S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/18/2019 - 06:14

డిచ్‌పల్లి రూరల్, నవంబర్ 17: కన్నతల్లే తన కుమారుడి పట్ల కర్కశంగా ప్రవర్తించింది. నిర్దాక్షిణ్యంగా ఉరేసి ప్రాణం తీసింది. ఆడుతూ, పాడుతూ ఎంతో ఉల్లాసంగా గడపాల్సిన ఓ చిన్నారి అనుమానాస్పద స్థితిలో శవంగా మారాడు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామంలో జనె్నపల్లి రాజేష్ (8) అనే బాలుడు ఆదివారం అనుమానాస్పదంగా మృతి చెందడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

11/18/2019 - 06:11

కేతేపల్లి, నవంబర్ 17: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. మండలపరిధిలోని ఇనుపాముల గ్రామశివారు వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

11/18/2019 - 06:07

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ పోలీస్‌స్టేషన్ ఎదుట తండ్రీ, ముగ్గురు కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ సంఘటన జిల్లాలో కలకలం రేపింది.

11/18/2019 - 05:30

కంకిపాడు, నవంబర్ 17: గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చోరీ చేసిన సంఘటన ఉప్పులూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం ఈనెల 14న కుటుంబ సభ్యులతో దైవ దర్శనానికి షిర్డీ వెళ్లి తిరిగి ఆదివారం ఉదయం వచ్చారు. ఇంటికెళ్లేసరికి తాళం పగలకొట్టి ఉంది.

11/18/2019 - 05:15

నిజామాబాద్/ఇందూర్, నవంబర్ 17: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠానాకలాన్ సబ్‌స్టేషన్ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులంతా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందినవారు. గ్రామ సర్పంచ్ కుమార్తె కేశఖండనం వేడుకలో పాల్గొని ఆటోరిక్షాలో వారంతా తిరిగి వస్తుండగా, ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

11/17/2019 - 05:54

ఏలూరు, నవంబర్ 16: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శనివారం ఏలూరు జిల్లా జైలు నుండి విడుదలయ్యారు. పలు కేసులోల నిందితుడిగా ఉన్న చంతమనేని గత 66 రోజులుగా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొన్ని కేసులకు సంబంధించి శుక్రవారం న్యాయస్థానం చింతమనేనికి బెయిలు మంజూరు చేసింది. దీంతో శనివారం ఉదయం అన్ని లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం చింతమనేని జైలు నుండి బయటకు వచ్చారు.

11/17/2019 - 05:32

గుంటూరు, నవంబర్ 16: గుంటూరు జిల్లాలో అపరాలు అక్రమంగా నిల్వచేయడం ద్వారా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న అక్రమార్కులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝుళిపించారు. శనివారం గుంటూరు జిల్లావ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించి కందులు, సజ్జలు, రాగులు అక్రమంగా నిల్వచేసిన గోడౌన్‌లు, షాపుల్లో తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై కేసు నమోదు చేసి, షాపులను సీజ్ చేశారు.

11/17/2019 - 04:37

అలహాబాద్: లైంగిక వేధింపుల కేసులో బీజేపీ నేత స్వామి చిన్మయానంద దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారించిన అలహాబాద్ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. న్యాయ విద్యార్థిని చిన్మయానందపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. శనివారం చిన్మయానంద బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయమూర్తి రాహుల్ చతుర్వేది తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. కేంద్ర మాజీ మంత్రి చిన్మయానందను సెప్టెంబర్ 21న అరెస్టు చేశారు.

11/17/2019 - 04:33

మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 16: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఓ పురోహితుడి మిస్సింగ్ మిస్టరీగా మారింది. స్థానిక ఖొజ్జిల్లిపేటకు చెందిన పోపూరి రాజబాబు అర్చకత్వం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5వతేదీన ఇంటి నుండి బయటకు వెళ్లిన రాజబాబు తిరిగి రాలేదు. దీంతో 6వతేదీన రాజబాబు భార్య కామేశ్వరి ఆర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

11/17/2019 - 04:21

పరిగి, నవంబర్ 16: బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరిగి సిఐ మొగులయ్య తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పూడూరు మండలం సోమన్‌గుర్తి గ్రామానికి చెందిన బాలిక పరిగిలోని కళాశాలలో చదువుతుంది.

Pages