S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రస్తుతం మహేశ్బాబు ‘మహర్షి’ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. హైదరాబాద్- రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగు కొనసాగుతోంది. ఇక్కడ వేసిన విలేజ్ సెట్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్బాబు కాలేజ్ స్టూడెంట్గా, కార్పొరేట్ సంస్థకి సీఈఓగా, గ్రామంలో రైతుల సమస్యలను పరిష్కరించే యువకుడిగా కనిపించబోతున్నాడు. మహేష్బాబు సరసన కథానాయికగా పూజాహెగ్డే అలరించనుంది.
అల్లుడు శీనుతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై.. ఆ తరువాతి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తాజాగా ఆయన పవర్ఫుల్ పోలీస్గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గ్లామర్ హీరోయిన్స్ కాజల్, మెహరీన్లు నటించిన ‘కవచం’ చిత్రం ఈనెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో సాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు..
కొత్త దర్శకుడితో..
సెనే్సషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరో రేర్ ఫీట్ సాధించాడు. 2018కిగాను అత్యధిక ఆదాయాన్ని పొందిన టాప్ 100 జాబితాలో విజయ్ చోటు సంపాదించాడు. ప్రముఖ మాగజైన్ ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో విజయ్ దేవరకొండ 14 కోట్లతో 72వ స్థానంలో నిలిచాడు.
తమన్నా భాటియా, సందీప్ కిషన్, నవదీప్, శరత్బాబు, పూనమ్ కౌర్, లారిస్సా ప్రధాన తారాగణంగా వైకింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి., అక్షయ్పురి ప్రొడక్షన్స్ పతాకాలపై కునాల్ కొహ్లి దర్శకత్వంలో రైనా జోషి నిర్మాతలుగా నిర్మించిన చిత్రం ‘నెక్స్ట్ ఏంటి’. ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలవుతుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సందీప్కిషన్ మాట్లాడుతూ.. ‘నిర్మాత అక్షయ్పూరి చాలా పాజిటివ్ పర్సన్.
సుమంత్, ఇషారెబ్బ జంటగా నూతన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం సుబ్రహ్మణ్యపురం. ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఈనెల 7న విడుదల అవుతున్న సందర్భంగా నిర్మాత సుధాకర్రెడ్డి చెప్పిన విశేషాలు.. భగవంతుడి ఉనికి అనేది నమ్మకం అనే పునాదుల మీద ఉంటుంది.
అందానికితోడు అభినయమున్న హీరోయిన్లు తెలుగులో అరుదు. ఈరెంటితోపాటు చలాకీతనం ఉన్న హీరోయిన్ జెనీలియా. కళ్లతోనే భావాల్ని పలికించగల నైపుణ్యం ఆమె సొంతం. అప్పట్లో బొమ్మరిల్లు సినిమాతో అల్లరిభామగా పేరుతెచ్చుకొని అటు ఫ్యామిలీ ఆడియెన్స్కు, ఇటు కుర్రకారుకి దగ్గరైంది. బాలీవుడ్ నటుడు రితీష్ దేశముఖ్తో వివాహమయ్యాక సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం జెనీలియా ఇద్దరు పిల్లల తల్లి.
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘మారి-2’కి సెన్సార్ పూర్తవ్వడంతో -విడుదలకు సిద్ధమైంది. ట్రైలర్ని బుధవారం విడుదల చేసి, క్రిస్మస్ కాన్కగా డిసెంబర్ 21న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. సూపర్హిట్ అందుకున్న ‘మారి’కి ఇది సీక్వెల్. బాలాజీ మోహన్ తెరకెక్కించాడు.
శివ ఫిలిం ఫ్యాక్టరీ బేనర్పై శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘సూపర్పవర్’. ఈ చిత్రం ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ప్రముఖులు సారిపల్లి కొండలరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు. వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.
సినీ ప్రేమికులను త్వరలో మరో త్రీడీ సినిమా అలరించబోతోంది. ప్రస్తుతం సూపర్స్టార్ రజనీ, గ్రేట్ డైరెక్టర్ శంకర్, బాలీవుడ్ హీరో అక్షయ్కుమార్ల సినిమా రోబో 2.0 త్రీడీ వెర్షన్లో కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేటర్లనుంచి వెళ్లకముందే మరో త్రీడీ సినిమా మనల్ని అలరించనుంది. భారీ బడ్జెట్తో హాలీవుడ్లో తెరకెక్కిన ఆక్వామేన్ అనే త్రీడీ సినిమా ఈనెల 14న విడుదల కానుంది.
అందాల చందమామగా సౌత్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది కాజల్. స్టార్ హీరోలతోపాటు కుర్ర హీరోలతోనూ సినిమాల మీద సినిమాలు చేస్తోంది. తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఇమేజ్ తెచ్చుకున్న కాజల్, మంచి పాత్రల కోసం ఎదురు చూస్తోందట. తాజాగా ఆమె కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కవచంలో కనిపిస్తోంది. 7న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా మీడియాతో కాజల్ ముచ్చట్లు.
ఎలా ఎంచుకున్నారు?