S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మాస్ హీరో ఇమేజ్ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తూ ఆడియన్స్కి దగ్గరయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. తాజాగా మాస్ని ఆకట్టుకునేలా పోలీస్ కాప్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆ చిత్రమే -కవచం. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చేసేది పోలీస్ పాత్రే అయినా, మాస్కి నచ్చే అంశాలకే ఎక్కువ ఉండేలా చూసుకున్నాడట.
పనితో మెప్పించు. పొగరుతో కాదు -ఎంత గొప్ప మాట కదూ. అనుభవజ్ఞుల నుంచి అందే సలహాలు పొడిపొడిగా కనిపించినా లోతెక్కువ ఉంటాయని అంటారు, ఇలాంటి మాటలు చూసే. అందుకే -అక్క చెప్పిన మాటను సందర్భాను సారం గుర్తుచేసుకుంటూ ముందుకెళ్తోంది బాలీవుడ్ స్టార్ ఇసాబెల్లె కైఫ్. ముంబయిలో ఓ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా కార్యక్రమానికి హాజరైన ఇసాబెల్లె -పనిలో పనిగా అక్కడ తనను కలిసిన మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది.
అంతా కొత్త ఆర్టిస్టులు. కొత్త దర్శకుడు. మరోపక్క చిన్న సినిమాల నిర్మాతగా ఇమేజ్ తెచ్చుకున్న బెక్కం వేణుగోపాల్. ప్రముఖ నిర్మాత దిల్రాజుతో కలిసి నేను లోకల్ అంటూ ఓ సూపర్హిట్ కొట్టేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఉత్సాహం. ఆ ఉత్సాహంతో సొంతంగా తెరకెక్కించిన చిత్రం ‘హుషారు’. యూత్ఫుల్ సినిమాగా ఇండ్రస్టీలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
సూపర్స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన భారీ విజువల్ వండర్ ‘2.0’. 3డి, 2డి ఫార్మాట్లో వచ్చిన చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ.110 కోట్లు వసూలు చేస్తే, తెలుగు రాష్ట్రాల్లో రూ.21.5 కోట్లు రాబట్టింది.
ముకుంద సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది పూజాహెగ్డే. ఆ మూవీ అంత పెద్దగా వసూళ్లు రాబట్టకపోయినా పూజా నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. దీంతో వెంటనే అమ్మడుకి బాలీవుడ్లో కూడా ఛాన్స్ వచ్చింది. అక్కడ మూవీ ప్లాప్ కావడంతో తిరిగి మళ్లీ తెలుగు సినిమాల్లో బిజీగా ఉంది. ఇటీవలే ఆమె నటించిన సినిమాలు విజయం సాధించాయి.
నాచురల్ స్టార్ నాని హీరో. వైవిధ్యమైన కథలతో చిత్రాన్ని తెరకెక్కించే విక్రమ్కుమార్ దర్శకుడు. ఈ ఆసక్తికరమైన కాంబోకి మరో సెనే్సషన్ తోడైంది. అదేంటంటే -హీరో సిద్ధార్థ్ విలన్ పాత్ర పోషించనుండటం. నాని ప్రస్తుతం గౌతమ్ తిన్నసూరి క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న జెర్సీ చిత్రంతో బిజీగా ఉన్నాడు. జెర్సీలో నాని క్రికెటర్ పాత్ర పోషిస్తుండటం తెలిసిందే.
తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజవౌళి తనయుడు కార్తికేయ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. షోయింగ్ బిజినెస్ పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించాడు. తొలిసారి కార్తికేయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘ఆకాశవాణి’. రాజవౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
‘హార్న్ ఓకే ప్లీజ్’ టైంలో నేను ఎదుర్కొన్న లైంగిక వేధింపులతో భయపడిపోయాను. తీవ్ర మనోవేదన అనుభవించాను. ఆ టైంలో చచ్చిపోవాలన్నంత భావన కలిగి కుంగిపోయాను. కానీ, నాకు నేనే ధైర్యం చెప్పుకుని మొండిగా ముందుకెళ్లా’ అంటోంది తనూశ్రీదత్తా. భారత్లో మీటూ ఉద్యమం వేళ్లూనుకుందంటే -మాజీ హీరోయిన్ తనూశ్రీ దత్తావల్లే. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
హీరో సుమంత్ నటిస్తున్న వైవిధ్య చిత్రం -ఇదం జగత్. అంజు కురియన్ హీరోయిన్. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్లు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రానికి అనిల్ నీలకంఠం దర్శకుడు. నిర్మాణానంతర పనులు ముగింపునకు రావడంతో డిసెంబర్ 14న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు వెల్లడించారు.
‘కొత్త బంగారులోకం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది శ్వేతబసుప్రసాద్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. అయితే అదృష్టం బాగాలేకనే మరేంటో కాని శ్వేతబసు తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలం అయ్యింది. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన శ్వేతబసు త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఈ విషయమై స్వయంగా ఆమె క్లారిటీ ఇచ్చేసింది.