-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్, అక్టోబర్ 18: టీవీ -9 మాజీ సీఈఓ రవిప్రకాష్పై నమోదైన కొత్త కేసుపై అతని తరఫున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి సీరియస్ అయ్యారు. ఒక మనిషిని ఎంతలా హింస పెడతారు అంటూ ప్రశ్నించారు. రవిప్రకాశ్ను ఎంతకాలం జైలులో ఉంచుతారని ప్రశ్నించారు.
హైదరాబాద్, అక్టోబర్ 18: జహీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధి , ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదని, ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించలేదని ఆయన ఎన్నిక రద్దు చేయాలని పిటిషన్లో కోరారు.
బెంగళూరు, అక్టోబర్ 18: బెంగళూరులో స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయని, దీనితో ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి ఉందని కర్నాటక హోం శాఖ మంత్రి బసవరాజ్ బొమ్మయి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు, మైసూరులో ఉన్న ఉగ్రవాద స్లీపర్ సెల్స్ కారణంగా, కర్నాటకతోపాటు, కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని తీర ప్రాంతాల్లో దాడులకు జరగవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
వరంగల్ : మావోయిస్టుల పేరుతో రియల్టర్లను, వ్యాపారులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యులు గల నకిలీ నక్సల్స్ ముఠాను గురువారం వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి మూడు నాటు తుపాకులు, ఒక ఎయిర్ పిస్తోల్, 60వేల నగదు, మూడు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం, ఎనిమిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి వివరించారు.
వరదయ్యపాళెం : చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండల పరిధిలోని కల్కి భగవాన్ ఆశ్రమంలో గురువారం కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు కొనసాగించారు. ఈక్రమంలో ‘ఎం-బ్లాక్’లోని ఓ గదిలో ఉన్న కప్బోర్డులో ఒక సంచి నిండా విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు ఉండటాన్ని గుర్తించారు. వీటి విలువ 20 నుంచి 25 కోట్లు ఉంటుందని ప్రచారం సాగుతోంది.
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరంను ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో అక్టోబర్ 24వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అప్పగిస్తూ ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈడీ గురువారం ఆయనను తీహార్ జైలులోనుంచి తీసుకెళ్లింది.
హైదరాబాద్: టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కస్టడీ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు తాజాగా మరో పిటిషన్ను నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. హైకోర్టులో కొనసాగుతున్న కేసులో రవిప్రకాశ్కు కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్లో వచ్చే నెల రెండో తేదీ వరకూ స్టే ఉందన్న సమాచారం నేపథ్యంలో, నాంపల్లి కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల నాలుగో తేదీకి వాయిదా వేసింది.
సీలేరు: అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్ ప్రమాదశాత్తు లోయలో పడడంతో కంటైనర్లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 14 పశువులు మృత్యువాత పడ్డాయి.
తుని, అక్టోబర్ 17: తూర్పు గోదావరి జిల్లాలో ఒక దినపత్రిక విలేఖరి హత్య కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా పేరు అనుమానితునిగా పోలీసులు నమోదుచేశారు. ఒక దినపత్రికకు తొండంగి మండల అర్బన్ విలేఖరిగా పనిచేస్తున్న కాతా సత్యనారాయణను మంగళవారం రాత్రి దారుణంగా హత్యచేసిన సంగతి విదితమే.
కంకిపాడు, అక్టోబర్ 16: ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఒక యువకుడు మృతి చెందటంతోపాటు, మరో యువకుడు గాయాలపాలైన సంఘటన బుధవారం కంకిపాడు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.