S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చిన్న సినిమాగా వచ్చిన ‘నాటకం’ రక్తికట్టిందని నిర్మాత రిజ్వాన్ ఆనందం వ్యక్తం చేశారు. ‘మా బ్యానర్లో తొలి సినిమా పెద్ద హిట్టు కావడం హ్యాపీగా ఉంది. ఈ ఉత్సాహంతో మరిన్ని చిత్రాలు నిర్మించేందుకు పూనుకుంటాం. కొత్త ఆర్టిస్టులతో చేసిన చిన్న సినిమా అయినా, అందరూ కష్టపడ్డాం. అందుకు మీ ఆదరణ ప్రతిఫలం దక్కింది’ అన్నారు.
త్రివిక్రమ్ ‘అరవింద సమేత..’తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే పనిలో నిమగ్నమై ఉన్నాడు. తరువాతి చిత్రం మల్టీస్టారర్ కావొచ్చన్న టాక్ వినిపిస్తోంది. అది వెంకటేష్, బన్నీలతో కావొచ్చన్నది తాజా సమాచారం. ఇప్పటికే విక్రమ్కుమార్ చెప్పిన కథ సెకెండాఫ్తో సంతృప్తిచెందని వెంకటేష్, ఆ ప్రాజెక్టును పక్కనపెట్టి త్రివిక్రమ్పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
మరో కమెడియన్ హీరో అవుతున్నాడు. టీవీ షోస్ నుంచి సిల్వర్ స్క్రీన్కు ఎంట్రీ ఇచ్చి కమెడియన్గా ప్రూవ్ చేసుకున్న షకలక శంకర్ హీరో అవుతున్నాడు. అదీ మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్తో. శ్రీ భవాని ఫిలింస్ పతాకంపై జి వరలక్ష్మి సమర్పణలో శంకర్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘ఖైదీ’. హనుమాన్ కృష్ణ దర్శకుడు. శ్రీనివాసరావు గొలుసు నిర్మాత. ఈ చిత్రానికి విజయదశమి నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
అమలాపాల్ పేరు తెలీని సినీ ప్రేమికులు దాదాపుగా ఉండరు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అమలాపాల్. ఇక దర్శకుడు ఎఎల్ విజయ్తో ప్రేమ.. పెళ్లి.. విడాకులు అనేది ఒక పెద్ద ఎపిసోడ్. ఇపుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యింది. త్వరలో రెండో పెళ్లి చేసుకునేందుకు అమల రెడీగా ఉందని కోలీవుడ్ మీడియా కథనాలు వండుతోంది.
జయప్రద, పూర్ణ, సాక్షిచౌదరి ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం సువర్ణసుందరి. సూపర్ నేచురల్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్తో దర్శకుడు సూర్య ఎన్ఎస్ఎన్ తెరమీదకు తెస్తున్నాడు. చరిత్ర.. భవిష్యత్ను వెంటాడుతోందన్న ఆసక్తికరమైన క్యాప్షన్తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమాను డిజైన్ చేస్తున్నారు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ఖాన్ నిర్మిస్తున్న తాజా చిత్రం లవ్ యాత్రీ. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తూనే ఉన్నాయి. టైటిల్ మార్చాలంటూ పలు హిందూ సంఘాలు యాగీ మొదలెట్టాయి. నిజానికి ఈ సినిమా లవ్ రాత్రి అనే టైటిల్ పెట్టారు. సినిమా దసరా, నవరాత్రుల నేపథ్యంలో కథ ఉంటుందట. హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే ఈ నవరాత్రుల నేపథ్యంలో తీసిన సినిమాకు ‘లవ్ రాత్రి’ అనే టైటిల్ పెడతారా? అంటూ పెద్ద రాద్ధాంతమే జరిగింది.
ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో సంచలనంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం సైరా. ఉద్యమయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథగా తెరకెక్కుతున్న చిత్రం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న చిత్రానికి సంబంధించి తాజా కథనం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉద్యమయోధుడి కథ విషాదాంతంగా ముగిసిన నేపథ్యంలో, చిరంజీవి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని క్లైమాక్స్లో కొద్దిమార్పులు చేసేందుకు యోచిస్తున్నట్టు సమాచారం.
జూ.ఎన్టీఆర్ తాజా చిత్రం -అరవింద సమేత. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరింది. ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతోన్న సినిమాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. అరవింద సేమతో ఓ స్పెషల్ అప్పియరెన్స్ ఉందట. అదే.. ఐటెమ్ సాంగ్. అందుకు బాలీవుడ్ భామను రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారట.
గీత గోవిందం చిత్ర విజయంతోపాటు వందకోట్లకు పైనే వసూళ్లు రాబట్టిన ఉత్సాహంతో గీత ఆర్ట్స్ చిన్న సినిమాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ బ్యానర్లో హీరో నాగశౌర్యతో సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. నాగశౌర్య హీరోగా ఓ యువ దర్శకుడితో సినిమాకు ప్లాన్ చేశారు. తక్కువ బడ్జెట్తో తెరకెక్కే ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుందట.
ఖయ్యూమ్, షాని సోలెమాన్, పృధ్వీరాజ్, తనిష్క్ తివారి, సమీర్, లోహిత్కుమార్ ముఖ్యపాత్రల్లో గౌతమ్రాజ్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతూ నటుడు ఆలీ సమర్పణలో సారా క్రియేషన్స్ పతాకంపై రామగౌతమ్ నిర్మిస్తున్న చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ రాజ్కుమార్ చెప్పిన విశేషాలు..