S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈమధ్యే గోపీచంద్ హీరోగా వచ్చిన ‘జిల్’ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్గా పెద్దగా వర్కవుట్ కాకపోయినప్పటికీ ఈ సినిమాలో గోపీచంద్ చాలా కొత్తగా కన్పించాడని అన్నారు. ప్రస్తుతం ఆయన ‘సౌఖ్యం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మరో చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
‘బాహుబలి’ భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం దాదాపు 500 కోట్ల భారీ వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్గా రూపొందే ‘బాహుబలి-2’ కోసం ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి.
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్తో పాపులరైన అవికాగోర్ ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా తరువాత హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకుని వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా అవికాగోర్, సంతోష్ జంటగా పి.రామ్మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తను నేను’. ఈ చిత్రం రేపు విడుదలవుతున్న సందర్భంగా అవికాగోర్ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లో...
వెంకటేష్, మారుతి కాంబినేషన్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం వచ్చేనెల ప్రారంభం కానుంది. నయనతార కథానాయికగా నటించనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ తమ రెండవ చిత్రంగా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. డిసెంబర్ 16న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు.
ఆమధ్య పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బుజ్జిగాడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బెంగుళూరు ముద్దుగుమ్మ సంజన. ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన ఈమెకు కెరీర్ పరంగా సరైన బ్రేక్ రాలేదు. తాజాగా ఈ భామకు లక్క్ ఛన్స్ దక్కిందని చెప్పాలి. ప్రముఖ నటుడు పవన్కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న ‘సర్దార్ గబ్బర్సింగ్’ చిత్రంలో సంజనకు ఛాన్స్ దక్కింది.
ఎక్కడ కెరీర్ వుంటే అక్కడే ఓ ఇల్లు కట్టుకోవడం బెస్ట్ అంటోంది అందాల నాయిక రాశిఖన్నా. ఆమె నటించిన చిత్రాలు ఇటీవల బాగానే విడుదలవుతున్నాయి. సినిమా హిట్టయినా ఫట్టయినా ఆమెకు ఏ సంబంధం లేకుండా అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో తన స్టార్ ఇప్పట్లో బాగానే ఉందన్న ముందుజాగ్రత్తతో, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దూరంగా వుండాల్సి వస్తోందన్న బాధతో రాశిఖన్నా ఇక్కడే ఇల్లు కట్టుకుంటోందట.
‘వియ్ లవ్ బ్యాడ్బాయ్స్’ అంటూ ఆమధ్య బిజినెస్మాన్ చిత్రంలో హాట్ హాట్ సాంగ్తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామర్ భామ శే్వతా భరద్వాజ్ ఆ సినిమాతో టాలీవుడ్లో దుమ్మురేపుతుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా తరువాత ఈ భామకు అనుకున్న అవకాశాలేవీ దక్కలేదు. ఒకటి రెండు పాటల్లో నటించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈమెకు తాజాగా మరో క్రేజీ అవకాశం దక్కింది.
సూర్య-సమంత జంటగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘24’ సినిమా ఫస్ట్లుక్
అసలే అవకాశాలు లేవు. దానికితోడు ఏ ప్రమోషన్కు రాను అంటే ఊరుకుంటారా? డబ్బులు పెట్టిన నిర్మాత పరిస్థితి కూడా చూడాలి కదా! ఇవన్నీ పట్టించుకోకపోవడంవల్ల, సినిమాలు ఢమాల్మని పేలిపోవడంవల్ల త్రిషకు అవకాశాలు తగ్గుతున్నాయి. దాదాపు ఈ సంవత్సరంలో ఆమె నటించిన చిత్రం మరొకటి రాకపోవచ్చు. అయితే ‘నాయకి’ అనే హారర్ చిత్రంలో ప్రస్తుతం త్రిష నటిస్తోంది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు.
శేఖర్, సుష్మ జంటగా వరదన్ దర్శకత్వంలో దత్తాత్రేయ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పణుకు రమేష్బాబు, వర్మ నిర్మిస్తున్న చిత్రం ‘నేను నా ప్రేమకథ’.