-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 6వ తేదీలోగా సమ్మెపై వాస్తవ నివేదికను సమర్పించాలని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్శర్మను హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం తదుపరి హైకోర్టుకు సమర్పించనున్న నివేదికపై సమగ్రమైన సమాచారాన్ని అందివ్వడానికి కసరత్తు చేపట్టింది. ఈనెల 7వ తేదీన సమ్మెపై హైకోర్టు విచారణ చేపట్టనున్నది.
మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 3: కార్తీక మాసం పవిత్ర సముద్ర స్నానాల ప్రారంభంలోనే మంగినపూడి బీచ్ వద్ద అపశృతి చోటు చేసుకుంది. తొలి ఆదివారం జిల్లా నలుమూలల నుండి వేలాది మంది భక్తులు, సందర్శకులు మంగినపూడి బీచ్కు వచ్చారు. అంతా సందడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆదివారం బీచ్ పార్కింగ్ ప్రాంత సమీపంలో ఆటో, కారు ఢీకొన్న ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి అక్కడిక్కడే దుర్మరణం చెందడం అందరినీ కలచి వేసింది.
విజయవాడ పశ్చిమ, నవంబర్ 3: భవానీపురం హౌసింగ్బోర్డు కాలనీలోని సాయి త్రిశక్తి నిలయం పురోహితునిపై దాడికి పాల్పడిన కేసులో నలుగురు మహిళలను భవానీపురం పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్ చేసిన వారిని పోలీసు స్టేషన్కు తీసుకురావడానికి యత్నించిన మహిళా ఏఎస్ఐ శివకుమారి, మహిళా కానిస్టేబుల్ రత్నకుమారిపై నిందితులు తిరగబడ్డారు.
న్యూఢిల్లీ, నవంబర్ 3: ఢిల్లీలోని తీస్ హజారి కోర్టు వద్ద న్యాయవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణపై ఢిల్లీ హైకోర్టు ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసు కమిషనర్కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనపై తమ వైఖరిని తెలియజేయాల్సిందిగా హైకోర్టు నోటీసుల్లో ఆదేశించింది.
తాడ్వాయి, నవంబర్ 3: కన్నతల్లిని సాక్షాత్తూ కన్నకొడుకే హతమార్చిన సంఘటన కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో సంచలనం రేపింది. ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్రెడ్డి కథనం ప్రకారం ఈసంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిట్యాల గ్రామానికి చెందిన గణపురం సాయవ్వ (47)ను ఆమె కన్న కొడుకు మల్లేశం కర్రతో తలపగులకొట్టి హత్య చేశాడు. తల్లీ కొడుకుల మధ్య గత కొంతకాలంగా ఆస్తుల గొడవ జరుగుతోంది.
జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 3: విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు రవాణా చెక్పోస్ట్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. చిల్లకల్లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సైదాబాద్, నవంబర్ 3: నగర రహదారులపై గుంతలు పూడ్చడంలో అధికారుల నిర్లక్ష్యం ఓ యువతిని బలికొంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువతి రహదారిపై ఉన్న గుంతలో పడి అదుపుతప్పి కింద పడటంతో వెనుకగా వచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొట్టి దుర్మరణం చెందింది. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 2: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరం బెయిల్ పిటిషన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం వ్యతిరేకించింది. చిదంబరం పాల్పడినట్టు అభియోగాలు గల నేరాల తీవ్రత దృష్ట్యా అతనికి ఊరట పొందే హక్కు లేదని ఈడీ ఢిల్లీ హైకోర్టులో వాదించింది.
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో నకిలీనోట్ల ఎరవేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను ఖమ్మం పోలీస్కమిషనర్ తఫ్సీర్ ఇక్భాల్ వెల్లడించారు. సత్తుపల్లి మండలం గౌరిగూడెం గ్రామానికి చెందిన షేక్ మదార్(56) పాలు, కోళ్ళవ్యాపారం చేస్తున్నట్టుగా ప్రజలను మభ్యపెట్టేవాడు.
తిరుపతి: తిరుమలలో భక్తులను మోసం చేస్తూ ధనార్జన చేస్తున్న దళారుల ఆటకట్టించేందుకు టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి చేపడుతున్న చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో శ్రీవారి దర్శన టిక్కెట్లను అక్రమంగా భక్తులకు విక్రయిస్తున్న దళారులను అరెస్ట్చేసిన విషయం పాఠకులకు విదితమే.