S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రస్తుతం ‘జనతాగ్యారెజ్’ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రచయిత వక్కంతం వంశీతో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పోస్ట్పోన్ అయిన ఈ సినిమా ఎట్టకేలకు సెట్ అయింది. ఇప్పటికే ఆయనతో కథ రెడీ చేసుకోమని చెప్పాడట ఎన్టీఆర్. ప్రస్తుతానికి స్క్రిప్ట్పై కుస్తీలు పడుతున్నాడట వక్కంతం వంశీ.
సుమంత్ అశ్విన్, పూజాజవేరీ, ప్రభాకర్ ముఖ్యపాత్రల్లో మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న ‘రైట్ రైట్’ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ట్రైలర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి, వంశీ పైడిపల్లి, నిర్మాత ఎం.ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.
వేసవి సెలవులు స్కూళ్లు, కాలేజీలకు ఇవ్వడం మనం ఇప్పటివరకూ చూశాం. కానీ ఓ సినిమాకు కూడా వేసవి సెలవులు ఇవ్వడం ఇప్పుడు విశేషంగా మారింది. ‘బాహుబలి’తో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజవౌళి ఇప్పుడు బాహుబలి చిత్రానికి సీక్వెల్గా ‘బాహుబలి-2’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
కిరణ్కుమార్ దర్శకత్వంలో వన్విజన్ స్టూడియో పతాకంపై పర్వతనేని రాంబాబు నిర్మించిన ‘వానర సైన్యం’ లఘు చిత్ర ప్రదర్శన కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో ఆది మాట్లాడుతూ, షార్ట్ఫిలిమ్ బాగుందని, తప్పకుండా యూట్యూబ్లో దీనికి మంచి హిట్స్వస్తాయని అన్నారు.
విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి రాయుడు పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ విడుదలైంది. ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ.. నా కెరీర్లోనే ఓ డిఫరెంట్ సినిమా ఇది. పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న సినిమా. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం వుంది అన్నారు.
ప్రస్తుతం రామ్చరణ్ తమిళంలో హిట్టయిన ‘తనిఒరువన్’ రీమేక్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నాడు చరణ్. ఇక ఈ సినిమా తర్వాత ఆయన నటించే మరో చిత్రానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.
సాయిరోణక్, అతిథి సింగ్, ఐశ్వర్య ప్రధాన తారాగణంగా ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్, టీజర్ విడుదలయ్యాయి.
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాయిస్’ చిత్రంలో కీలక పాత్రలో నటించి ఆ తరువాత కొన్ని చిత్రాలకు కీబోర్డు ప్లేయర్గా పనిచేసి రవితేజ నటించిన ‘కిక్’ సినిమాతో సంగీత దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఎస్.ఎస్.తమన్. చేసినవి తక్కువ సినిమాలే అయినా టాప్ సంగీత దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు. ప్రస్తుతం తమన్ సంగీతం అందిస్తున్న చిత్రం ‘సరైనోడు’.
తెలుగులో హీరోయిన్గా పరిచయమై పలు చిత్రాల్లో నటించిన బెంగాలీ భామ మధురిమకు అందం, అభినయం బాగానే వున్నా సినిమా కమర్షియల్గా మాత్రం ఆమె కెరీర్కు ఉపయోగపడటంలేదు. వంశీ ‘సరదాగా కాసేపు’, ‘షాడో’ వంటి సినిమాలు చేసినా, మరోవైపు ఐటెం సాంగుల్లో అలరించినా కూడా పెద్దగా ఫలితం లేకపోయింది. దాంతో ఇక్కడ లాభం లేదనుకుని కన్నడ, హిందీల్లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
పూరి జగన్నాధ్ తమ్ముడు సాయిరాం శంకర్, శరత్కుమార్, రేష్మి మీనన్ ప్రధాన పాత్రల్లో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో విభా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దేపా శ్రీకాంత్ నిర్మిస్తున్న ‘నేనోరకం’ టీజర్ హైదరాబాద్లో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి టీజర్ విడుదల చేసి మాట్లాడుతూ, టీజర్ చాలా ఆసక్తికరంగా వుందని, శరత్కుమార్ ఇంటెన్సివ్ వున్న నటుడని, టైటిల్ కూడా బాగుందని అన్నారు.