S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/12/2018 - 20:37

తన అసమాన అభినయంతో ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసి నటిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది ప్రముఖ నటి రమ్యకృష్ణ. ఇటీవల బాహుబలి సిరీస్‌లో రాజమాత శివగామిగా పవర్‌ఫుల్ పాత్రతో అందర్నీ అలరించింది. తాజాగా రమ్యకృష్ణ నట ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపుదిద్దుకుంటోన్న శక్తివంతమైన చిత్రం రాణి శివగామిలో టైటిల్ పాత్రలో మరోసారి మెరవనుంది.

08/12/2018 - 20:29

మనిషికి ఆశ ఉండడం సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే అనర్థాలు జరుగుతాయి. అత్యాశపరులను టార్గెట్‌చేసే ఓ వ్యక్తి కథతో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘చతురంగ వేట్టయ్’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ‘బ్లఫ్‌మాస్టర్’ పేరుతో రీమేక్ అవుతోంది. శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లయ్ ఈ చిత్రానికి నిర్మాత.

08/12/2018 - 20:27

అక్రమ్ సురేష్ హీరోగా , దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని రాజధాని అమరావతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభమైన ఈ సినిమా అరవై శాతం టాకీపార్టుతోపాటు మూడు పాటల చిత్రీకరణ కూడా పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎమ్.శివకుమారి మాట్లాడుతూ.. ‘ఇంతవరకూ గోవా, విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ చేశాం.

08/10/2018 - 20:41

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాతలు నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం నిర్మాణం పూర్తయింది. ఈనెల 31న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం తొలి గీతం ‘అను బేబీ’ ఈరోజు ఉదయం 10 గంటలకు ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ద్వారా విడుదలయింది.

08/10/2018 - 20:39

ప్రస్తుతం అన్న ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నాడు బాలయ్య. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఫిలింసిటీలో రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత బాలయ్య ఓవైపు బోయపాటి శ్రీనుతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ఆయనతో సినిమా చేయడానికి మాస్ దర్శకుడు వి.వి.వినాయక్ ప్రయత్నాలు ఎప్పుడో మొదలుపెట్టాడు. ఇప్పటికే కథ విషయంలో వీరిద్దరికి కుదరడం లేదు..

08/10/2018 - 20:37

మాజీ మిస్టర్ ఆంధ్రా బల్వాన్, శ్రావణి హీరోహీరోయిన్లుగా మజ్ను ఫిలింస్ పతాకంపై కృష్ణమోహన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మజ్ను బ్రదర్స్ ఎస్.ఎం.సంధాని భాషా, మజ్ను సోహ్రాబ్ నిర్మాతలుగా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘డిటెక్టివ్ భాస్కర్’ షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మజ్నుబ్రదర్స్ మాట్లాడుతూ..

08/10/2018 - 20:36

వజ్ర శ్రీ ఫిలిమ్స్, జి.బి.మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్.1గా మరిడి శ్రీనివాస్ నిర్మాతగా పరిచయమవుతూ మాల్యాద్రి మామిడి (ప్రదీప్) దర్శకుడిగా పరిచయంచేస్తూ ఓ కొత్త చిత్రం మొదలుకానుంది. ఈ సందర్భంగా నిర్మాత మరిడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేను గతంలో సినిమా రచయతగా అవకాశాలకోసం ప్రయత్నాలు చేయడం జరిగింది. అప్పట్లో కుదరలేదు. తరువాత మా బిజినెస్ వర్క్స్ ఉండి వెళ్ళవలసి వచ్చింది.

08/10/2018 - 20:16

యాక్షన్ హీరో అర్జున్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన హీరోగా నటించినా, క్యారెక్టర్ పోషించినా... ఆయన స్థానం ప్రత్యేకం. అందుకే అభిమానులు ఆయన సినిమాకోసం ఎదురుచూస్తుంటారు. మరి అలాంటి యాక్షన్ హీరో అర్జున్ నటించిన 150వ సినిమా ఎంత ప్రత్యేకమో చెప్పక్కర్లేదు. యాక్షన్‌కింగ్ అర్జున్ నటించిన 150వ చిత్రం కురుక్షేత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది.

08/10/2018 - 20:46

సమ్మోహనంతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనం చేసిన సుధీర్‌బాబు హీరోగా, సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే...’ ఈ చిత్రంలోని ‘వౌనం మాటతోటి..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. విడుదల చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. అజనీష్ లోకనాథ్ సంగీతమందించటంతోపాటు గాయకుడిగా మెప్పించాడు.

08/10/2018 - 20:44

ఈమధ్య హీరోయిన్ల వ్యవహారమే అర్థంకాని పరిస్థితిలో ఉంది. అసలే గ్లామర్ పోటీ.. దానికి తట్టుకునేందుకు ఎంతకైనా వెనకాడడం లేదు. పైగా ఈమధ్య బికినీలు, టూపీసులు, లిక్‌లాప్‌లు టాప్‌లెస్ అంటూ భామలందరు ఒకరిని మించి ఒకరు జనాల్లో హీట్ పెంచేస్తూ ఉన్నారు. తాజాగా తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా వచ్చిన చిలసౌ॥ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయినా రుహానీ శర్మ ఆ సినిమాలో ఎంతో క్యూట్‌గా కనిపించింది.

Pages