S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/13/2019 - 06:07

కోహెడ, నవంబర్ 12: సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం వరికోలులోని మోయతుమ్మెద వాగులో కార్తీక పౌర్ణమి స్నానాలకు వెళ్లిన ముగ్గురు యువ కులు మృతి చెందారు. వరికోలుకు చెందిన కంటె నిఖిల్ (18), కూన ప్రశాంత్ (20), పెందోట వరప్రసాద్ (20), మరో నలుగురు మిత్రులతో కలిసి సమీపంలోని మోయతుమ్మెద వాగులో కార్తీక స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే వాగులో ఇసుక కోసం తవ్విన గుంతలు ఉండటంతో వాటిలో పడి దుర్మరణం పాలయ్యారు.

11/13/2019 - 05:48

నరసాపురం, నవంబర్ 12: ఏ ఆడపిల్లకైనా తండ్రి అంటే ఒక హీరో.. ఒక రక్షణ.. ఒక నమ్మకం. అయితే ఇద్దరు చిన్నారుల పాలిట మాత్రం కన్న తండ్రే కసాయిగా మారాడు. ఉపాధి కోసం గల్ఫ్ దేశంలో ఉన్న భార్య డబ్బు పంపడం లేదనే అక్కసుతో ఇద్దరు కుమార్తెలతో రాక్షసంగా ప్రవర్తించాడు. కన్న బిడ్డలనే మమకారం కాదు కనీసం చిన్న పిల్లలనే కారుణ్యం కూడా లేకుండా చిత్రహింసలు పెడుతూ నరకం చూపించాడు.

11/13/2019 - 05:29

హైదరాబాద్, నవంబర్ 12: కాచిగూడ స్టేషన్‌లో రైళ్లు ఢీకొన్న ఘటనపై దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళవారం ఘటనాస్థలిని పరిశీలించిన అధికారులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని అధికారులు ధ్రువీకరించారు. ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

11/13/2019 - 05:20

హైదరాబాద్(వనస్థలిపురం), నవంబర్ 12: మాజీ మావోయిస్టూ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆయన భార్యను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, తిరుమలాపురం గ్రామానికి చెందిన నార్ల రవి శర్మ (54) ఆయన భార్య అనురాధ (56) మావోయిస్టు పార్టీలో కీలక స్థానాల్లో పనిచేశారు. రెండేళ్ల క్రితం అరెస్ట్ అయి, జైలుకు వెళ్ళారు.

11/13/2019 - 05:10

జమ్మూ, నవంబర్ 12: జమ్మూ-కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ప్రమాదవశాత్తున ఓ ప్యాసింజర్ వాహనం లోయలో పడడంతో 16 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నట్లు దోడా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ముంతాజ్ అహ్మద్ తెలిపారు. మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడిన తీవ్రంగా గాయపడ్డాడని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.

11/13/2019 - 05:09

న్యూఢిల్లీ, నవంబర్ 12: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మధ్యాహ్నం రెండు గంటలకు తీర్పు ఇస్తుంది.

11/13/2019 - 04:39

న్యూఢిల్లీ, నవంబర్ 12: కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశి థరూర్ తనపై నమోదయిన ఒక క్రిమినల్ పరువునష్టం కేసులో కోర్టుకు హాజరు కానందుకు ఢిల్లీ కోర్టు ఆయనకు వ్యతిరేకంగా బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘శివలింగంపై తేలు’ అని వ్యాఖ్యానించినందుకు థరూర్‌పై క్రిమినల్ పరువునష్టం కేసు నమోదయింది.

11/13/2019 - 02:05

న్యూఢిల్లీ, నవంబర్ 12: అయోధ్యపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తూ సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా)లో వదంతులు సృష్టిస్తున్న 70 మందిని అరెస్టు చేశామని ఉత్తర్ ప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజిపీ) ఓపీ సింగ్ తెలిపారు. ఇంకా తప్పుడు కథనాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న 270 సోషల్ మీడియా అకౌంట్లపైనా చర్యలు తీసుకున్నట్లు ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు.

11/13/2019 - 01:47

మేడ్చల్, నవంబర్ 12: భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ లైవ్‌గా ఉరివేసుకుని భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

11/13/2019 - 01:24

హైదరాబాద్, నవంబర్ 12: ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి అవసరమైతే సుప్రీంకోర్టుకు చెందిన ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో ఒక కమిటీని వేస్తామని హైకోర్టు మంగళవారం నాడు వ్యాఖ్యానించింది. సమ్మెకు పరిష్కారం కనుగొనాలని అటు కార్మిక సంఘాలకు, ఇటు ప్రభుత్వానికి సూచించినా ఫలితం లేకపోయిందని, హైకోర్టు సైతం చట్టపరిధిలోనే పనిచేస్తుందని, పరిధిని దాటి ఎలాంటి ఆదేశాలూ తాము ఇవ్వలేమని పేర్కొంది.

Pages