చేసుకున్న అభ్యర్థనపై ఢిల్లీ కోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. పాకిస్తాన్లోని లాహోర్లో ఓ పెళ్లికి హాజరుకావల్సి ఉందని, దానికి కోర్టు అనుమతి మంజూరు చేయాలని అభయ్ అభ్యర్థించారు.
న్యూఢిల్లీ: వివాదాస్పద అయోధ్యలోని రామమందిరం-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసులో తమను కక్షిదారులుగా చేర్చుకోవాలంటూ దాఖలైన 32 మధ్యంతర పిటిషన్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని ప్రత్యేక ధర్మాసనం తోసిపుచ్చింది. తొలి నుంచి ఈ కేసులో ఉన్న కక్షిదారులు మాత్రమే వాదనలు వినిపించాలని బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఖమ్మం(క్రైం), మార్చి 14: ఖమ్మం మునే్నరులో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో ఇరువురు విద్యార్థులు మునే్నరు వద్దకు వెళ్ళారు. స్నేహితులైన ఇరువురు విద్యార్థులు ఒకేసారి మరణించడం హృదయ విదారకంగా ఉంది. ఖమ్మంలోని ప్రైవేటు కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మొదటి నుంచి కలిసి ఉండేవాళ్ళని, మృత్యువు కూడా వాళ్ళని విడతీయలేకపోయిందని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
మోత్కూర్, మార్చి 14: ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు కింద పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జవ్వారి జనార్థన్, భాగ్యమ్మల పెద్ద కుమారుడు విజయ్సాయి (10) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నట్లు తెలిపారు.
తెలకపల్లి, మార్చి 14: మండల పరిధిలోని దాస్పల్లికి చెందిన బల్మూరి రామస్వామిగౌడ్(60) ఆయన భార్య నర్సమ్మ(55) అనే భార్య భర్తలు ఇద్దరు బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా తెలకపల్లి, రాంరెడ్డిపల్లి గ్రామాల మధ్యగల దాస్పల్లి బస్స్టేజీ ద్గర తెలకపల్లి నుండి భార్య భర్తలు ఇద్దరు టీవీఎస్ లూనాపై వెళ్తున్నారు.
కాళ్ల, మార్చి 14: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన యువకుడిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామానికి చెందిన కొల్లి వెంకట సత్యనారాయణతోపాటు అతని సోదరుడు నరసింహారావు, తండ్రి మారేశ్వరరావు విలేఖర్ల వద్ద తమ గోడు వెళ్లగక్కారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన తాము గుట్టుచప్పుడు కాకుండా జీవితాన్ని వెళ్లబుచ్చుకుంటున్నామన్నారు.
కుప్పం, మార్చి 13: గుడుపల్లె మండలం తంజమ్మ కొటాలు గ్రామం వద్ద జరిగిన మురుగేష్ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వలయాధికారి రాఘవన్ వెల్లడించారు. మంగళవారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ తంజమ్మ కొటాలు గ్రామంలో నివాసం ఉంటున్న హనుమంతు, అతని బావమరిది మురుగేష్ కుటుంబాల మధ్య 30 ఏళ్లుగా ఆస్థి గొడవలు జరుగుతున్నాయి. కుప్పం, గుడుపల్లి మండలాల పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి.
ఉప్పల్, మార్చి 13: అనుమానాస్పదస్థితిలో తండ్రి కొడుకు మురుగునీటి శుద్ధి ప్లాంటులో పడి మరణించారు. ప్రమాదవశాత్తు నీటిలో జారి పడి మరణించారా లేక దూకి ఆత్మహత్య చేసుకున్నారా.. అనే అనుమానం వ్యక్తమవుతోంది. విషాదకరమైన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
చల్లపల్లి, మార్చి 13: ఇంటర్మీడియేట్ చదువుతున్న మైనర్ బాలికను గత కొంత కాలంగా వెంబడిస్తూ ప్రేమించమని వేధిస్తూ భయాందోళనకు గురి చేస్తున్న నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ అవనిగడ్డ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ దాడి చంద్రశేఖర్ తెలిపారు.