S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నాగార్జున కథానాయకుడిగా అక్కినేని అన్నపూర్ణ స్టుడియోస్ పతాకంపై కల్యాణకృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున రూపొందిస్తున్న చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను నాగార్జున వివరించారు.
సుధీర్బాబు, వామిక జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్కుమార్, శశిధర్ నిర్మిస్తున్న చిత్రం ‘్భలే మంచి రోజు’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 25న విడుదలవుతున్న సందర్భంగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వివరాల్ని తెలియజేస్తూ ఈ చిత్రంలో మెకానిక్గా నటిస్తున్నానని, భాష, వేషం అంతా అదే స్థాయిలో ఉంటుందని అన్నారు.
హైదరాబాద్
హైటెక్ సిటీలో
36 ‘డ్రైవ్ ఇన్ స్ట్రీట్’ను ప్రారంభిస్తున్న సందీప్ కిషన్. కార్యక్రమంలో హీరో నవీన్ చంద్ర,
అల్లు శిరీష్,
హీరోయిన్
దీక్షాపంత్, అర్జున్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
రవితేజ, తమన్నా, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా సంపత్నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన బెంగాల్ టైగర్ చిత్రం ఇటీవల విడుదలై మంచి వసూళ్లతో దూసుకుపోతున్న సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటుచేసిన విజయోత్సవ సభలో రవితేజ మాట్లాడుతూ ఈ చిత్రంతో సంపత్నందికి హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా వుందని, ఈ సినిమా విజయంకోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని అన్నారు.
‘ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. కేవలం రెండు గంటలపాటు ఎంటర్టైన్మెంట్ను కోరుకునే వారు ఎక్కువయ్యారు. అందుకే సినిమాలన్నీ ఆ బేస్లోనే వస్తున్నాయి’ అని అంటున్నాడు హీరో గోపీచంద్. ఆయన హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సౌఖ్యం’. రెజీనా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ప్రసాద్ నిర్మిస్తున్నారు.
‘ముకుంద’, ‘కంచె’ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్తేజ్ తాజాగా నటించిన చిత్రం ‘లోఫర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. హైదరాబాద్లో శనివారం నిర్వహించిన విజయోత్సవ సభలో దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ నిర్మాత కళ్యాణ్గారు చెప్పినట్టు సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు.
రామ్, కీర్తి సురేష్ జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న చిత్రం ‘నేను శైలజ’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ఈనెల 21న ఆడియో విడుదల చేసుకోవడానికి సిద్ధమవుతున్న సందర్భంగా చిత్ర వివరాలను నిర్మాత స్రవంతి రవికిశోర్ తెలియజేశారు. ‘ఒక అబ్బాయి అమ్మాయి’ మధ్య జరిగే ప్రేమకథ ఇది.
ఆర్.పి.ఎ క్రియేషన్స్ పతాకంపై సునీల్, మనార్ఛోప్రా జంటగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.సుదర్శన్రెడ్డి రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ వైజాగ్లో పూర్తిచేశారు. ప్రొడక్షన్ నెం.2గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరించారు.
సంజయ్లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘బాజీరావ్ మస్తాని’ చిత్రం ప్రత్యేక ప్రదర్శనకు బాలీవుడ్ తారలు తరలివచ్చారు.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన రణవీర్సింగ్, దీపికాపదుకొనేను వీరంతా అభినందించారు. అలనాటి తారలు రేఖ, మాధురిదీక్షిత్, శిల్పాశెట్టి, శ్రీదేవి చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారు.