S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/08/2019 - 22:44

హైదరాబాద్, నవంబర్ 8: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 31 మంది డీఎస్పీలను వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో ఏసీపీలుగా పనిచేస్తున్న 29 మంది ఆయా జిల్లాలకు డీఎస్పీలుగా బదిలీ చేయగా, వరంగల్, సిరిసిల్లకు చెందిన డీఎస్పీలను సైబరాబాద్, హైదరాబాద్‌కు బదిలీ చేశారు.

11/08/2019 - 22:43

హైదరాబాద్, నవంబర్ 8: భారత చట్టాలు చాలా వరకూ వేర్వేరు దేశాల నుండి కాపీ చేసినవేనని, దీనివల్ల ఆ చట్టాలను మన దేశంలో అమలుచేసినపుడు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సర్వీసెస్ 12వ ఫౌండేషన్ డే ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.

11/08/2019 - 04:58

మదనాపురం, నవంబర్ 7: వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతున్న శ్రీకాంత్ అనే విద్యార్థి గురువారం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ సైదయ్య కథనం ప్రకారం చిన్నంబావి మండలం చిన్నదగడ గ్రామానికి చెందిన ఆగురయ్య, సువర్ణ దంపతుల కుమారుడు శ్రీకాంత్ (17) గురుకుల పాఠశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.

11/08/2019 - 04:23

హైదరాబాద్, నవంబర్ 7: అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ మృతి చెందాడు. సురేష్ మరణించినట్టు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. చికిత్స పొందుతూ సురేష్ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు చనిపోయాడని డాక్టర్లు పేర్కొన్నారు. ఈనెల 4న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని ఆమె కార్యాలయంలో సురేశ్ పెట్రోల్ పోసి సజీవదహనం చేయడం..

11/08/2019 - 02:28

విజయవాడ (క్రైం), నవంబర్ 7: రాష్ట్రంలో నెలకొన్న ఉల్లి సంక్షోభంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఉల్లి అక్రమ నిల్వలపై విజిలెన్స్ శాఖ కొరడా ఝలిపిస్తోంది. రాష్టవ్య్రాప్తంగా ఉల్లి వ్యాపారులపై దాడులకు శ్రీకారం చుట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ జనరల్ కేవీ రాజేంద్రనాధ్‌రెడ్డి ఆదేశాలతో రాష్టవ్య్రాప్తంగా 70మంది వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు విస్తత్ర దాడులు నిర్వహించారు.

11/08/2019 - 02:25

రేణిగుంట, నవంబర్ 7: చిత్తూరు జిల్లా రేణిగుంట మండల పరిధిలోని ఆనాసం పల్లి గ్రామంలో భార్యభర్తలు ఆత్మహత్య యత్నానికి పాల్పడగా భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా మారిన సంఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు అనాసం పల్లి గ్రామంలో వాటర్ ట్యాంక్ తోలుతూ జీవిస్తున్న మోహన్ రెడ్డి (48), భార్య వరలక్ష్మి (43) కూతురు జోత్స్న, కుమారుడు రాజేష్‌లతో జీవనం సాగిస్తున్నారు.

11/08/2019 - 02:32

నంద్యాల టౌన్: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని ఓ బంగారం దుకాణంలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు రూ. కోటి విలువైన బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. మెయిన్‌బజార్‌లోని శ్రీనిమిషాంబ బంగారు ఆభరణాల దుకాణం పైభాగంలోని తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు బీరువా తెరచి అందులోని బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.

11/08/2019 - 01:49

హైదరాబాద్, నవంబర్ 7: మామూళ్ల మత్తులో జోగుతున్న హైదరాబాద్ పోలీసులపై పోలీస్ బాస్ సీరియస్ అయ్యారు. హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించి కస్టమర్లను బెదిరించి డబ్బు వసూలు చేసిన విషయం సీపీ దృష్టికి రావడంతో విచారణ చేయించారు. విచారణ చేపట్టిన తరువాత నలుగురు ఎస్‌ఐలు, ఇద్దరు ఏఎస్‌ఐలను సీపీ విధుల నుంచి తొలగించారు.

11/08/2019 - 01:47

కీసర, నవంబర్ 7: మేడ్చల్ జిల్లా పంచాయతీ అధికారి రవి కుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బేరీ ఈశ్వర్ ఆడిట్ క్ష్లియర్ చేయటానికి జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. ఐదు లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏసీబీని ఈశ్వర్ ఆశ్రయించారు.

11/08/2019 - 01:40

మెహిదీపట్నం, నవంబర్ 7: ఏటీఎం సెంటర్‌లో డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను ఆసీఫ్‌నగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పశ్చిమ మండల డీసీపీ కార్యాలయంలో వివరాలను డిప్యూటీ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఆసీఫ్‌నగర్ హైమద్‌నగర్ ప్రాంతానికి చెందిన హైమద్ కుమారుడు ఖలిద్ కమల్ హైమద్ (29) వ్యాపారం.

Pages