S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సాటివారికి సేవ చేసే మనిషిలోనే దైవమున్నాడని నమ్మే కాదంబరి కిరణ్, మనం సైతం సేవా కార్యక్రమాలతో ఆ విషయాన్ని నిరూపిస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ లక్షలాది సైన్యంగా ఎదుగుతోంది. వందలాది పేదలు తమను ఆదుకోవాలంటూ సేవా సంస్థను ఆశ్రయిస్తున్నారు. తాజాగా మరికొందరు పేదలకు మనం సైతం ఆర్థిక సాయం అందించింది.
సుమంత్ హీరోగా రానున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్రెడ్డి సినిమా నిర్మిస్తున్నారు. ఈషా రెబ్బా కథానాయిక. నవంబర్లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో విడుదల చేసిన చిత్ర టీజర్ 24 గంటల్లో మిలియన్ డిజిటల్ వ్యూస్ రాబట్టి ట్రెండింగ్ అవుతోంది.
రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే విడుదలైన సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘సినిమా చూపిస్తమావ’, ‘నేను లోకల్’, ఇప్పుడు హలోగురు ప్రేమకోసమే..
రచయత త్రివిక్రమ్ సంభాషణల్లో ఒక పదునుంటుంది. అది రెట్టింపై అరవింద సమేతలో కనిపించింది. దర్శకుడిగానూ నటీనటుల నుంచి చక్కటి హావభావాలను రాబట్టగలిగాడు అని అరవింద సమేత సక్సెస్ మీట్లో సీనియర్ హీరో బాలకృష్ణ అభినందించారు. నందమూరి హీరోలుగా ఎన్నో చారిత్రాత్మక సినిమాలు తెలుగులో తెరకెక్కించాం. స్ర్తిలను గౌరవించే సంప్రదాయం మనది. అభిమానం వేరు.. ఆత్మాభిమానం వేరు. సంప్రదాయ పద్ధతే విద్య అని అంటాం.
పెళ్లిచూపులు, అర్జున్రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినావున్న స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సీవాలా’. మంచి అభిరుచిగల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న జిఏ 2 పిక్చర్స్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంతో ఎస్కెఎన్ నిర్మాతగా, రాహుల్ సాంకృత్యన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో రెండు భాగాలుగా రానున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ యూనిట్ నుంచి రోజుకో విశేషం బయటికొస్తుంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. చరిత్ర సృష్టించిన గొప్ప పాత్రలున్న చిత్రంలో, పాత్రల స్థాయికి తగ్గట్లుగానే భారీ తారాగణాన్ని ఎంపిక చేస్తున్నారు. తాజాగా అలనాటి అందాల హీరోయిన్ జయప్రద పాత్రను ప్రస్తుత హీరోయిన్ తమన్నా చేస్తోంది.
మైటీ మూవీస్ పతాకంపై షకలక శంకర్ హీరోగా ఎఎ ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘శంకర్ పహిల్వాన్’. అబ్దుల్ అజీమ్, మిర్జా అబిద్ హుస్సేన్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న చిత్రం గురించి నిర్మాతలు వివరాలు వెల్లడిస్తూ గ్రామీణ క్రీడలైన కుస్తీ పోటీల నేపథ్యంగా కథ సాగుతుందన్నారు. దివంగత శ్రీహరి సోదరుడు శ్రీ్ధర్ పహిల్వాన్గా, హీరోకు తండ్రి పాత్రలో కనిపిస్తాడన్నారు.
నలల్స్వామి సమర్పణలో యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తనీష్, పరుచూరి రవి, ప్రియాసింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, షఫీ, పోసాని కృష్ణమురళి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘రంగు’. కార్తికేయ వి దర్శకత్వంలో ఎ పద్మనాభరెడ్డి, నల్ల అయ్యప్పనాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్లో సినిమా ట్రైలర్ను పరుచూరి వెంకటేశ్వరరావు విడుదల చేశారు.
రామ్చరణ్ నటిస్తున్న 12వ చిత్రం టైటిల్పై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. చిత్రానికి ‘స్టేట్ రౌడీ’, ‘వినయ విధేయ రామ’ టైటిల్స్ ప్రచారంలోవున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘వినయ విధేయ రామ’ క్లాస్ టైటిల్ను ఖరారు చేశారు. త్వరలోనే టైటిల్ను అధికారికంగా ప్రకటించనున్నారు. బోయపాటి శీను తెరకెక్కిస్తున్న చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్.
అనసూయ భరద్వాజ్, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో రానున్న చిత్రం ‘కథనం’. గాయత్రి ఫిలింస్, ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నరేందర్ రెడ్డి బట్టేపాటి, శర్మ చుక్కా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజేష్ నాదెండ్ల దర్శకుడు. దగ్గుబాటి రానా చిత్రం ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం కథనం చిత్రీకరణ జరుగుతోంది.