S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/14/2019 - 06:19

పెరవలి : పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లివద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. రోడ్డు దాటుతున్న మోపెడ్‌ను తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపుతప్పి, డివైడర్‌పైకి ఎక్కి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మోపెడ్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు తీవ్రంగా, 29మంది స్వల్పంగా గాయపడ్డారు.

11/14/2019 - 05:23

పాణ్యం, నవంబర్ 13: యూకేజీ విద్యార్థి ఒకరు ప్రమాదవశాత్తు వేడివేడి సాంబారు పాత్రలో పడి మృతి చెందాడు. కర్నూలు జిల్లా పాణ్యంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లెకు చెందిన శ్యాంసుందర్‌రెడ్డి కుమారుడు పురుషోత్తంరెడ్డి(7) పాణ్యంలోని విజయ నికేతన్ ప్రైవేటు రెసిడెన్సియల్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు.

11/14/2019 - 05:20

మండవల్లి, నవంబర్ 13: మూడేళ్ల మనువరాలిపై స్వయాన తాతే అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఈ ఘటన కృష్ణాజిల్లా మండల కేంద్రమైన మండవల్లి సమీప గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. గ్రామానికి చెందిన ఒక చేపల చెరువుకు కాపలాగా ఉన్న దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు.

11/14/2019 - 05:52

శంషాబాద్, నవంబర్ 13: ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్ మరోసారి రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం మంగళవారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెద్ద గోల్కొండ వద్దనున్న ఔటర్ రింగురోడ్డుపై ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు కథన ప్రకారం..

11/14/2019 - 01:10

న్యూఢిల్లీ, నవంబర్ 13: భారత సర్వోన్నత న్యాయస్థానం బుధవారం మరో కీలక తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధిలోకి వస్తుందని న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

11/13/2019 - 23:42

ఇండోర్, నవంబర్ 13: అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పు పడుతూ ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిని పీతంపూర్‌లోని ఒక టైర్ల కంపెనీలో పనిచేసే జితేంద్ర చౌహాన్‌గా గుర్తించారు. 35 ఏళ్ల చౌహాన్ తన ఎఫ్‌పీ ఖాతా నుంచి అయోధ్య కేసుపై వివాదాస్పద పోస్టులు చేశాడు. న్యాయానికి విరుద్ధంగా తీర్పు ఉందని ఆయన తన పోస్టులో విమర్శించాడు.

11/13/2019 - 23:41

న్యూఢిల్లీ, నవంబర్ 13: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం(సీజేఐ) సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) పరిధిలోకి వస్తుందని రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చింది. ఈ కేసు 2007 పది నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టులో సాగింది. మొత్తానికి బుధవారం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ తీర్పును వెలువరించింది. కేసు విచారణ సాగిందిలా...

11/13/2019 - 23:33

న్యూఢిల్లీ, నవంబర్ 13: కర్నాటకలో 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అయితే వారు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమం చేసింది. కాంగ్రెస్-జేడీ(ఎస్)కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 2023 సంవత్సరం వరకు అనర్హత ఎమ్మెల్యేలు పోటీ చేయరాదని స్పీకర్ ఆదేశించారు.

11/13/2019 - 22:26

న్యూఢిల్లీ: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తీసుకున్న చర్యలు తెలియజేయాలని ప్రభుత్వ కార్యదర్శికి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శికి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికి నిర్ణక్ష్యం చేస్తూ భర్తీచేయడం లేదని వెంకటేశ్ అనే వ్యక్తి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

11/13/2019 - 22:40

న్యూఢిల్లీ, నవంబర్ 13: శబరిమల దేవాలయంలోకి అన్ని వయస్సులు గల మహిళలను అనుమతించడంపై దాఖలైన 65 పిటీషన్లపై సుప్రీం కోర్టు గురువారం (14న) తీర్పు ఇవ్వనున్నది. మొత్తం 65 పిటీషన్లలో 56 రివ్యూ పిటీషన్లు, మరో నాలుగు తాజా రిట్ పిటీషన్లు, ఐదు బదిలీ విన్నపాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శబరిమల ఈ 65 పిటీషన్లపై విచారణ ముగించింది.

Pages