S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘ఉయ్యాల జంపాల, ‘సినిమా చూపిస్త మావా’, ‘కుమారి 21 ఎఫ్’, ఇలా వరుస హిట్స్తో తెలుగులో అతికొద్దిమందికే సాధ్యమైన హ్యాట్రిక్ ఫీట్ను కెరీర్ ప్రారంభంలోనే సొంతం చేసుకున్న హీరో రాజ్తరుణ్. త్వరలోనే ప్రముఖ నిర్మాత దిల్రాజు బ్యానర్లో ‘శతమానం భవతి’ అనే సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
‘మైనా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్గా మారిన హాట్ భామ అమలాపాల్. ఆ తరువాత దర్శకుడు విజయ్ని వివాహం చేసుకుని, కొంత గ్యాప్ తరువాత సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే సూర్య సరసన ‘మేము’ సినిమాలో తల్లి పాత్రలో నటించింది. లేటెస్టుగా ఓ సినిమాలో పదమూడేళ్ల అమ్మాయికి తల్లిగా నటించేందుకు ఓకె చెప్పడంతో ఇపుడు ఈ విషయం హాట్ టాపిక్గా మారింది.
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సర్దార్ గబ్బర్సింగ్. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం సెనే్సషన్ అవుతూనే వుంది. నిన్నటివరకూ ఆడియో డేట్, రిలీజ్ డేట్పై నెలకొన్న సెనే్సషన్ ఇపుడు ఈ సినిమాలో పవన్ పక్కన హీరోయిన్గా నటించిన కాజల్ అగర్వాల్ చుట్టూ చేరింది. ఎందుకంటే ఈ సినిమాలో కాజల్ రాజకుమారి పాత్రలో కనిపించనుంది కనుక.
కె.ఎస్.ఎల్. ఫిలింస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కిరణ్, సుమి, గిడ్డేష్, సమీరా ప్రధాన తారాగణంగా శేఖర్ చంద్ర దర్శకత్వంలో కరే శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం ‘వ్రజాల వేట’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తికావస్తోంది.
స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్పై ఆర్.నారాయణమూర్తి, విక్రమ్, ప్రసాద్రెడ్డి, త్రినాధ్ ప్రధాన పాత్రల్లో నారాయణమూర్తి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘దండకారణ్యం’. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక మంగళవారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. సుద్దాల అశోక్ తేజ ప్లాటినమ్ డిస్క్లను చిత్ర బృందానికి అందజేశారు.
రామ్ కార్తీక్, కశ్మీరా కులకర్ణి జంటగా పుష్యమి ఫిలిం మేకింగ్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దృశ్యకావ్యం’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, లవ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందించామని, నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్గా నిలుస్తుందని తెలిపారు.
త్రిష ప్రధాన పాత్రలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై గోవి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నాయకి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది.
12 ఫ్లాపుల తరువాత ‘ఇష్క్’ సినిమాతో నితిన్కు విక్రమ్కుమార్ బ్రేకిచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ఊపును కంటిన్యూ చేసిన సినిమా ‘గుండె జారి గల్లంతయ్యిందే’. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమా నితిన్కు హీరోగా మంచి మైలేజ్నిచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు విజయ్కుమార్ కొండా వెలుగులోకొచ్చాడు.
టాలీవుడ్ హీరో రానాకు ఇప్పుడు అవకాశాలు జోరుగా వస్తున్నాయి. ‘బాహుబలి’ చిత్రం తరువాత రానా రేంజ్ బాగా పెరిగింది. ఇప్పటికే అన్ని భాషల్లో పలు అవకాశాలు వస్తున్నాయని టాలీవుడ్ సమాచారం. తాజాగా తమిళంలో రానాకు ఓ క్రేజీ అవకాశం దక్కింది. ధనుష్ కథానాయకుడిగా నటించే ఓ చిత్రంలో ఆయన విలన్గా నటించడానికి ఓకె చెప్పాడు.
‘బాహుబలి’.. దర్శక ధీరుడు రాజవౌళి రూపొందించిన ఈ విజువల్ వండర్ దేశ వ్యాప్తంగా ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా చివర్లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అన్న సస్పెన్స్ను అలాగే దాచిపెట్టిన రాజవౌళి, ఆ సస్పెన్స్ కోసం బాహుబలికి రెండో భాగమైన ‘బాహుబలి ది కంక్లూజన్’ వచ్చేవరకూ ఎదురుచూడమని చెప్పారు.