-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
భీమునిపట్నం, అక్టోబర్ 31: భీమిలిలోని సాగరతీరం నదీ సంగమ ప్రదేశం వద్ద గురువారం విశాఖ ఆరిలోవ ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. విశాఖ ఆరిలోవ ప్రాంతానికి చెందిన దువ్వి శ్రీను, ఎల్.నవీన్, మరో ముగ్గురు విశాఖ బాసర కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. నాగులచవితి సందర్భంగా గురువారం సెలవు కావడంతో సరదాగా గడిపేందుకు భీమిని సాగరతీరానికి వచ్చారు.
హైదరాబాద్, అక్టోబర్ 31: ఈజీమనీ కోసం భార్యభర్తలు చేసిన మోసాలు ఈ విధంగా ఉన్నాయి. హనీట్రాప్తో బాధితుడి నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టిన ఓ ఎయిర్హోస్టెస్ను, ఆమె భర్తను పోలీసులు గురువారం అరెస్టుచేశారు. బాధితుడిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడంతోపాటు తుపాకీతో బెదిరించినందుకు వారిపై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళితే కనిష్క అనే మహిళ గతంలో ఎయిర్హోస్టెస్గా పనిచేసింది.
గుంటూరు: గుంటూరు నగరంలోని ఓ అపార్ట్మెంట్లో నిర్వహిస్తున్న హోల్సేల్ మందుల దుకాణంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన పేలుడులో ఇద్దరు మృతి చెందారు. పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. పేలుడుకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మందుల దుకాణంలో భారీస్థాయిలో పేలుడు జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే...
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) విద్యుత్ సబ్-స్టేషన్లలో నియమించుకునే షిప్టు ఆపరేటర్ల నియామక విషయంలో కాంట్రాక్టర్లకు హైకోర్టు నుండి ఊరట లభించింది. ఇప్పటికే నియమించుకున్న షిప్టు ఆపరేటర్లను కొనసాగించడానికి కోర్టు అనుమతిచ్చింది. రాష్టవ్య్రాప్తంగా వివిధ సబ్-స్టేషన్ల నిర్వహణలో పాల్గొనే కాంట్రాక్టర్లు షిప్టు ఆపరేటర్లుగా ప్రైవేటు వ్యక్తులను నియమించుకుంటారు.
విజయవాడ (క్రైం), అక్టోబర్ 31: దుర్గగుడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ)గా నియామకానికి సురేష్బాబు అర్హత చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ను స్వీకరించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం దీనిపై నవంబర్ 6వ తేదీలోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
డోన్, అక్టోబర్ 31: ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి నుం చి రూ. 10 వేలు లంచం తీసుకున్న కర్నూలు జిల్లా డోన్ సబ్ రిజిస్ట్రార్ నాగన్నను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు నగరానికి చెందిన ఎం.రామతిమ్మారెడ్డి వెల్దుర్తిలో కొనుగోలుచేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లగా నాగన్న రూ. 17 వేలు లంచం డిమాండ్ చేశాడు.
విజయవాడ (క్రైం), అక్టోబర్ 31: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారంలో నవయుగ సంస్ధకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కొత్త కాంట్రాక్టరుతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకునేందుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం అవకాశం కల్పించింది. పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
చీరాల, అక్టోబర్ 30: కోడి పందేలు ఆడుతున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం రాత్రి దాడిచేయగా భయంతో పారిపోతున్న జూదరులలో ముగ్గురు ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతదేహాలు లభ్యంకాగా మరొకరి కోసం గాలిస్తున్నారు.
విశాఖపట్నం, అక్టోబర్ 30: న్యాయస్థానానే్న తప్పుడు పత్రాలతో మోసం చేశారు. నిందితులకు బెయిల్ ఇప్పించే క్రమంలో ఫోర్జరీ పత్రాలను న్యాయస్థానానికి ఇచ్చి నిందితులను విడిపించుకు పోతున్నారు. ఒక కేసులో లభించిన ఆచూకీతో పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. ఈ నేపథ్యంలో పోలీసులు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నాతవరం, అక్టోబర్ 30: ఆటో, మోటార్ బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒక మహిళతో పాటు యువకుడు దుర్మరణం చెందారు. ఈ సంఘటనకు సంబంధించి విశాఖ జిల్లా నాతవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తుని - నర్సీపట్నం ప్రధాన రహదారిలో బెన్నవరం సమీపంలో బుధవారం ఉదయం ఆటో, మోటార్ బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.